ఎ.జనార్ధన్
ఇంట్రో యాంకర్
సకల చరాచర జగత్తులో దాగిన సూక్ష్మరహస్యాలను, విశ్వాంతరాళంలో నిక్షిప్తమైన విజ్ఞాన బాండాగారాన్ని మీ ముంగిలో దించే “ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
రిపీట్ యాంకర్.
బిగ్ బ్యాంగ్ ద్వారా ఏర్పడ్డ ఈ సకల చరాచర జగత్తులో… ఒక్క భూమి పైనే జీవరాశి మనుగడ సాధ్యమనేది శాస్ర్తవేత్తల అంచనా..మరి ఈ భూమి పైనే మనుగడ సాధ్యమెందుకయింది. అసలీ భూమి పై జీవరాశి ఎలా ఉద్భవించిందో తెలుసుకునే ముందు గతవారం చూసిన విశేషాలు ఒక్కసారి చూద్దాం.
యాంకర్ 1
ఈ సౌర కుటుంబంలో గ్రహగతులను గూర్చి అధ్యయనం చేసి భూమి సూర్యడి చుట్టూ పరిభ్రమిస్తున్న నిజాన్ని కనుగొన్నారు శాస్ర్తవేత్తలు..అంతే ఉత్సాహంతో అసలీ భూమి పై జీవరాశి ఎలా ఉద్భవించింది..జీవరాశి మనుగడకు సాధ్యమయ్యే అంశాలేమున్నయి అనే దిశగా కూడా ప్రయత్నాలు ప్రారంభించిండ్రు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఈ భూమి పై జీవం ఎలా ఉద్భవించింది అనే ప్రశ్నకు ఇప్పటి వరకు శాస్త్రవేత్తల వద్ద సరైన సమాధానం లేదు.ఈ భూమి పై విస్తరించిన సకల జీవరాశి ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవాలంటే ముందు ఈ జీవరాశి మనుగడకు ఉపయోగ పడే అంశాలేంటో పరిశోధించాలి. గాలి, నీరు , నేల, నిప్పు ఇవే ప్రతి జీవి మనుగడకు జీవనాధారమైనవి. ఈ మూడింటి సంయోగం వల్లనే జీవం ఉద్భవించిందనేది శాస్ర్తవేత్తల అంచనా.. కానీ భగ భగ మండే ఈ భూగ్రహం పైకి నీరు ఎలా వచ్చి చేరింది. ఈ నీరు భూమిని చల్లబరిచి జీవ కోటి ఆవిర్భావానికి ఎలా దారితీసింది. ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో పడ్డరు శాస్ర్తవేత్తలు. ఎందరో శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడి చేసిన పరిశోధనలో నీటికి జన్మనిచ్చింది గాలే నని తేల్చారు పరిశోధకులు. మంట మండటానికి కారణం కూడా గాలేనన్న పచ్చి నిజాన్ని పరిశోధించి తేల్చారు. ( ఈ ఒక్కలైన్ స్లోగా చదవాలి).. అవును ఈ సకల చరాచర చర జగత్తుకు మూలాధారం మన కంటికి కనిపించని వాయువే..
స్పాట్
నిర్మలంగా ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ నగరాన్ని చూశారా.. ఎత్తైన గాజు భవనాలు. రంగురంగుల విద్యద్ధీపాలతో అలంకరించ బడిన ఆకాశహర్య్మాలు. విహంగ వీక్షణం చేస్తే కనిపించే ఆ ఆధునిక నాగరికత ఆనవాలు మొదలయింది వాయువేగంతోనే..అంతే కాదు వాయువు నిర్మితమైనవే.. ఈ నగరాన్నమోత్తం రకరకాల వాయువులు ఆవరించి ఉన్నయి. నగ్నంగా ఉన్న మానవుడు అగ్గిపెట్టెల్లాంటి గృహాలకు మారే వరకు ఎన్నో మార్పులు. అన్ని మార్పులకు కారణం టెక్నాలజే.. ఈ టెక్నాలజిని నడిపించేది రకరకాల ఎయిర్ పార్టికల్స్..
స్పాట్
మన చుట్టూ మనల్ని తాకి పోయే గాలిలో కొన్ని వేల రకాల ఎలిమెంట్స్ ఉన్నయి. గాలి అంటే మన కంటికి కనిపించని ఒక అదృశ్యశక్తి అని మాత్రమే మనకు తెలుసు. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే..అసలు విషయం అవగతం అవుతది. ఇక్కడ కనిపిస్తున్న మెర్క్యురి, కార్భన్ అణువులను లోతుగా అధ్యయనం చేస్తే అణునిర్మాణం యొక్క అసలు రూపం తెలిసింది. ఇక్కడ అనేక రంగులల్లో కనిపిస్తున్న అణుజాలం మనకు కొత్త పాఠాలను నేర్పుతుంది. ఇక్కడ కనిపించే పరమాణువులు ఒకదానికి ఒకటి బంధాలను ఏర్పరచుకొని కొత్త అణువులు, కొత్త పదార్ధాల తయారీకి దారి చూపుతది. పరమాణువుల మధ్య బంధం ఏర్పడాలంటే కనీసం రెండు నుంచి మూడు పరమాణువులు అవసరం. వీటి మధ్యలో ఉండే కార్భన్ పరమాణువు హైడ్రోజన్ బందాలతో కొత్త పదార్దాలను ఏర్పరుస్తుంది. ఈ హైడ్రోజన్ బంధాల సంఖ్యను బట్టి ఏర్పడే పదార్ధాల ధర్మం ఉంటుంది. ఈ కర్భన పదార్ధాల వల్లనే ఈ ప్రకృతిలో అణువణువు ఏర్పడిందనే విషయాన్ని కనిపెట్టారు. అద్దాల మేడల్లో ఉన్న గ్లాసులన్నీ కర్భన పదార్దంతో తయారయివే..అంతెందుకు జీవద్రవ్యం, ఇంధనం, పదార్ధాలు అన్నీ కార్భన్ నిర్మితాలే..
జీవ నిర్మాణ రహస్యద్వారాల తాళ చెవి దొరికింది..
స్పాట్
ఈ ప్రకృతి పునాదుల మాటున దాగిన జీవరహస్యాలు ఒక్కోక్కటే వెలుగు చూస్తున్నయి. రసాయన ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు వందలాది ప్రయోగాలు చేపడుతున్నరు. రసాయన శాస్ర్త పరిశోధనల్లో సాధించిన ప్రగతి జీవావిర్భావ సూత్రాలను తేలికగా ఛేదించే అవకాశం కల్పించింది. వేలాది సంవత్సరాలకు ముందే గ్రీకులు ఈ ప్రకృతి గాలి, నీరు, నేలల సంయోగమని తేల్చి చెప్పారు. కానీ దీనికి శాస్రీయ రుజువులు ఏమీ లేవు. ఆధునిక శాస్త్రవేత్తలు ఇంతకాలం చేసిన పరిశోధనలో తేల్చిన నిజం కూడా ఇదే… కానీ మోడ్రన్ సైంటిస్టులు జీవోద్భవ ప్రక్రియను కనుగొనే పనిలో ఎన్నో కొత్త విషయాలు వెలుగు చూసినయి. అందులో అసలు జీవ మనుగడకు కారణ వాయువేంటో కనుగొన్నరు శాస్ర్తవేత్తలు.
స్పాట్
బ్రేక్ యాంకర్
నింగి, నేల, ఆకాశం, వాయువు, అగ్ని..వీటిలో అన్నీ సహజంగా లభించేవే..ఒక్క నిప్పు తప్ప. ఈ నిప్పును పుట్టిచ్చే రసాయనాలు కూడా ఉన్నయంటే పెద్ద ఆశ్చర్య పడాల్సింది లేదేమో కానీ.. మానవ మూత్రం నుంచి మంటలు రేపొచ్చనే విషయం రహస్యం మీకు తెలుసా .. ఈ విషయం తెలియాలంటే చిన్న బ్రేక్ అయిపోయే వరకు వెయిట్ చేయాల్సిందే..
యాంకర్ 2
మనం గ్యాస్ స్టౌవ్ ను వెలిగించడానికి లైటర్ ను వాడుతం. ఈ లైటర్ లకంటే ముందు అగ్గిపెట్టెలే దిక్కు.ఈ అగ్గి పెట్టె తయారీలో ఏ మూలకం వాడుతరు. ఈ రసాయనం కనుగొనడానికి దారితీసిన పరిస్థితులేంటి అన్న విషయం తెలుసుకుంటే చాలా అశ్చర్యకరంగా ఉంటది.
స్పాట్
ఎలిక్ బ్రెండ్..ప్రాచీన రసాయన పరిశోధకులు..ఈయన కనగొన్న విషయం అంత సామాన్యమైనది కాదు రసాయన శాస్త్ర పరిశోధనలో ఒక మైలు రాయి అని చెప్పొచ్చు. ఇదిగో ఇక్కడ కనిపించే పరికరాలన్నీ ఆయన ఉపయోగించినవే. ఈ శాస్ర్తవేత్తలంతా నిప్పు, నీరు, గాలి ఎలా ఆవిర్భవించాయో తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఎలిక్ బ్రెండ్ తాను చేసిన ప్రయోగంలో కూడా అచ్చం అటువంటి మూలకాన్నే కనుగొన్నడు.
స్పాట్
ఇక్కడ బర్నెస్ పై మరిగిస్తున్న ఈ రసాయన ద్రావణం ఓ కొత్త మూలకానికి చేసే పరిక్షలాంటిదే.. ఈ సైంటిస్ట్ చేతిలో ఉన్న శాంకవ కుప్పెలో ఉన్న అరలీటర్ యూరియల్ ద్రావణాన్ని బాగా మరిగించి… సుమారు 100గ్రాముల పరిమాణం వచ్చేవరకు చేస్తరు. ఈ ప్రక్రియలో యూరినల్ ద్రావణంలో ఉన్న ఇతర మలిన పదార్ధాలు, స్పటికాలు, లవణాలు కరిగిపోతయి. పూర్తిగా మరిగిన ఈ ఘాడ ద్రవణాన్ని స్టాండ్ కు బిగించిన ఒక పోడవాటి గాజుకుప్పెలో గాజు కడ్డీ సహాయంతో పోస్తరు. దీని కొసను మరొక కుప్పెలో అమరుస్తరు. ఇప్పడు మరలా యూరినల్ ఎక్స్ట్రాక్ట్ ను వేడిచేయగా..అది వేడి వాయువులను విడుదల చేస్తది. ఈ వేడి వాయువులు పొగలు కక్కుతూ ఒక గాజుకుప్పెలో భారంగా నిండిపోతది. పూర్తిగా తెల్లని వాయువుతో నిండిన ఈ గాజు కుప్పెలోకి ఒక రసాయన పదార్ధాన్ని వేయగా ఇదిగో ఇలా ఒక ఎక్స్ ప్లోజీవ్ లైట్ రిలీజ్ అవుతది. కళ్లు మిరిమిట్లు గొలిపే ఈ కాంతి ఎక్కడిది. అందునా నీటిలోంచి తీసిన ఓ కెమికల్ తెల్లని పొగలో వేయగానే ఇంత పెద్ద వెలుగు ఉద్భవించడం నిజంగా అద్భుతమే..ఈ అద్భుతానికి ఎలిక్ బ్రెండ్ పెట్టిన పేరు..కీవోవ్ డ్ లైట్ ఆఫ్ ఫాస్ఫరస్. అవును గాలిలో మండగల సామర్ధ్యం ఒక్క పాస్ఫరస్ కే ఉంది. గాలి, నీరు. నిప్పు, నేలల్లో నిప్పు పుట్టడానికి కారణమైన మూలకాన్ని కనుగొన్నరు శాస్త్రవేత్తలు. ఇప్పడు మన ఇళ్లలో మన వాడే అగ్గిపెట్టెలను తయారు చేసేది ఈ ఫాస్ఫరస్ ను ఉపయోగించే..
స్పాట్
ఈ ఆధునిక యుగంలో ప్రయోగాలు చేయడానికి మనకు కావలసిన పరికరాలు ఉన్నయి. మరింత సురక్షితంగా చేసేందుకు , గాజు పరికరాలు, స్టాండ్లు, సమకూర్చబడ్డయి. కానీ ఆ రోజుల్లో అన్ని ప్రయోగాలు మట్టి కుండలల్లో చేయడం తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే ప్రయోగాలకు కావలసిన వివిధ రూపాల పాత్రలు మట్టితో తయారు చేయడం ద్వారానే సాధ్యం. ఒక్కోసారి పరిశోధకులకు వారు ఎంచుకున్న పాత్రల సామర్ధ్యం సరిగా లేక వాంచిత ఫలితాలు రాక చాలా ఇబ్బంది పడ్డ శాస్త్రవేత్తలు ఉన్నరు. అంతేకాదు ప్రయోగాలు చేసే క్రమంలో జరిగే తప్పుల వల్ల ప్రాణాలు కోల్పోయింది కొదరయితే.. యాదృచ్ఛికంగా కొత్తవిషయాలు కనుగొన్నది మరికొందరు.
స్పాట్
యూరప్ మధ్యయుగంలో ఆయుధ సంపత్తికోసం ప్రయోగాలు చేయనారంబించిండ్రు. అందులో శత్రుసైన్యం పై ప్రయోగించే రసాయనాల తయారీకి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చిండ్రు. ఫిరంగుల్లో వాడే పేలుడు పధార్ధాలు. సలసలా కాగే లావాద్రవంలా శత్రు సైన్యం పై నిప్పుల వాన కురిపించాలనే లక్ష్యంతో ప్రయోగాలు చేపట్టిండ్రు.
బ్రేక్ యాంకర్
యస్..ఈ జీవరాశి మనుగడకు కారణమయిన వాయువేంటి. అసలీ వాయువుని కనుగొనడానికి దారితీసిన పరిస్థితులేంటి. చిన్న బ్రేక్ తరువాత..
యాంకర్ 2
ఈ భూమి పై ఉన్న జీవులన్ని బతకడానికి కారణ మైన వాయువు ఒక్కటే అదే ఆక్సీజన్. అయితే ఈ ఆక్సీజన్.. జీవులు బతకడానికి కారణమైన వాయువేనా ఇంకేమైనా అద్భుతాలు చేయగలదా..ఈ అనుమానం రావడానికి కారణం ఉంది. ఆక్సీజన్ ను కనుగొన్న శాస్త్రవేత్తకు ఎదురైన అనుభవాలేంటి..ఆసక్తికరమైన ఈ ఎక్స్పరిమెంట్ ను మీరే చూడండి.
స్పాట్
భూ అంతర్భాగంలో ఖనిజాలు వెలికితీసే సొరంగ మార్గంలో వాడే లాంతర్లు వెలగడానికి ఇంధనంతో బాటు ఎదో అదృశ్య శక్తి కారణమనే విషయాన్నిగుర్తించారు శాస్తవేత్తలు. పూర్తి ఇంధనం ఉన్నా గాలి తోడు లేకుంటే క్యాండిల్ ఆరిపోవడాన్ని శాస్తవేత్తలు గుర్తిచారు. ఇంతకీ ఈ మంటలను మండించే ఉత్ర్పేరకం ఏంటి..శాస్త్రవేత్తలకు ఇదొక చిక్కు ప్రశ్నగా మారింది. ఈ చిక్కుముడిని విడగొట్టి మనకు ఆక్సీజన్ పరిచయం చేసిన శాస్ర్తవేత్త జోసెఫ్ ప్రీస్ట్ల్ లీ. ఈ నేల పై భూ చరాలు. జలచరాలు, వాయు చరాలు మనుగడ సాగిస్తున్నయంటే దానికి కారణం ఆక్సీజనే. నింగి. నేల, సంముద్రం, ఆకాశం అనే తేడా లేకుండా ప్రతి జీవి జీవక్రియలకు అవసరమైనది ఆక్సీజన్.
స్పాట్
ఈ పచ్చని ప్రకృతిలో ఉన్న స్వేచ్ఛావాయువుల మాటున మర్మాన్ని కనిపెట్టేందుకు ప్రెట్స్ లీ తన శక్తియుక్తులను ధారబోసి మరీ ప్రయోగాలు చేసిండు…ప్రీస్టీ లీ తన ప్రయోగం కోసం రకరకాల పదార్ధాలను వేడి చేసి పరిక్షించిండు. ఇక్కడ కనిపించే పసుపు వర్ణం రసాయనం మెర్క్యురిక్ ఆక్సైడ్.. కొంత పదార్ధన్ని వాచ్ గ్లాస్ లో తీసుకొని దానిని ద్రావణలో వేసి అత్యధిక ఉష్ణోగ్రత వరకు వేడి చేసిండు. ఆ పదార్ధం క్రమేపి నల్లగా మారి ఒక మెరిసే ద్రావణంలా రూపొందింది. ఈ మెరిసే ద్రవం మెటల్ గా గుర్తిచారు. ఇది ద్రవరూప లోహం మెర్క్యురీ..
స్పాట్
పసుపు పచ్చని పదార్ధాన్ని వేడిచేయగా.. మెర్యురీతో బాటు నీటిబుడగలు ఏర్పడటం శాస్ర్తవేత్తలు గమనించిండ్రు.ఈ నీటి బుడగలను గాజుకుప్పె అడుగు బాగంలో పట్టి ఉంచిండ్రు. ఈ వాయువు దగ్గర ఒక వెలిగించిన అగ్గిపుల్లను పెట్టగా అది మరింత కాంతివంతంగా వెలగనారంభించింది. ఆ వెలిగే పుల్లను తీసి ఆర్పివేసి మళ్లీ ఆ గాలిలో ఉంచినా తిరిగి మళ్లీ కాంతిమంతంగా వెలుగుతోంది. అంటే మంట మండటానికి అవసరమైన వాయువు ఆక్సీజన్ అనే విషయం స్పష్టమైంది.
యాంకర్
1774లో ప్రిస్లీ ఆక్సీజన్ ను కనుగొన్నడు. ఎప్పటి నుంచో కొత్త విషయాన్ని ఆవిష్కరించాలన్న తపన ఆక్సీజన్ కనుగొనడంతో తీరింది.
వాయిస్
ప్రిస్లీ ఆక్సీజన్ ను కనుగొనడానికి గాజు జాడీ పాత్ర మరువలేనిది. అతను ప్రయోగం చేసిన గాజుజాడీని అతని గుర్తుగా ఇప్పటికీ పదిలంగా ఉంచిండ్రు. ఆక్సీజన్ను కనుగొన్నంక ప్రీస్లీకి తగిన గౌరవం లభించింది. ప్రెంచ్ ఎక్స్ పరిమెంటల్ లాబరేటరీ కి చెందిన గోల్డెన్ కపుల్స్ మేరియానా, లుథియన్ ల నుంచి ఆహ్వానం అందింది. అక్కడి ప్రయోగ శాలలో పూర్తి స్థాయి నిబద్దత గల ప్రయోగాలకు అనుకూలంగా ఉంది. ప్రతి ప్రయోగం నిర్ణీత కొలతలతో చేయదగిన వీలు ఉంది. మేరియానా దంపతులకు సైన్స్ ను ఆధునిక పద్దతుల్లో తీర్చిదిద్దాలనే బలమైన కోరిక ఉంది. అందుకే వారి లాబ్ లను అధునాతన పద్దతిలో తీర్చి దిద్దిండ్రు. ప్రీస్లీ ఆక్సీజన్నైతే కనుగొన్నాడు కానీ దాని ధర్మాలు పూర్తిగా వివరించలే పోయిండు. ఏదో మండే వాయువుని కనుగొన్నాననే భ్రమలో ఉన్నడు. తరువాత కాలంలో తాను కనిపెట్టిన వాయువు ఎంత గొప్పదో తెలుసుకొని ఆశ్చర్యపోయిండు. ఈ కపుల్స్ లాబరేటరీలో చేసిన ప్రామాణిక పరిశోధనలు ప్రీస్లీకి మంచి ఫలితాన్నిచ్చినయి.
స్పాట్
ప్రీస్లీ సాధించిన ఈ ఘనత ఆధునిక ప్రామాణిక రసాయన శాస్త్రానికి మార్గదర్శకంగా నిలిచింది. రసాయన శాస్త్రంలో కచ్ఛితత్వం పాటించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తయో గూడ నిరూపిత మయింది.
స్పాట్
ఆధునిక రసాయన శాస్త్రం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది.ముందుగా సమాజ అవసరాలు( ఫిరంగి షాట్) తీర్చడానికి ప్రయోగాలు చేపడుతరు. ఈ ప్రయోగాలు చేపట్టడంలో నైపుణ్యాలు తప్పనిసరి. అంతేకాదు రసాయన పదార్ధాల లక్షణాలు తెలిసి ఉండటం ఒక వంతయితే, వాటిని ఏఏ ప్రయోగాలకు వాడుకోవచ్చనే విచక్షణ మరో వంతు. అంటే ఏ పదార్ధాన్ని వేడి చేస్తే..లేదా మరోక ప్రక్రియకు గురిచేస్తే ఇతర వాయువులు వస్తయో తెలిసి ఉండాలి. వీటికి ఎంత పరిమాణంలో రసాయనాలు తీసుకోవాలో కూడా పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణ రసాయన ప్రయోగం అవుతది. ఈ కొత్త రసాయనశాస్రం కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి