1, జనవరి 2012, ఆదివారం

ఆదిలాబాద్‌లో రాకాసి బల్లుల సంచారం



రాకాసి బల్లులు.. ఈ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది... వెండి తెరపై రాకాసు బల్లుల రూపాలను చూసే మనం అమ్మో అనుకుంటాం.. ఇప్పుడు ఆ జాతి పూర్తిగా అంతరించిపోయింది. అయితే ఇంత బలిష్టమైన జీవులు ఈ భూమి పై నుంచి అదృశ్యం కావడానికి కారణాలేంటి. అసలు ఇవి మనుగడ సాగించి, అంతరించిన ప్రాంతాలేవి అనే విషయాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. తాజాగా లభించిన పరిశోధనల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో డైనోసార్లు సంచరించేవని శాస్త్రవేత్తల పరిశోెధనల్లో తేలింది. నిజమా... భారతదేశంలోనే రాకాసు బల్లుల పాదముద్రలున్నాయా.. మన పూర్వికులు రాకాసి బల్లులతో సహవాసం చేశారా.. ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కొనే ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు
ఈ భూమి ఉద్భవించినప్పటి నుంచి ఎన్నో రకాల మార్పులు చెందింది. భూమి పై పొరలు గడ్డకట్టి నీటి ఆవిరి చినుకు రూపంలోకి మారిన క్షణం నుంచీ ఈ భూమి జీవజాతులకు ఆవాసంగా మారింది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం. ఈ భూమి మొత్తం ఒక గడ్డగా ఉండి నీరంతా ఒక వైపు ఉండేదని అంచనా.. ఈ భూ ద్వీపం పైనే జీవ జాతులన్నీ ఉద్భవించాయని.. తరువాత ఖండ చలనం ద్వారా భూమి ఖండాలుగా విడిపోయిందని సిద్దాంతం.. ఈ భూమితో బాటే జీవ జాతులన్నీ విడిపోయాయి. అందుకే అన్ని ఖండాల్లో దాదాపు ఒకే రకమైన జీవజాతులున్నాయి.
అయితే డైనోసార్లు మాత్రం అన్ని ఖండాల్లో అంతరించిపోయాయి. అసలీ డైనోసార్లు ఎందుకు చనిపోయాయి. ఇవి చాలా బలిష్టమైన జీవులు. ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకొని బతకగలవు.. శత్రువును ఎదుర్కొవడంలో దిట్ట.. వీటికంటే బలహీన జీవులు ఉత్పాతాలకు తట్టుకొని జీవిస్తుంటే..ఇవెందుకు అంతరించాయి. ఇదే శాస్త్రవేత్తలను దశాబ్దాలుగా తొలుస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు వారికి దొరికిన ఒకే ఒక సమాధానం... గ్రహశకలం ఒకటి భూమిన ఢీకొందని.. ఆ నిప్పు సెగల్లో ఈ డైనోసార్లు అంతమై ఉంటాయని... ఈ సమాధానం తొలుత అందరికీ నచ్చింది. మెజారిటీ శాస్త్రవేత్తలు ఆమోదించారు కూడా.. కానీ కొందరు శాస్త్రవేత్తలు. మాత్రం ఈ వాదనతో విభేదించారు. గ్రహశకలం ప్రభావం అన్ని జీవులపైనా ఉంటుందని.. అది డైనోసార్లనే ఎందుకు చంపుతుందనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. తాజాగా శాస్త్రవేత్తల్లో భారతదేశంలో జరిపిన పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగు చూశాయి. డైనోసార్ల అంతానికి భూ శకలం ఒక్కటే కారణం కాదని తేలింది.
రాకాసి బల్లులు భారత దేశంలో కూడా సంచరించేవి. ఇవి గోదావరి పరివాహక ప్రాంతంలో విరివిగా సంచరించేవి. ఇవి సంచరించే ప్రాంతంలో ఈత, పైన్ చెట్లు ఎక్కువగా ఉన్నట్టు వీటి విసర్జక పదార్ధాల విశ్లేషణలో తేలింది. దీన్ని బట్ట ఇవి గోదావరి పరివాహక ప్రాంతంలో సంచరించేవని పరిశోధకులు తేల్చారు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలో అగ్ని పర్వతం బద్దలవడం రాకాసి బల్లులకు ప్రాణగండంగా మారింది. ఈ పేలుడులో విషవాయువులు, కార్భన్ డై ఆక్సైడ్, మోనాక్సైడ్ లు వెలువడ్డాయి. ఈ లావా ద్రవం మహా బలేశ్వరం నుంచి పశ్చిమం వైపుకు గుజరాత్ లోని ఖచ్ ప్రాంతం వరకు, ఇటు తూర్పు వైపున గోదావరి నది గుండా బంగాళాఖాతం వరకు ప్రవహించింది. లావా దెబ్బకు ఈ ప్రాంతమంతా బూడిదగా మారింది. కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ గడ్డికూడా మొలవని పరిస్థితి. తర్వాత జరిగిన వాతావరణ మార్పుల్లో నదీ ప్రాంతంలో నీరు ప్రవహించడంతో లావా ప్రవహించిన ప్రాంతమంతా.. సారవంతమై అడవులు పెరిగాయి.. గతంలోనే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండేవి. అవి మాడి మసై పోయాయి. కొన్ని కాలపోకుండా భూగర్భంలో కలిసిపోయాయి... అవే ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో రాకాసి బొగ్గుగా.. విలువైన ఖనిజంగా మనకు లభిస్తోంది.. ఈ దారిలో కొట్టుకు పోయిన ఇంధనాలన్నీ సముద్ర గర్భానికి చేరి అక్కడ కర్భన రసాయనాలుగా రూపాంతరం చెంది కృష్ణా గోదావరి బేసిన్ లో పెట్రోల్ రూపంలో అభిస్తోంది.
భారతదేశంలో లభించిన డైనోసార్ల శిలాజాల వల్ల ఎంతో విలువైన సమాచారం లభించింది. ఇక డైనోసార్ల గురించి పరిశోధన చేసే వారికి ఇండియానే కీలకకానుంది.

ఆదిలాబాద్‌లో రాకాసి బల్లుల సంచారం



రాకాసి బల్లులు.. ఈ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది... వెండి తెరపై రాకాసు బల్లుల రూపాలను చూసే మనం అమ్మో అనుకుంటాం.. ఇప్పుడు ఆ జాతి పూర్తిగా అంతరించిపోయింది. అయితే ఇంత బలిష్టమైన జీవులు ఈ భూమి పై నుంచి అదృశ్యం కావడానికి కారణాలేంటి. అసలు ఇవి మనుగడ సాగించి, అంతరించిన ప్రాంతాలేవి అనే విషయాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. తాజాగా లభించిన పరిశోధనల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో డైనోసార్లు సంచరించేవని శాస్త్రవేత్తల పరిశోెధనల్లో తేలింది. నిజమా... భారతదేశంలోనే రాకాసు బల్లుల పాదముద్రలున్నాయా.. మన పూర్వికులు రాకాసి బల్లులతో సహవాసం చేశారా.. ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కొనే ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు
ఈ భూమి ఉద్భవించినప్పటి నుంచి ఎన్నో రకాల మార్పులు చెందింది. భూమి పై పొరలు గడ్డకట్టి నీటి ఆవిరి చినుకు రూపంలోకి మారిన క్షణం నుంచీ ఈ భూమి జీవజాతులకు ఆవాసంగా మారింది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం. ఈ భూమి మొత్తం ఒక గడ్డగా ఉండి నీరంతా ఒక వైపు ఉండేదని అంచనా.. ఈ భూ ద్వీపం పైనే జీవ జాతులన్నీ ఉద్భవించాయని.. తరువాత ఖండ చలనం ద్వారా భూమి ఖండాలుగా విడిపోయిందని సిద్దాంతం.. ఈ భూమితో బాటే జీవ జాతులన్నీ విడిపోయాయి. అందుకే అన్ని ఖండాల్లో దాదాపు ఒకే రకమైన జీవజాతులున్నాయి.
అయితే డైనోసార్లు మాత్రం అన్ని ఖండాల్లో అంతరించిపోయాయి. అసలీ డైనోసార్లు ఎందుకు చనిపోయాయి. ఇవి చాలా బలిష్టమైన జీవులు. ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకొని బతకగలవు.. శత్రువును ఎదుర్కొవడంలో దిట్ట.. వీటికంటే బలహీన జీవులు ఉత్పాతాలకు తట్టుకొని జీవిస్తుంటే..ఇవెందుకు అంతరించాయి. ఇదే శాస్త్రవేత్తలను దశాబ్దాలుగా తొలుస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు వారికి దొరికిన ఒకే ఒక సమాధానం... గ్రహశకలం ఒకటి భూమిన ఢీకొందని.. ఆ నిప్పు సెగల్లో ఈ డైనోసార్లు అంతమై ఉంటాయని... ఈ సమాధానం తొలుత అందరికీ నచ్చింది. మెజారిటీ శాస్త్రవేత్తలు ఆమోదించారు కూడా.. కానీ కొందరు శాస్త్రవేత్తలు. మాత్రం ఈ వాదనతో విభేదించారు. గ్రహశకలం ప్రభావం అన్ని జీవులపైనా ఉంటుందని.. అది డైనోసార్లనే ఎందుకు చంపుతుందనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. తాజాగా శాస్త్రవేత్తల్లో భారతదేశంలో జరిపిన పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగు చూశాయి. డైనోసార్ల అంతానికి భూ శకలం ఒక్కటే కారణం కాదని తేలింది.
రాకాసి బల్లులు భారత దేశంలో కూడా సంచరించేవి. ఇవి గోదావరి పరివాహక ప్రాంతంలో విరివిగా సంచరించేవి. ఇవి సంచరించే ప్రాంతంలో ఈత, పైన్ చెట్లు ఎక్కువగా ఉన్నట్టు వీటి విసర్జక పదార్ధాల విశ్లేషణలో తేలింది. దీన్ని బట్ట ఇవి గోదావరి పరివాహక ప్రాంతంలో సంచరించేవని పరిశోధకులు తేల్చారు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలో అగ్ని పర్వతం బద్దలవడం రాకాసి బల్లులకు ప్రాణగండంగా మారింది. ఈ పేలుడులో విషవాయువులు, కార్భన్ డై ఆక్సైడ్, మోనాక్సైడ్ లు వెలువడ్డాయి. ఈ లావా ద్రవం మహా బలేశ్వరం నుంచి పశ్చిమం వైపుకు గుజరాత్ లోని ఖచ్ ప్రాంతం వరకు, ఇటు తూర్పు వైపున గోదావరి నది గుండా బంగాళాఖాతం వరకు ప్రవహించింది. లావా దెబ్బకు ఈ ప్రాంతమంతా బూడిదగా మారింది. కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ గడ్డికూడా మొలవని పరిస్థితి. తర్వాత జరిగిన వాతావరణ మార్పుల్లో నదీ ప్రాంతంలో నీరు ప్రవహించడంతో లావా ప్రవహించిన ప్రాంతమంతా.. సారవంతమై అడవులు పెరిగాయి.. గతంలోనే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండేవి. అవి మాడి మసై పోయాయి. కొన్ని కాలపోకుండా భూగర్భంలో కలిసిపోయాయి... అవే ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో రాకాసి బొగ్గుగా.. విలువైన ఖనిజంగా మనకు లభిస్తోంది.. ఈ దారిలో కొట్టుకు పోయిన ఇంధనాలన్నీ సముద్ర గర్భానికి చేరి అక్కడ కర్భన రసాయనాలుగా రూపాంతరం చెంది కృష్ణా గోదావరి బేసిన్ లో పెట్రోల్ రూపంలో అభిస్తోంది.
భారతదేశంలో లభించిన డైనోసార్ల శిలాజాల వల్ల ఎంతో విలువైన సమాచారం లభించింది. ఇక డైనోసార్ల గురించి పరిశోధన చేసే వారికి ఇండియానే కీలకకానుంది.

17, అక్టోబర్ 2011, సోమవారం

అట్లాంటిస్ మహానగరం

మరుగు పడిన మహానగరం.
ఇంట్రో యాంకర్:
ఈ భూగోళం పై మన సకల సౌకర్యాలతో జీవిస్తున్నామని అనుకుంటున్నాము... ఒకప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కాలి నడకే శరణ్యం.. కాస్త సంపన్న వర్గాల కుటుంబాలైతే... రవాణా కొరకు ఎడ్ల బండి, గుర్రాన్ని ఆశ్రయించే వారు.. కానీ ఆధునిక కాలంలో నడిచిపోయేవారే కరువయ్యారు... పేద ధనిక అనే తేడా లేకుండా వాహనాలను వినియోగిస్తున్నారు. ఇదే గొప్ప అని మనం భావిస్తున్నాం.. కానీ ఎటువంటి పర్యావరణ కాలుష్యం లేకుండా అత్యాధునిక వాహనాలు వాడిన శకం ఒకటుంది.. అతి నాజూకైన కళాఖండాలను పోషించిన యుగమొకటుంది.. అతి సుందమైన, అద్భుతమైన కట్టడాలు నిర్మించిన నాగరికత ఒకటుంది.. అదే అట్లాంటిస్.... మనిషి ఎప్పటికప్పుడు తాను అనుభవిస్తున్నదే గొప్ప సౌకర్యవంతమయిన నాగరికత అనుకోవడం పరిపాటి. ఎందుకంటే చంద్రమండలం మీద కూడా కాలుమోపగల సాంకేతిక సామర్ధ్యం నేటి నాగరికత సొంతం కనుక. అలాంటిది... ఇంతకన్న గొప్పనాగరికత ఎక్కడా వుండనే వుండదదు. ఈ భావనలోఉన్నవారికి మతులు పోగొట్టే ఓ గొప్ప సంస్కృతీ సంప్రదాయాలమేళవింపు కొన్ని వేల ఏళ్ళ క్రితమే ఉండేదని తెలిస్తే?! అప్పుడే స్పేస్ షటిల్స్, సబ్ మెరయిన్లున్నాయని చెబితే!? కచ్చితంగా అది షాకింగ్ న్యూసే అవుతుంది. ఇంతకీ ఏమిటది? అదే ఈ రోజు మన స్పెషల్ స్టోరీ అట్లాంటిస్ దీవి..
బ్యాంగ్.... మరుగు పడిన మహానగరం.
యాంకర్ 1
నాగరికతలకే నాగరికత అది. ఎన్నో జీవన చిత్రాలను తీర్చిన అత్యంత పురాతనమైన శైలి అది. ఉన్నట్లుండి ప్రకృతి ప్రకోపానికి బలయిపోవడంతో... ఆ నాగరికత
సముద్రగర్భాన్ని తన శాశ్వత చిరునామా చేసుకుంది. ఆనాటి నుంచీ ఈనాటి వరకూ ఎందరో శాస్త్రజ్ఞులకు పని చెప్పింది... చెబుతూనే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఆనాడే సాధించారని నిరూపించిన గొప్ప సంస్కృతి అది. అదే అట్లాంటిస్ నగర నాగరికత. సుమారు పన్నెండు వేల ఏళ్ళ క్రితమే విరాజిల్లిన ఆ సంస్కృతీ- సంప్రదాయాల విశిష్టతలేంటో... లాస్ట్‌ సిటీ అట్లాంటిస్‌ కాలగర్భంలో కలిసిపోయిన విధానమేంటో తెలుసుకుందాం..
వాయిస్ 1
ఈ భూగోళం ఒకప్పుడు ఇప్పుడున్నట్టు లేదు.. మనం చదువున్నట్టుగా ఖండాలు సముద్రాలన్నీ విడివిడిగా లేవనేది ఖండ చలన సిద్దాంతం చెబుతుంది. ఈ భూమి మొత్తం ఒకే ఖండంగా ఉండేదని... ఏదో ఒక విపత్తు వల్ల భూమి ఖండ ఖండాలుగా విడిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలా విడిపోయిన భూమి ఇప్పటికీ విస్తరిస్తూ ఉందని గణాంకాలతో సహా వివరిస్తున్నారు.. ఈ ఖండ విస్తరణలో నుమరుగయిపోయిన ప్రాంతమే అట్లాంటిస్.. అయితే ఇది ఖండ చలనంలో కనుమరుగయిందా.. లేక.. మరేదైన మాయ జరిగిందా అనే విషయంలో పరిశోధకులకు భిన్నాభిప్రాయాలున్నాయి.
స్మాల్ స్పాట్
వాయిస్
ఇది అందమైన భూగోళం... ఈ భూమి పై రకరకాల జీవ జాతులు వృక్ష జాతులు మనుగడ సాగిస్తున్నాయి.. ఈ భూగోళం పై లక్షల సంవత్సరాలుగా జీవ జాతి మనుగడ సాగిస్తోంది... అయితే ఈ జీవ పరిణామంలో ఎన్నో పరిణామాలు.. ఎన్నో మార్పులు.. ఈ మార్పులు అటు ప్రకృతి పైనా.. ఇటు యావత్ భూగోళం పైనా పడ్డాయి. ఈ పరిణామ క్రమంలో మానవుడిది అత్యంత కీలకమైన పాత్ర. ప్రకృతిలో జీవులందరిలో మనిషి అత్యంత తెలివైన జీవి.. మానవుడు విశ్వాన్ని జయించాలనే కాంక్ష కలిగిన వాడు.. అదిమ కాలంలో కేవలం తన చుట్టూ ఉన్న పరిస్థితులను, ప్రకృతి విలయాలను తట్టుకొని బతకడమే కష్టంగా ఉండేది.. క్రమేపీ ప్రకృతి వనరులను, జీవ జాతులను తన ఆధీనంలోకి తెచ్చుకొని ప్రకృతి మీద పట్టు సాధించాడు. ఆ పట్టుతోనే తన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. అంతే కాదు ప్రకృతిలో కొన్ని రకాల జీవులను తన పుట్టు బానిసలుగా మార్చుకొని.. అవి పుట్టిందే తనకు సేవ చేయడానికన్నట్టు తయారు చేశాడు.
విజువల్స్
ఈ భూగోళం పై జీవ జాతుల ఆవిర్భావానికి నిర్ధిష్టమైన కారణాలను చెప్పడంలో శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు ఏకాభిప్రాయం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన సిద్ధాంతాలలో పరిణామ సిద్ధాంతం కానివ్వండి... ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతం కావచ్చు. ప్రకృతి వరణ సిద్ధాంతాలైనా కొంతవరకే ఆమోదం చెందుతాయే తప్ప కొన్ని ప్రశ్నలకు అవి సమాధానం చెప్పలేక పోయాయి.. ఎందుకంటే ఆయా సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చిన కాలాలలో ఉన్న పరిస్థితులను.. అవకాశాలను బట్టి ఆయా సిద్దాంతాలను ప్రతిపాదించారు.. కానీ ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక పాత తరం సిద్ధాంతాలు చాలా వరకు వట్టి ఊహాగానాలుగానే తేట తెల్లమయ్యాయి. అంతేగాదు పరిణామ సిద్ధాంతాన్ని కూడా కొట్టేసిన సందర్భాలున్నాయి. కానీ మానవ పరిణామం ఎలా జరిగింది అనే విషయం పై నిర్దిష్టమైన ఆధారాలతో కూడాని సమాచారమేదీ మన వద్ద లేదు.. ఎందుకంటే వేల సంవత్సరాలకు పూర్వమే మనిషి తన విజ్ఞానాన్ని ఆకాశం అంచులు తాకేలా పెంచుకున్నాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.. దానికి ఉదాహరణే అట్లాంటిస్... అయితే అట్లాంటిస్ నిజమా.. ఒక ఊహాకాల్పనిక గాథా అన్నది.. ఇప్పటికీ సందేహమే..
విజువల్స్ (అట్లాంటిస్)
ఈ భూగోళం పై మానవ నాగరికత ఎప్పుడు మొదలయింది.. మానవులు ఎలా బతికే వారు... మనకంటే ముందు ఐదు తరాల ముందు వాళ్లంతా చీకటి యుగంలో బతికిన వారేనా.. అంటే కొన్ని సంఘటనలు కాదనే సమాధాన మిస్తున్నాయి. ఎందుకంటే గ్రీకు తత్వవేత్తల వాదనలు.. వారి వద్ద నుంచి వెలుగు చూసిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సామాగ్రి కొన్ని వందల సంవత్సరాలకు ముందే మనిషి ఎంతో విజ్ఞానాన్ని సంపాదించాడనే చెప్పవచ్చు. గ్రీకులు ఇటు బాషా పరంగా, జీవన తాత్విక విషయాల పట్ల, యాంత్రిక విషయాల పట్ల, గ్రహగతుల విషయంలోనూ స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. అంటే మనమనుకున్నట్టు మనకంటే ముందు తరాలన్నీ చీకట్లో జీవించాయనే మాట కేవలం ఊహాజనితమే.. అయితే ఇది ఒక్కో ఖండానికి ఒక్కోరకమైన నీతి ఉంది.. భూమి పై మానవనాగరికత గొప్పగా విలసిల్లిన పట్టణాలు కొన్నైతే.. అసలు పూర్తిగా మనిషికి జంతువుకు తేడా ఏంటో తెలియక పశుసమానంగా జీవించిన జాతి కూడా కొన్ని ప్రాంతాల్లో విలసిల్లింది.. దీనికి కారణం ఏంటి.. ఒక ప్రాంతంలో మనిషి అత్యధిక జ్ఞాన సంపన్నుడై విలసిల్లడానికి... మరికొన్ని ప్రాంతాలలో తిమిరంతో సమరం చేస్తూ దినదిన గంఢంగా బ్రతకడంలో వ్యత్యాసం ఎక్కడుంది.. ఇదే నేటి ఆధునిక మానవుడి ముందున్న అతి పెద్ద ప్రశ్న
విజువల్స్
ఈ భూగోళం పై భూమి ఖండ ఖండాలుగా విభజింపబడి ఉంది.. మానవుడు కానీ జంతువులు కానీ పరిణామ క్రమంలో అభివృద్ధి చెంది ఉంటే.. ఒకే జాతి ఒకే రకంగా వివిధ ఖండాలలో ఎలా అభివృద్ది చెందింది.. ఒక ఖండం నుంచి మరో ఖండం దాటాలంటే ఆకాశ మార్గం లేదా సముద్ర మార్గం తప్ప మరో అవకాశం లేని రోజుల్లో ఈ మానవ పరిణామ క్రమం అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఎలా సాధ్యమయింది.. జీవ జాతులు, వృక్ష జాతులు, ఒకేవిధమైన ఆకారాన్ని, లక్షణాలకు వ్యవహార శైలిని కలిగి ఉండటంలో అసలు రహస్యమేంటి... వందల సంవత్సరాలుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానమే ఖండచలన సిద్ధాంతం.. యస్.. ఖండ చలన సిద్ధాంతంమే ఈ భూమిలో వివిధ ప్రాంతాల మద్య వ్యత్యాసాలకు కారణం. ఖండ చలన సిద్ధాంతమే అభివృద్ధి చెందుతున్న నాగరికత ఆగిపోవడానికి కారణం, ఖండ చలన సిద్ధాంతమే కొత్త జీవ జాతుల ఉద్భవానికి సమాధానము.
విజువల్స్ విత్ మ్యూజిక్
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం... ఈ భూగోళం పై భూమి అంతా ఒకవైపు నీరంతా ఒక వైపు ఉండేదనే భావన ఉంది.. ఈ భూమి పైనే రకరకాల జీవ జాతులు, ఉద్భవించాయి.. అయితే వీటి ఉద్భవానికి నిర్ధిష్టమైన కారణం చెప్పడానికి ప్రామాణిక సిద్ధాంతాలేవీ లేవు. కానీ ఈ భూమి పై సకల జాతులు ఉండేవన్న అభిప్రాయం మాత్రం ఉంది.. సరిగ్గా అప్పుడే మానవ జాతి అభివృద్ది పథంలో పయనించడం మొదలయింది. అంతే కాదు విశ్వమానవుడు కాలుష్య రహితమైన వాహనాలకు కూడా తయారు చేసుకొని వినియోగించడం మొదలు పెట్టాడనే వాదన కూడా ప్రచారంలో ఉంది.
విజువల్స్
ఈ భూమి పై నాగరిక పురుడు పోసుకొని వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలంలో అనుకోని ప్రకృతి విపత్తు వచ్చిందని మెజారిటీ పరిశోధకుల అభిప్రాయం.. అంతరిక్షం నుంచి ఒక పెద్ద గ్రహ శకలం వచ్చి భూమిని ఢీ కొన్నపుడు ఈ భూమి ఆకారంలో పూర్తిగా మర్పు వచ్చిందనే అభిప్రాయం ఉంది. అప్పుడే భూమి ఖండ ఖండాలుగా విడిపోయిందని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. భూమి ఖండాలుగా విడిపోవడంతోనే ఆ ఖండంలో ఉన్న జీవులు కూడా వేరయ్యాయి. అంటే భూమి ముక్కలు ముక్కలుగా విడిపోయినపుడు ఆ భూబాగంలో మిగిలిన జంతు, వృక్ష జాతులు అలానే ఉండి కొత్త వాతా వరణంలో అభివృద్ధి చెందసాగాయి.. ఈ హఠాత్పరిణామంలో కొన్ని జాతులు పూర్తిగా నాశనమై పోయాయి. కొన్ని జాతులు కొత్త వాతావరణంలో మనుగడ సాగించలేక అంతరించి పోయాయి..
యాంకర్ పార్ట్
ఈ ఖండ చలన సిద్ధాంతం కంటే ముందున్న నాగరికత గల ప్రాంతమే అట్లాంటిస్.. అయితే కొంత మంది పరిశోధకులు ఈ వాదనతో ఏకీభవిండం లేదు.. మద్య అమెరికా ప్రాంతంలో అభివృద్ది చెంది ప్రకృతి ఉత్పాతాల వల్ల కనురుగైన ప్రాంతమే అట్లాంటిస్ అని మరికొందరి అభిప్రాయం.. ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా అట్లాంటిస్ గురించి మొట్ట మొదట ప్రస్తావించింది మాత్రం ప్లేటో... ప్లేటో తన రచనల్లో ఎన్నో విషయాలు వెల్లడించాడు. అయితే ఈ విషయాలన్నీ ప్లేటో కి ఎలా తెలుసు. ప్లేటో కేవలం ఒక గ్రీకు తత్వవేత్త.. అట్లాంటిస్ అనేది ఒక ఊహాకల్పిత నగరం.. ఇది జరిగి సుమారు 12000 సంవత్సరాలని అంచనా.. మరి ప్లేటో కు అట్లాంటిస్ గురించి ఎలా తెలుసు... ఇది నిజంగా నిజమేనా..
విజువల్స్
అవును అట్లాంటిస్ అనేది నిజంగా నాగరికత వర్ధిల్లిన నగరమా లేక ఊహాజనిత పట్టణమా అన్నది నేటికీ మిస్టరీగానే మిగిలింది. ఎందుకంటే అట్లాంటిస్ ను ప్రత్యక్షంగా చూసిన వాళ్లెవరూ లేరు. మరి ప్లేటోకు అట్లాంటిస్ ఆలోచన ఎలా వచ్చింది.. ప్లేటో చెప్పిన అట్లాంటిస్ ఎలా ఉండేదో.. ఆ నగరం ఎలా వినాశనమయిందో చూద్దాం...
విజువల్స్
ప్లేటో ఆలోచనల ప్రకారం అట్లాంటిస్ ఒక అద్భుత నగరం.. ఒక్కముక్కలో చెప్పాలంటే భూలోక స్వర్గం... ఆ స్వర్గతుల్య పట్టణంలో ఎటు చూసినా అందాలే.. మగువలు వంపుసొంపుల వయ్యారాలతో అప్సరసలను మించిన అందాన్ని కలిగి ఉండేవారు... మగవారు దేహదారుడ్యాన్ని కలిగి కండపుష్టితో నిగనిగలాడుతూ మంచి తేజస్సు కలిగినవారై ఉండేవారు.. అట్లాంటిస్ ఎటు చూసినా అందమైన ప్రాంతం.. లోయలు.. పర్వతాలు.. జల వనరులు... పూదొటలు.. జంతువిహార స్థలాలు.. పండ్ల తోటలు.. సెలయేళ్లు,, ఈ ప్రాంతాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు.. ఉదయ సంధ్యలలో అదో ఉత్సాహ భరిత వాతావరణం అలుముకున్న అందమైన ప్రాంతం... ఈ ప్రాంతానికి ఎప్పుడూ చుట్టూ ఉన్న రాజ్యాల నుంచి శత్రువుల బెడద ఉండేది.. సంపన్న నగరంగా విలసిల్లే ఈ సామ్యాజ్యం పై నిత్యం శివారు రాజ్యాలు దండయాత్రలు చేసేవి.. అలా చేసిన దండయాత్రల్లో కొన్ని సార్లు అట్లాంటిస్ విజయాలను మూటగట్టుకుంటే.. మరికొన్ని సార్లు పరాజయం పాలయ్యేది. ఈ రకంగా ఎన్నో దండయాత్రలు చేసి శత్రురాజులు రాజ్యాన్ని కొల్ల గొట్టడం వల్ల పూర్తిగా దుర్భర స్థితికి చేరుకుందనే కథనం ఉంది.. దీంతో బాటు ఈ నగరం పూర్తిగా అదృశ్యమయి పోవడానికి కూడా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఆకాశం నుంచి ఒక గ్రహశకలం నేలను తాకినపుడు భూమి పై కొంతకాలం అగ్నిగోళంగా మారిందని... నేలంతా దట్టమైన పొగవ్యాప్తి చెంది కనీసం సూర్యకిరణాలు సోకడమే కష్టమై పోయింది.. ఇలా సుమారు రెండు సంవత్సరాల తరువాత నెమ్మదిగా పొగ తగ్గిపోయింది.. ఈ రెండు సంవత్సరాల్లో భూమిపై చాలా జాతులు అంతరించిపోయాయి.
విజువల్స్
మరో కథనం ప్రకారం ప్రశాంతం గా ఉన్నా అట్లాంటిస్ నగరం పై అగ్ని పర్వతాలు దాడి చేశాయి.. చుట్టూ ఉన్న పర్వతాల నుంచి పొగలు కక్కుతూ.. నిప్పులు చిమ్ముతూ ఒక్కసారిగా లావా ద్రవం వీదుల వెంబడి ప్రవహించింది.. ఎక్కడ చూసినా హాహాకారాలు.. దీంతో అట్టాంటిస్ మొత్తం నాశనం అయిందని... ఆ తరువాత వచ్చిన ప్రకృతి విపత్తులు, సునామీల వలన అది సముద్ర గర్భంలో తలదాచుకుందని పరిశోధకులు బుతున్నారు.
స్పాట్............................
వాయిస్ 1 కంటిన్యూ:
ఇతోపియన్ భూతల స్వర్గమది. అప్పటి కాలానికి అదే అత్యంత అభివృద్ధి చెందిన సమాజం. ఓ రాత్రి ఉదృతంగా ఎగిసిపడిన అట్లాంటిక్ సముద్రం కెరటాల తాకిడికి
అట్లాంటిస్ అల్లకల్లోలమై అదృశ్యమయింది. అట్లాంటిస్ ప్రపంచపు మొట్టమొదటి నవనాగరికతను లోకానికి చాటిన మహానగరం. అంతేకాదు అత్యంత శక్తివంతమయిన
సంపన్న సామ్రాజ్యం. విచిత్రమేంటంటే ఆ కాలంలోనే అట్లాంటిస్ సంస్కృతిలో భాగంగా... ఆకాశయానాలుండేవి. సముద్రగర్భంలో విహారాలుండేవి. అంటే మనం
ఇప్పుడు చెప్పుకునే స్పేస్ షటిల్స్, సబ్ మెరైన్లు అప్పుడే వుండేవన్నమాట! అలాంటి అరుదైన నగరం మొత్తం ఒకానొక ప్రకృతి ప్రకోపానికి బలై భూమి మీదనుంచి
మటుమాయమైపోయింది. అట్లాంటిక్ మహా సముద్రంలోకి వెళ్లిపోయిన ఈ నగరం పన్నెండు వందల ఏళ్ళక్రితం ప్రపంచానికి దూరమయిపోయింది. అది కూడా కేవలం ఒక
రాత్రి ఒక పగలు మధ్య కాలంలో... ఈ దుర్ఘటన సంభవించింది.
స్పాట్.......................
వాయిస్ కంటిన్యూ:
"అట్లాంటిస్ కింగ్‌డమ్‌'' ఇప్పటికీ పురావస్తు విభాగంలో అత్యంత అరుదైన రహస్యంగా నిలుస్తోంది. అట్లాంటిస్ నగరం ఐర్లండ్, ఏజోర్ దీవులు,
అంటార్కిటికాలను సరిహద్దులుగా చేసుకుని వుండేదని చరిత్రకారుల భావన. శాస్త్రజ్ఞుల అంచనాల మేరకు ఇది నిజంగా ఓ అద్భుతం. కాల్పనిక గాధను మరిపించే సుందరనగరం... గ్రేట్ సిటీ ఆఫ్ ట్రాయ్ లాగా ఇది కూడా ఒకానొక గొప్ప నగరంగా భావించవచ్చన్నది సైంటిస్టుల నమ్మకం. 19వ శతాబ్దిలో పురావస్తు శాస్త్రజ్ఞులు ఈ నగర ఆనవాళ్ళను అణువణువు పరిశీలించారు. దీనికీ గ్రీకు నాగరికతకీ పోలికలున్నాయా అన్న కోణంలో పోల్చిచూసారు. ప్రస్తుతం
సాగరగర్భంలో తలదాచుకుని వున్న అట్లాంటిస్ నగరం తాలూకు అనేక విషయాలు ఇంకా ప్రపంచం ముందుకు రావాల్సి వుంది.
యాంకర్ పార్ట్
ఆర్కే నారాయణ్ సృష్టించిన మాల్గుడి గ్రామంలాగా... అట్లాంటిస్ నగరం... ప్లేటో సృజనాత్మకతకు దర్పణం పడుతుందా? అసలు "కలదు... కలదన్న...''
అట్లాంటిస్ నగరం వుందా లేదా?! మనవాళ్ళు చిత్రాలు గీసి వూహిస్తూ.. వూరిస్తూ... చెప్పుకొస్తున్న ఆనవాళ్ళు సహజసిద్ధమయినవా? లేక... మనిషి "అతి
వూహాత్మకత''కు నిదర్శనమా? శాస్త్రజ్ఞుల మెదళ్ళకు వేడి పుట్టించే ప్రశ్నలివి... ఇంతకీ ఈ మిస్టరీ ఛేదనలో నయా సైంటిస్టులు చెప్పుకొస్తున్న
నిజాలేమిటి? బెర్ముడా ట్రయాంగిల్ తో ఈ నగరానికి వున్న సంబంధమేంటి?
వాయిస్
ఆకాశంలో ఎగిరే విమానాలు, సముద్రంలో పయనించే పెద్ద పెద్ద నావలూ ఉన్నట్లుండి బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరకు వచ్చేసరికి సముద్రంలో
కలిసిపోయేవి. ఏమిటీ మాయ?! అని ఎన్నో వూహాగానాలు చెలరేగాయి. అందులో ఒకటి బిమినీ రోడ్. ఇది అట్లాంటిస్ నగరంలోని ఒకానొక రహదారి... అది బెర్ముడా
ట్రయాంగిల్ కి దగ్గరలో ఉండటం వల్ల ఈ పరిణామాలు సంభిస్తున్నాయన్న కథనం ప్రచారంలో ఉంది. అట్లాంటిస్ నగరానికి.... దాని అవశేషాలకూ ప్రపంచ చరిత్రలో
అంతటి శక్తి వుంది మరి!
స్పాట్.....................
వాయిస్ కంటిన్యూ:
ఇంతకీ- బిమినీ రోడ్ మానవ నిర్మితమా? లేక సహజసిద్ధంగా ఏర్పడిన శిలాజాలమా? దాన్నే మనవాళ్ళు అతిగా వూహించుకుని లేని అట్లాంటిస్ నగరమాయను ఉందని
వూహిస్తున్నారా?! అనే కోణంలో ఆలోచించి... పరిశోధకులు కాళ్ళకు, చేపతోకల తొడుగులు తొడుక్కుని మరీ రంగంలోకి దిగారు. సముద్రగర్భం నుంచి కొన్ని
శిలలను తీసుకువచ్చి ప్రయోగశాలలో పరిశోధనకు ఉపక్రమించారు. రేడియోకార్బన్ డేటింగ్ ద్వారా ఈ శిలల నిజచిత్రాన్ని నిర్దారించడానికి ప్రయత్నాలు
చేశారు.
స్పాట్.........................
వాయిస్ 2 కంటిన్యూ:
నాడు... ప్లేటో వుందని చెప్పిన అట్లాంటిస్ ను 1920లలో కరేబియన్ సముద్రగర్భంలో కనుగొన్నారు. తరువాత 1969వ సంవత్సరంలో... నీలి సముద్రజలాల
కింద, బిమిని దీవుల సమీపంలో... ఒక రహదారి నిర్మాణాన్ని కనుగొన్నారు. మియామీ తూర్పు తీరానికి 58 మైళ్ళ దూరంలో ఈ రహదారి వుండేదని అంటోంది
శాస్త్రలోకం. ఇదే అట్లాంటిస్ నగరంలోని బిమినీ రోడ్డుగా చెబుతున్నారు వీరు. ఇది ఒక హర్బరును ఆనుకుని వుండే రహదారిగా చెప్పవచ్చని కూడా
పరిశీలకుల అంచనా. 1600అడుగుల పొడవుతో... జె ఆకారంలో ఈ రోడ్డు వుండటాన్నినిపుణులు గమనించారు. అప్పటికే అత్యంత అధునాతన వసతులతో కూడిన హర్బరు
వుండేదని చెప్పడానికి ఇదే ఉదాహరణగా చెప్పవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీన్నిబట్టీ... అట్లాంటిస్ సామ్రాజ్యానికి...
అపారమయిన నావికాబలం ఉండేదని తెలుస్తోంది. హర్బర్ని కలుపుకుంటూ నిర్మితమయిన బిమినీ రోడ్డును... రెక్టాంగిల్ ఆకారంలోని రాళ్ళను పొదిగిన
మానవ నిర్మిత రహదారిగా అంచనా వేస్తున్నారు. కానీ ఇదంతా కట్టుకథగా కొట్టిపారేసే వారు కూడా లేక పోలేదు. ఇది సహజసిద్ధంగా ఏర్పడిన శిలల సమాహారంగా
చెపుతున్నారు కొందరు విశ్లేషకులు. కానీ కొన్ని స్పష్టమయిన ఆకారాలలో చెక్కినట్టుండే రాళ్ళను వాడటం బట్టీ ఇది మానవ నిర్మితంగానే
భావించవచ్చన్నది పరిశీలకుల వాదన. అనేక లేయర్లతో రొడ్డు నిర్మాణం జరుగుతుందనీ.. అది బిమినీ రోడ్డు విషయంలో కనిపిస్తుందంటారు పరిశోధకులు. ఈ
రాళ్లను చూస్తే... మనుషులు చేతితో చెక్కిన పనితనం కొట్టకొచ్చినట్టు... కనిపిస్తుందని అంటారు వీళ్ళు.
స్పాట్.........................
యాంకర్ పార్ట్
అట్లాంటిస్ గురించి చెప్పే ముందు దాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తత్త్వవేత్త ప్లేటో గురించి తెలుసుకోవాలి. ఆయన రాసిన రచనలల్లో 'ది
రిపబ్లిక్' అనేది ప్రపంచ మానవాళికి గొప్ప మేలు చేసిందనే చెప్పాలి. రాజ్యం ఎలా వుండాలి? అని ప్లేటో ఈ పుస్తకంలో చక్కగా వివరించారు. అలాగే 'భూతల
స్వర్గము' ఇతోపియా అనేది ఆయన తీపికల. అంటే దీనర్ధం ఏమిటీ?! ప్లేటోకి వూహాజనిత శక్తి ఎక్కువని చెప్పాలి. ఏమీ లేకున్నా అది ఉంటే ఇలా వుండాలని
రచనలు చేసేవారాయన. అలాగే తన 'డైలాగ్' అనే రచనలో అట్లాంటిస్ ప్రస్తావన చేసారు ప్లేటో. అది ఎలా ఈ భూమినుంచి దూరమయిందో కూడా ఆయన తన రచనలో
పేర్కొన్నారు. ఆయనే కాకుండా ఇతర రచయితలు, ప్రముఖులు అట్లాంటిస్‌ గురించి ఏమన్నారో వివరించి, వర్ణించారో... ఇప్పుడు చూద్దాం.
వాయిస్
క్రీస్తు పూర్వం 350వ సంవత్సరం... ప్లేటో మొదటిసారిగా తన రచనల్లో అట్లాంటిస్ నగర ప్రస్తావన చేశారు. సరిగ్గా అప్పటికి 9వేల ఏళ్ళ క్రితం
అట్లాంటిస్ అనే నగరం ఉండేదని... రాశారాయన. కానీ ప్లేటో ఉద్ధేశపూర్వకంగా చేశారో... లేక కాల్పనికం కనుక అలాగే వుంటుందనుకున్నారో తెలియదు గానీ,
అట్లాంటిస్ ఎక్కడ వుండేదని మాత్రం పూర్తిగా వివరించలేకపోయారు. అయితే ఆయన రాసిన దాని ప్రకారం- "అట్లాంటిస్''- హెర్క్యులస్ స్థంభాల వెనుక భాగంలో
వుండేదని వర్ణించారు. ఈ వర్ణన వలన స్పెయిన్, మొరాకో భూభాగాలు... అట్లాంటిక్, మెడిటెరేనియన్ సముద్రాల మధ్య అట్లాంటిస్ ఉండేదని అంచనాకు
వచ్చారు పరిశోధకులు. పదహారు వందల శతాబ్దిలో కొందరు రచయితలు... అట్లాంటిస్ అమెరికాలో ఉండేదని సూచించారు. దీన్నే ఉతోపియా అని తెలియచేశారు. అదే
పందొమ్మిదో శతాబ్దికి వచ్చేసరికి... పరిశోధకులు అట్లాంటిస్ దక్షిణ అమెరికాకు చెందినదని వివరించారు. ఈ పురాతన సంస్కృతి మయన్ నాగరికతకు
చెందిందని అభివర్ణించారు. 1882లో అట్లాంటిస్ మీద మరో రచయిత రాసిన పుస్తకం వెలుగులోకి వచ్చింది. ప్రపంచప్రఖ్యాత నాగరికతలన్నిటికీ అట్లాంటిస్
నాగరికత మాతృకగా ఈ పుస్తకంలో పేర్కొన్నారా రచయిత.
స్పాట్......................
వాయిస్ కంటిన్యూ:
అది 1940వ సంవత్సరం... వర్జీనియా బీచ్... అద్భుత ఊహాజనిత శక్తులు గల వ్యక్తిగా పేరున్న ... జేసి ఆశ్చర్యకరంగా అట్లాంటిస్ ప్రస్తావన చేశారు.
సరైన స్థలకాలాలను ఆయన తన వాక్కుల ద్వారా తెలియచేసారు. ఫలానా సమయంలో ఫలానా చోట అట్లాంటిస్ నగరం వెలుగు చూస్తుందని జేసి అనూహ్యంగా తెలిపారు. సరిగ్గా
ఆయన చెప్పినట్టు... 1968లో "ది బహ్మాస్'' అనే ప్రదేశంలో... బయాలజిస్ట్ జేమ్స్ వాలెంటైన్స్... ఒక అద్భుతాన్ని కనుగొన్నారు. అదే బిమినీ రోడ్.
చాలా మంది అంటున్నట్లుగా... అట్లాంటిస్ అనేది కేవలం వూహ కాదని, నిజంగానేఉందనీ- దీన్ని బట్టీ తేలింది. ఈ వార్త అప్పట్లో సహజంగానే పెను సంచలనాలకు
కేంద్రమయింది.
స్పాట్..........................
వాయిస్ కంటిన్యూ:
కొందరి శాస్త్రవేత్తల వాదనల ప్రకారం అట్లాంటిస్ "ఒక నిజ నాగరికత'' ఆధారంగా తయారు చేయబడిన సృజనగా చెబుతారు. వాస్తవానికి అట్లాంటిస్ ను
సృష్టించిన ప్లేటో... తిరుగులేని ప్రపంచ ప్రఖ్యాత రచయిత. ఆయన అభివర్ణించిన దాని ప్రకారం... ప్రపంచాన్ని అట్టుడికిస్తున్న ఈ
అంతుచిక్కని ప్రదేశం... హెర్క్యులస్ స్థంభాల వెనుక భాగంలో ఉందని నమ్మకం. అదే ఈ చోటు. ఈ దీవి మెడిటెరేనియన్ సముద్రంలోని సెంటరీనీ, క్రేట్ అనే
దీవులకు 70మైళ్ళ దూరంలో ఉందని అంచనా. 1930ల్లో బయటపడిన కొన్ని "మినోనియన్స్'' అనే పురావస్తు అవశేషాలు ప్లేటో వర్ణించిన అట్లాంటిస్ కి
దగ్గరలో ఉంటాయి కూడా.
స్పాట్..................
యాంకర్ పార్ట్
నీటిలోంచి మొలిచినట్టుండే పుష్పాల్లాంటి భవంతులు. వాటిలో ఎన్నో వింతలూ, విశేషాలు. అంతటి జలమయమైన వాతావరణంలోనూ ఎంతో చాకచక్యంగా నిర్మించబడిన తాగు
నీటి వ్యవస్థ, మురుగుకాలువ వ్యవస్థలు... ఈ భవన నిర్మాణాల్లో దర్శనమిస్తాయి. అట్లాంటిస్ చూడటానికి ఎంతో వింతగా, విచిత్రంగా వుంటుంది.
వృత్తాకారంలో వుండే ఈ భూమిని నీరు వేరు చేస్తుంది. "వూహా..'', "నిజమా..'' అన్నది పక్కన పెడితే... ఇంతటి సుందరనగరాన్ని ఆ సముద్రుడెలా మింగేసాడో
అనిపించక మానదు.
వాయిస్ 4
మనిషి ఊహాజనిత వర్ణన ప్రకారం... అట్లాంటిస్ నగరం ఇలా ఉండేది. పూర్తిగా నీటితో అవినాభావ సంబంధమున్న జీవనవిధానం వల్ల నావికా వ్యవస్థ కూడా అధునాతన
పోకడలతో విరాజిల్లిందని తెలుస్తోంది. కానీ ఒకానొక పెను ప్రమాదకరమయిన సముద్రపు కెరటం... అట్లాంటిస్ నగరం మొత్తాన్ని తన దాడితో
ముట్టడించేసింది... ఇంతటి ఆదర్శవంతమయిన అట్లాంటిస్ సమాజం నీటమునిగి పోవడానికి అసలయిన కారణాలేమయి వుండొచ్చు??? అని ప్రశ్నించుకున్న
శాస్త్రవేత్తలు అందుకు తగిన కారణాలెన్నో కనుగొనే ప్రయత్నం చేసారు. ఒకవేళఅట్లాంటిస్ ఉన్నది నిజమే అయితే... అది ప్రకృతి వైపరీత్యానికి లోనై నాశనమై
పోయుంటుందని భావిస్తున్నారు.
స్పాట్.......................
వాయిస్ కంటిన్యూ:
ఒకానొక వూహ ప్రకారం... సెంటరీనీ దీవిలో ఒక ప్రమాదకరమయిన అగ్నిపర్వతం ఉంది. సరిగ్గా క్రీస్తుపూర్వం పదహారువందల కాలంలో... ఈ అగ్నిపర్వతం భళ్ళున
పేలింది. ఇది ప్రపంచంలోని పది అత్యంత ప్రమాదకరమయిన అగ్ని పర్వతాలలో ఒకటి. ఈ పర్వతం పేలుడు ఎంతటి తీవ్రతరమైనదంటే... 50వేల హిరోషిమా బాంబులతో
సమానమైంది. అందులోంచి వచ్చిన రాళ్ళు, బూడిదలు సుమారు ఒక ట్రిలియన్ టన్నుల పైన వుంటుందని అంచానా వేస్తున్నారు. అగ్నిపర్వతం నుంచి విడుదలయిన రాళ్ళు
పడి... సముద్రం అతలాకుతలం అయిపోయింది. దీంతో సుమారు 650 అడుగుల ఎత్తయిన కెరటం ఒకటి ఎగసి పడినట్టుగా అంచనా. అందుకు నఖలు తయారు చేసి చూడగా దాని
ప్రభావం ఇలా ఉంది. మీరే గమనించండి!
స్పాట్........................................
వాయిస్ 4 కంటిన్యూ:
దీన్నే సునామీ అని కూడా అంటారు. అదే అట్లాంటిస్ కొంప ముంచేసిందని ఒక వూహ. ఇలాంటిదే 2004లో ఇండోనేసియాను నిట్టనిలువునా నీటముంచేసింది. సుమారు
రెండువేలమంది ప్రాణాలు నీళ్ళలో కలిసాయీ దుర్ఘటనలో... అట్లాంటిస్ ను నిలువునా ముంచేసిన సునామీ ఇందుకు నాలుగు రెట్ల పెద్దదై ఉండవచ్చని
శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.
స్పాట్..................
వాయిస్ కంటిన్యూ:
సముద్రపు అట్టడుగు భాగంలో దాగి వున్న అంతుచిక్కని రహస్యాన్ని చేధించేందుకు పరిశీలకులు తమ పయనాన్ని సముద్రగర్భంలోకి మళ్ళించారు.
అణువణువు శోధించి అట్లాంటిస్ ఆనవాళ్ళను సాధించడానికి తీవ్రప్రయత్నాలు చేశారు. వారికి సముద్రపు అడుగుభాగంలో కొన్ని రాళ్ళు దొరికాయి. ఇవే బిమినీ
రోడ్డుకు సంబంధించిన రాళ్ళనీ... ఇవి ఎవరో చెక్కినట్టుగా ఉన్నాయని.... అంటే దీనర్ధం ఈ రాళ్ళు మానవనిర్మితాలే కావొచ్చనీ శాస్త్రవేత్తల బృందం
అంటోంది. వాటిని కార్బన్ డేటింగ్ లాబ్ కి అప్పగించారు. మొత్తంగా శాస్త్రజ్ఞులు ఈ రాళ్ళు అట్లాంటిస్ కి చెందిన బిమినీ రోడ్డుకు సంబంధించినవేనని స్పష్టంగా చెప్తున్నారు.
స్పాట్...................
యాంకర్
అట్లాంటిస్ నగరం అదృశ్యం అవడానికి ఏయే కారణాలు ప్రభావం చూపాయి?? భూమి, ఆకాశాలలో ఎక్కడ దాక్కుని వుందా మర్మం? భూకంప ప్రళయమా... లేక కేవలం
అగ్నిపర్వత విస్పోటనమా... గ్రహశకల విన్యాసమా??? ఏ కారణం చేత ఆనాటి ఆదర్శసమాజమైన అట్లాంటిస్... సముద్రపు అట్టడుగు భాగానికి చేరిపోయిందో
తెలుసుకోడానికి శాస్త్రవేత్తల బృందం తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు సాగించింది.
వాయిస్
శాస్త్రవేత్తల బృందం తమ తదుపరి పరిశోధన కోసం రెక్టాంగిల్ వున్న ప్రాంతానికి వెళ్ళింది. ఇక్కడ దొరికే ఆధారాలు కచ్చితంగా పురాతన నాగరికతను
ప్రపంచానికి పరిచయం చేసేవేనని నమ్ముతూ వారు తమ పరిశోధన తిరిగి మొదలుపెట్టారు. అక్కడ దొరికిన నమూనాలు క్రీస్తుపూర్వం పదివేల
సంవత్సరానివని సైంటిస్టులు అంటున్నారు. ప్లేటో కూడా అట్లాంటిస్ గురించి చెబుతూ.... శాస్త్రవేత్తలు చెబుతున్న కాలాన్నే సూచించడం గమనించదగిన
విషయం.
స్పాట్...............................................................
వాయిస్ కంటిన్యూ:
అట్లాంటిస్ వుందని చెబుతున్న కాలంలో... సముద్రమట్టం ఎంత ఉండేదని పరిశీలన జరపగా... సుమారు వంద అడుగులు తక్కువ వుందని తేలింది. సముద్రపు
అడుగుభాగంలోకి వెళ్ళిపోయిన రెక్టాంగిల్స్ పది నుంచి పదిహేను అడుగుల ఎత్తులో ఉండేవి. అంటే దీనర్ధం ఏమిటి? అసలే సముద్ర మధ్యంలో అందంగా
నిర్మించిన సుందర నగరం అట్లాంటిస్... వంద అడుగుల మేరా సముద్రమట్టం పెరగడమంటే... దాదాపు ఆ నగరాన్ని సముద్రం మింగేయడానికి తగిన అవకాశం
దొరికినట్టే.
స్పాట్............................................................
వాయిస్ కంటిన్యూ:
అట్లాంటిస్ నగరం నీటమునిగిపోడానికి కారణాలను ఒకసారి పరిశీలిస్తే... మరికొన్ని విషయాలు స్పష్టం అవుతాయి. అట్లాంటిస్ మాయమవడానికి కారణాల్లో
మొదటిది... సునామీ రావడం. సునామీ అంటే ఉన్నట్లుండి సముద్రకెరటాలు ఒక్కసారిగా ఎగిరెగిరి పడటం. అందుకు కారణం భూకంపం. సముద్రగర్భంలో ఉండే
అగ్నిపర్వతాలు బద్దలు కావడం వల్ల కూడా సునామీ వస్తుంది. అలాగే... ఆకాశం నుంచి గ్రహశకలం దూసుకురావడం వల్ల కూడా అట్లాంటిస్ సముద్రగర్భానికి
చేరిందనే వాదనలున్నాయి. ఎప్పుడయితే ఆకాశం నుంచి గ్రహశకలం నేరుగా అట్లాంటిక్ సముద్రం మీదకు దూసుకురావడంతో... ఆ తాకిడికి సముద్రం
ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో కెరటాలు ఆకాశమంత ఎత్తుకు ఎగిరిపడ్డాయి. ఇలాంటి ఘటనే అట్లాంటిస్ సముద్రం పాలు కావడాని కారణం కావచ్చని
శాస్త్రవేత్తల అంచనా. అట్లాంటిస్ వాసులకు అసలు ఏం జరుగుతుందో తెలిసే లోపలేమొత్తం అగమ్యగోచరం అయిపోయింది. వేలకొద్దీ ప్రాణాలు అనంతజలాల్లో
కలిసిపోయాయి. సెంటరీనీ దీవిలోని అగ్నిపర్వతం పేలి భారీగా రాళ్ళు ఎగిసిపడటం వల్ల కూడా సముద్రమట్టం పెరిగి అట్లాంటిస్ సాగరగర్భంలోకి
చేరివుండవచ్చని మరో వాదన కూడా వుంది. ఈ అగ్నిపర్వతం నుంచి వచ్చిన రాళ్ళు సుమారు 175 మైళ్ళ వేగంతో సముద్రపు నీటిని ముందుకు నెట్టినట్టుగా
భావిస్తున్నారు. దీంతో ఒక్కో కెరటం మూడవందల మైళ్ళ వేగంతో ఎగిసి పడి, అది అట్లాంటిస్ మీద విరుచుకుపడినట్టుగా పరిశీలకులు అంచానా వేస్తున్నారు.
స్పాట్........
కంక్లూడింగ్ యాంకర్:
పరిశీలకులు సేకరించిన బిమినీ రోడ్డు, రెక్టాంగిల్ ప్రదేశాల్లో దొరికిన రాళ్ళు క్రీస్తుశకం పదివేల ఏళ్ళకాలం నాటివిగా తేలాయి. ఇటీవల కొందరు
సైంటిస్టులు అట్లాంటిస్ నగరం ఈజిప్టు పిరమిడ్లకన్నా పురాతనమయినవని కనుగొన్నారు. కరేబియన్ సముద్రగర్భంలో అట్లాంటిస్ నగర ఆనవాళ్ళను తాము
కనుగొన్నట్టుగా వారు ప్రపంచానికి తెలియచేశారు. ఇంకా స్పష్టంగా అట్లాంటిస్ నగరం ఎక్కడుందో తెలుసుకోడానికి తగిన నిధులు సేకరించాలని
ప్రయత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు.! అన్నిటికన్నా తమ నాగరికతే పురాతనమయినదని తెలియచెప్పేందుకే. అందుకు పాశ్చాత్య దేశాలవారు శాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నారు. మన ద్వారకా నగరం కూడా అరేబియా సముద్రంలో దాగి వుందని విశ్లేషకుల అంచనా. అందుకు తగిన
ఆధారాలు కూడా పదిలంగానే వున్నాయి. కానీ మన నాగరికతను ప్రాచీనమయినదనీ, దివ్యమయినదనీ తెలియచేయడానికి మనవాళ్లెవరూ ఇంత ఆసక్తిగా ముందుకురావడం
లేదు. ఎన్నో విషయాల్లా ఇది కూడా ఆ పాశ్చాత్యులే కంకణం కట్టుకుంటే తప్ప శ్రీకృష్ణసామ్రాజ్యానికి మోక్షం కలగక పోవచ్చు.

31, మే 2011, మంగళవారం

సైన్స్ ఎపిసోడ్ 45

ఎ. జనార్ధన్
ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలు విప్పిచెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
యాంకర్ 1
పచ్చని పసిరికలను చూస్తే చంటి పాపలను చూసినట్టుంటది. ఎవరకీ హాని చేయవు. నేలలోదొరికే లవణాలతో, సూర్యరశ్మి, నీటితో బతికేస్తయి. మొక్కలు స్వయం పోషకాలు.. పాపం జీవజాతిని బతికించేది కూడా మొక్కలే.. ఇప్పటి వరకు ఇవే మనలో చాలా మందికి తెలిసిన నిజాలు. కానీ మొక్కల్లో కూడా మాంసాహారులున్నాయని, అవి కూడా అదును చూసి కాటేస్తాయని మీకు తెలుసా.. తెలియకుంటే ఇప్పుడు చెబుతా జాగ్రత్తగా వినండి. ఆదమరిచి ఉంటే నిండు ప్రాణాలు తీసి ఆబగా ఆరగించే మొక్కలున్నాయి. జాగ్రత్త..
స్పాట్ ( క్రిమినల్ ప్లాంట్స్) Plantas Carnivoras ఫైల్ వాడగలరు.
యాంకర్ 2
యస్.. మొక్కలు చంపుతాయి. ఏ మాత్రం దయా దాక్షిణ్యంలేకుండా నమిలి మింగేస్తయి. ఎందుకు ఏం. మొక్కలకు అంత కసి ఎందుకు.. అంటే అసలు సబ్జెక్ట్ లోకి వెళ్లాల్సిందే..
స్పాట్
వాయిస్
మొక్కలు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఎక్కువ శాతం మొక్కలు నేలలోని లవణాలను, గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ ను, నీటిని సూర్యరశ్మిని వినియోగించుకొని పిండిపదార్ధాలను తయారు చేసుకుంటయి. అయితే చాలా మొక్కలు నేల నుంచి నత్రజనిని సేకరించుకోలేవు. ఈ నత్రజని లోపం తగ్గించుకోవడానికి సృష్టిలో ఒక్కో మొక్కలు ఒక్కో రకమైన అమరిక ఉన్నది.
స్పాట్
లెగ్యుమినేసి మొక్కల్లో అంటే చిక్కుడు, వేరుశనగ వంటి మొక్కల్లో నత్రజని లోపం తగ్గించుకోడానికి వాటి వేరు బుడిపెల్లో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటయి. ఈ రైజోబియం బ్యాక్టీరియా నేలలోని నత్రజనిని సశ్లేషించుకోగలవు. ఈ నత్రజనిని మొక్క వినియోగించుకుంటది. అదే సందర్భంలో బ్యాక్టీరియా కూడా మొక్కనుంచి ఆహారాన్ని పొందుతుంది. ఈ రకమైన జీవనాన్ని సహజీవనం అంటరు. అంటే రెండు జీవులు ఒకదానికొకటి ఆహారాన్ని ఇచ్చి పుచ్చుకుంటూ హాని చేసుకోకుండా జీవిస్తే దాన్నే సహజీవనం అంటరు.
స్పాట్
యాంకర్ .3
ఒకరికొకరు హాని చేసుకోకుండా సాగించే జీవనాన్ని సహజీవనం అంటరు. మరి ఒక జీవి పై మరో జీవి దాడి చేసి ధ్వంసం చేసి ఆహారాన్ని పొందితే దాన్ని పరాన్నజీవనం అంటరు. అవును పరాన్న జీవుల దాడిలో ఒక రకం జీవులు పూర్తిగా నాశనం కావడం లేదా పాక్షికంగా నశించడం జరుగుతది. దాని వల్ల ఏదో ఒక జీవికి నష్టం. ఇటువంటి నష్టం కలిగించే కోవకు చెందినవే కీటకాహార మొక్కలు.
స్పాట్
చిన్న చిన్న క్రిములను, కీటకాలను మరియు చిన్న జంతువులను తినే మొక్కలను కీటకాహార మొక్కలు లేదా మాంస భక్షణ మొక్కలు అంటరు. ఇవి చాలా ఆశ్చర్యకరమైనవి. ఈ మొక్కలు నత్రజని లోపించిన ముఖ్యంగా బురద నేలలలో పెరుగుతయి. ఇవి తమకు కావలసిన నత్రజనిని తయారుచేసుకోలేవు. అందువల్ల ఈ విధంగా క్రిమికీటకాలలో లభించే మాంసకృత్తుల మీద ఆధారపడతాయి. ఈ మొక్కల పత్రాలు కీటకాలను ఆకర్షించి, పట్టుకొని, చంపి, జీర్ణం చేసుకోవడానికి అనువుగా బోనులుగా రూపాంతరం చెందుతాయి. ఈ పత్రాలను 'బోను పత్రాలు' అంటారు. ఈ పత్రాలు వివిధ ఎంజైములను స్రవించడం వలన కీటకాలలోని ప్రోటీనులు విశ్లేషించి జీర్ణం చేయబడతాయి. జీర్ణం చేయబడిన ప్రోటీనులను ఈ పత్రాలు శోషిస్తాయి. ఇవి ఉత్తర, దక్షిణ కరోలినా ప్రాంతాల్లో కనిపిస్తయి.
స్పాట్
మొక్కలు కీటకాలను బంధించడం చాలా చిత్ర విచిత్రంగా ఉంటది. ఒక్కోసారి చాలా ఆశ్చర్యం వేస్తది కూడా. ఎందుకంటే ఇంత టెక్నాలజి తెలిసిన మనిషే వేటాడాలంటే ఎంతో ప్రయాస పడుతడు. అట్లాంటిది ఇంచు కూడా కదలలేని మొక్కలు ఎలా వేటాడగలవు.. రోజువారీ ఆహారాన్ని ఎలా పొందగలవు.
స్పాట్
వాస్తవానికి ఆహారం చెంతకు ఇవి వెళ్లవు. వీటి చెంతకే ఆహారం రావాలి. అవును ఇవి అలా ఆహారం నడిచి వచ్చేలా చేస్తయి. కీటకాలను ఆకర్షించడంలో ఒక్కో మొక్కది ఒక్కో ట్రిక్. కీటకాహార మొక్కల్లో డయోనియా దీనినే వీనస్ ఫ్లై ట్రాప్ అని కూడా అంటరు.
స్పాట్
యాంకర్ 4
వీనస్ ఫ్లై ట్రాప్ మొక్కలను వేటాడుతుంది. ఒక మొక్క కీటకాలను ఎలా వేటాడగలదు. ఇది నిజంగా చాలా ఇంట్రస్టింగ్ విషయం. ఎందుకంటే మొక్కలు తాము ఉన్న ప్రాంతం నుంచి అంగుళం కూడా కదల్లేవు. మనుషులే కీటకాలను పట్టాలంటే నానా ఇబ్బందులు పడుతరు. కానీ వేగంగా ఏగిరే కీటకాలను మొక్క ఎలా పట్టగలదు. ఇవే కదా మీ మెదడును తొలిచే ప్రశ్నలు. అవును మీరు ఊహిస్తుంది. నిజమే..కానీ కీటకాలను పట్టుకోవడం మొక్కలకు చాలా ఈజీ.. ఏలానో చూద్దాం..
స్పాట్
వీనస్ ఫ్టై ట్రాప్ కీటకాలను వేటాడే విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. పిల్లలను పట్టే వాళ్లు, ఇంట్లో ఎలకలను పట్టే బోను ఎలా పనిచేస్తుందో అచ్చం అదే ఫార్ములాతో వీనస్ ఫ్లై ట్రాప్ కీటకాలను పడుతుంది. అంతేకాదు వీనస్ ఒక్క కీటకాలనే కాదు. కాటర్ పిల్లర్ లను, కప్పలను బల్లులను కూడా వదలదు. ఇంతకీ ఈ వీనస్ ఫ్లై ట్రాప్ కీటకాలను ఎలాపడుతుందో తెలుసుకుందాం.
స్పాట్
ఇదిగో ఇక్కడ చూడండి.. వీనస్ ఫ్లైట్రాప్ ఆకుల పై కొన్ని స్పర్శ కేశాలున్నయి. ఈ స్పర్శ కేశాలను ఒక సారి తడిమితే ఏ చర్యా ఉండదు. కానీ వెంట వెంటనే రెండు సార్లు తడిమితే రెండు దళాలు దగ్గరకి వత్తుకుంటయి. అప్పుడు దళాల్లో చివరలో ఉన్న పత్రకాలు ఆహారాన్ని తప్పిచ్చుకొని పోకుండా అడ్డుకుంటయి. విధిలేని సరిస్థితుల్లో ఆహారం అందులోనే చిక్కుకుంటుంది. ఒక్కసారి ఇందులో చిక్కిందా ఇక బతుకు పై ఆశలు వదులుకోవలసిందే. ఇందులో చిక్కుకున్న జీవికి నీళ్లు ఆహారం లేక చిక్కి శల్యమై చనిపోతుంది. కీటకాల శరీరం కైటిన్ అనే పెంకుతో తయారవుతుంది. ఈ ఖైటిన్ లో కాల్షియం ఉంటది. శరీరంలో ఉన్న నత్రజని ఫాస్పరస్ మూలకాలు మొక్క శరీర నిర్మాణానికి ఉపయోగ పడుతుంది. చౌడు భూముల్లో, బురద నేలల్లో పెరిగే మొక్కలకు పాస్ఫరస్, నత్రజని అవసరం.
స్పాట్
వీనస్ ఫ్టైట్రాప్ లో చిక్కుకున్న నత్తలు, కాటర్ ఫిల్లర్ లు, కీటకాలు ఈ మొక్కలకు ఆహారంగా మారుతయి. ఏవో కొన్న అదృష్ట జీవులు.. భూమి పై ఇంకా ఆహారం ఉన్న జీవులైతే చిన్నగా తప్పిచ్చుకుంటయి. బతకు జీవుడా అంటూ బాటపడతయి.
స్పాట్ (నత్త తప్పిచ్చుకునే సీన్)
యాంకర్ 5
ఇప్పటి వరకు వల వేయడం మనుషులకు మాత్రమే తెలుసనుకున్నాం. అంతేకాదు అదునుచూసు వల విసరడంలో సాలీడు కూడా నేర్పరే .. కానీ అంతకంటే అద్భుతంగా.. ఓర్పుగా నేర్పుగా వల విసరడంలో చమత్కారి సన్ డ్యూ ప్లాంట్. ఇంతకీ సన్ డ్యూ ఏంటి అనుకుంటున్నారా. చూడ్డానికి సూర్యుడిలా చుట్టూ కిరణాలు కలిగి ఉండి.. ఉదయపు వేళల్లో మంచుబిందువులను మోస్తున్న లేత ఆకుల్లా కనిపించేదే సన్ డ్యూ.. కానీ ఇది కీటకాల పాటిట యమపాశం.. ఈ డ్రోసిరా మొక్క కీటకాలను ఎలా పట్టుకుంటుందో ఓలుక్కేద్దాం..
స్పాట్
డయోనియా తరువాత మాంసాహార మొక్కల్లో చెప్పుకోదగ్గది డ్రోసిరా.. దీనినే సన్ డ్యూ అని కూడా అంటరు. పత్రం చుట్టూ కేశాలు మెరుస్తూ తెల్లని స్రావాన్ని కలిగిన బుడిపెలు ఉండి అచ్చం సూర్యుడిలా మెరుస్తూ మంచు బిందువులను మోస్తున్నట్టు కనిపించడం వల్ల ఈ మొక్కకు సన్ డ్యూ అనే పెరు వచ్చింది. ఈ సన్ డ్యూ మొక్కలలో చాలా రకాలున్నయి.
స్పాట్(వివిధ రకాల మొక్కల విజువల్స్)
సన్ డ్యూ , డ్రోసిరాగా పిలవబడే ఈ మొక్క టెంటకిల్స్ అత్యంత సున్నితంగా ఉంటయి. ఈ సున్నిత కేశాలకు అత్యంత బలీయమైన స్పర్శ జ్ఞానం ఉంటది. ఏదైనా కీటకం దగ్గరికి వచ్చినపడు ఒక విధమైన స్రావాలను ఉత్పత్తి చేస్తయి. ఈ స్రావం ఆయా కీటకాలకు అత్యంత ఇష్టమైన ఆహార పదార్దం వాసన వస్తది. కీటకాలు తమ టెంటకిల్ సాయంతో వీటి వాసనను గుర్తిస్తయి. వెంటనే అది నిజమైన ఆహారమేననే బ్రాంతిలో డ్రోసిరాను చేరుతయి. పై పెచ్చు మెరుపులు మెరిసినట్టు కనిపించడంతో ఆహారాన్ని గుర్తించడం తేలిక గా దొరికిందనే భ్రమలో ఉంటది కీటకం. అంతే ఈ కీటకం వచ్చి డ్రోసిరా ఒళ్లో వాలుతుంది.
స్పాట్
డ్రోసిరా పత్రాల దగ్గరకు వచ్చిన కీటకం పైకి టెంటకిల్స్ గమ్ వంటి స్రావాన్ని విసురుతయి. ఆ స్రావం కీటకాల కాళ్లకు అతుక్కొంటది. అలా ఒకదాని తరువాత ఒక టెంటకిల్ స్రావాలను విసరడంతో కీటకం బంధిచబడుతది. కీటకం టెంటకిల్స్ మద్యలో చిక్కుకున్న మరుక్షణమే డ్రోసిరా ఆ కీటకాన్ని చుట్టేస్తది. కీటకం ఎంత గింజుకున్నా తప్పించుకోలేదు. ఊపిరాడకుండా చుట్టేస్తయి టెంటకిల్స్. ఆహారం పూర్తిగా జీర్ణమయ్యాక అప్పుడు డ్రోసిరా తిరిగి యధాస్తితికి వస్తది.
స్పాట్
డ్రోసిరాలో రకరకాల జాతులున్నయి. జాతి జాతికో విధమైన పద్దతిని అనుసరిస్తయి. ప్రాంతాన్ని బట్టి, అవి పెరిగే నేలను బట్టి వివిధ రకాల జాతులను చూడొచ్చు. ఇతర దేశాలలో ఇటువంటి మొక్కలను కుండీలలో పెంచుతరు. తమ ఇళ్లలో తిరిగే వివిధ రకాల నుంచి రక్షణ పొందేందుకు ఈ మొక్కలు సహకరిస్తయి. అందుకే ఈ మొక్కలను చాలా మంది కుండీలలో పెంచుతారు.
స్పాట్ (కుండీలలో మొక్కలు)
యాంకర్ 6
డయేనియా, డ్రోసిరా మొక్కలు కీటకాలను ఎలా వేటాడుతాయో చూశాం..కానీ ఈ రెండింటికి భిన్నంగా కీటకాలు ఆయాచితంగా ఒళ్లో వచ్చి వాలే ట్రిక్ ఉందీ మొక్కదగ్గర. వద్దనుకున్నా సరిపోను ఆహారం సమకూరుతుంది. ఇంతకీ ఈ పిచ్చర్ ప్లాంట్ కు ఉన్న స్పెషల్ నిర్మాణాలేంటి. అసలీ నెపెంథిస్ మొక్క ఎలా కీటకాలను, ఇతర జీవులను వేటాడగలుగుతుంది. చూద్దాం..
స్పాట్
సన్ డ్యూ తరువాత పిచ్చర్ ప్లాంట్ మొక్క కూడా కీటకాహార మొక్కల్లో అతి ముఖ్యమైనది. ఒక్కసారి పిచ్చర్ ప్లాంట్ గురించి కూడా తెలుసుకుందాం.
స్పాట్ (Mouse gets eaten by Nepenthes carnivorous plant)( Carnivorous plant almost catches mouse)
పిచ్చర్ ప్లాంట్ చూడటానికి చిన్న కూజాలా ఉంటది. కానీ ఇది చిరు జీవుల పాలిట నరక కూపం అని చెప్పొచ్చు. దీన్న తాకిన ప్రతి జీవి ప్రాణాలపై ఆశలొదులుకోవలసిందే..
స్పాట్
ఈ పిచ్చర్ ప్లాంట్ ను నెపెంథిస్ అని పిలుస్తరు. ఇవి చాలా రకాలుగా ఉంటయి. కొన్ని ఆకు పచ్చరంగులోనూ.. కొన్ని ఎర్రని రంగులోను. మరికొన్ని తెలుపు మచ్చలు గ్రీన్ కలర్ లో ఉంటయి.
స్పాట్
ఈ పిచ్చర్ ప్లాంట్ నుంచి స్రవించే కొన్ని రకాల ద్రవాలు కీటకాలను ఆకర్షిస్తయి. ఈ మొక్కల పై ఉండే మొజాయిక్ సింబల్స్ కూడా కీటకాలకు ఆహారంలా కనిపిస్తయి. దీంతో కీటకాలు వాటి పై వాలిపోతయి. ఆశగా వాలిందా జీవితం పై ఆశలొదులుకోవలసిందే..
స్పాట్
ఈ కూజా లాంటి బాగం లోపల, కూజా వెలుపల మూతలా ఉన్న బాగంలో కూడా మైనం వంటి పూత ఉంటది. ఆశతో దీని పరిధి పై వాలిన జీవి కూజా వంటి బాగంలో పడిపోతుంది. ఈ కూజా లోపలి బాగంలో నీరుంటది. కీటకాలు నీటిలో పడి కొట్టుకొని కొట్టుకొని మరణిస్తాయి. లేదా.. అంచులను పట్టుకొని పైకి రావాలన్నా సాధ్యం కాదు ఎందుకంటే రెక్కలు తడిచిపోయి ఉంటయి. కాళ్లలో గ్రిప్ ఉండదు. మైనపు పూత వల్ల కీటకాలు గోడను పట్టుకొని ఎక్కడం సాధ్యం కాదు. తడిసిపోయిన రెక్కలతో ఎగరడం అంతకంటే సాధ్యం కాదు. ఇక జీవితాల పై ఆశలు కోల్పోవలసిందే.. అదే పిచ్చర్ ప్లాంట్ టెక్నిక్.
స్పాట్
పిచ్చర్ ప్లాంట్ లో ఎన్నో రకాలున్నయి. అయితే ఈ నెపెంథిస్ కూజాలో కీటకాలే కాదు.. రకరకాల జీవులు చేరుతయి. దీంట్లో ఎలుకలు పడ్డా ప్రాణాల పై ఆశలొదులుకోవలసిందే.. ఎంత పెద్ద జీవి పడితే ఈ మొక్కకు అంత ఉపయోగం. ఎందుకంటే కొన్ని సార్లు ఈ పిచ్చర్ ప్లాంట్ కూజాను కోసి చూస్తే వందల కొద్ది జీవులు బయట పడుతయి. ఇందులో కీటకాలు. నత్తలు, కాటర్ పిల్లర్లు, నీటి కప్పలు ఒకటేమిటి రకరకాల జీవులు ఈ చెట్టుకు ఆహారంగా మారాల్సిందే..
స్పాట్..
మొక్కే కదా.. పెద్ద జీవులయితే..దాని కూజాను చించుకొనిర బయట పడొచ్చుకదా అని అనుకుంటరు. కానీ దీని కూడా మందపాటి గోడలతో.. పీచు పదార్ధాన్ని కలిగి ఉంటది. చాలా గట్టిగా ఉంటుంది. అంత ఈజీగా తెగదు. అందుకే ఈ నెపెంథిస్ బారిన పడ్డ జీవులు చనిపోక తప్పదు.
స్పాట్
యాంకర్ 7
ఒక జీవి కదలాలంటే.. దానికి నాడీ వ్యవస్థ కావాలి, కండర వ్యవస్థ కావాలి., అంతేకాదు ఈ వ్యవస్థకు ఆదేశాలు జారీ చేసే మెదడు కావాలి. కానీ ఇవేవీ లేకుండానే మొక్కలు కీటకాలను హాం ఫట్ మని లాగేస్తున్నయి. చూడ్డానికే వింతలా ఉండే ఈ మొక్కలు ఇప్పటివి కావు. ఈ మొక్కలు అతి పురాతనమైనవి.
స్పాట్
పురాణాల్లో మాంసాహార వృక్షాల గురించిన ప్రస్థావన ఉంది. ఇవి పెద్ద వృక్షాలు. ఇవి ఏకంగా మనుషులనే మింగేవట. కానీ ఇప్పుడా జాతి వృక్షాలు లేవు. అక్కడక్కడా ఉన్నట్టు వార్తులు వస్తున్నా అవి కేవలం పుకార్లేనని రుజువయింది. నిజానికి ఈ మొక్కలకు నాడీ వ్యవస్థగానీ కండర వ్యవస్తగానీ, మెదడు కానీ లేకున్నా మొక్కల్లో ఈ రకమైన కదలిక నిర్మాణాలుండటం నిజంగా ఆశ్చర్యం గొలిపే విషయమే.
స్పాట్
జంతువులలో మాత్రమే కదలికలు ఉండటం మనం గమనించాం. కానీ మొక్కలు గాలికి మాత్రమే కదులుతయి. కానీ ఆహార సేకరణకోసం రకరకాల ట్రిక్స్ ప్లే చేసి జీవులను పట్టుకొని తమకు ఆహారంగా మర్చుకోవడం నిజంగా ప్రకృతి వింతే. మన ఇళ్లలో ఎలకలను పట్టుకోవాలన్నా ఎంతో కాలనికిగానీ ఒక బోన్ తయారు చేయలేకపోయాం. కానీ మొక్కల్లో ప్రకృతి ప్రసాదించిన బోను ఎంతో సమర్ధవంతం పనిచేస్తుంది.
స్పాట్
మాంసాహార మొక్కలు ఒక భూమి పైనే కాదు. నీటిలో కూడా ఉన్నవి . వీటిని యుట్రిక్యూలేరియా అని పిలుస్తరు. చూడ్డానికి అత్యంత సూక్ష్మంగా ఉన్నా ఇవి తమకున్న టెంటకిల్స్ సాయంతో ఆహారాన్ని ఈజీగా తమ బ్లాడర్ లోకి లాక్కొని ఆహారంగా తీసుకుంటది. ఈ వ్యవస్థ మొత్తం సూక్ష్మదర్శిని కింద పరిశీలించినపుడు మాత్రమే కనిపిస్తది.
స్పాట్
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు మరిన్ని లేటెస్ట్ టాపిక్ తో మీ ముందుటా.. దిసీజ్ శోబన్. బైబై..
బ్రేక్

సైన్స్ ఎపిసోడ్ 44

ఎ. జనార్ధన్
ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలు విప్పిచెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
యాంకర్ 1
ఆదిమ మానవుడి కాలంలో ఒక నిప్పు తప్ప ఏ ఇంధనం అవసరం లేదు. అది కూడా అడవి తగల బడుతున్నపుడు నిప్పుతో అవసరాలు తీర్చుకునే వాడు. లేదా ఏదైన పిడుగు పాటుకు చెట్లపై మంటలు పుడితే నిప్పుతో మాంసాన్ని ఉడికించుకునే వాడు. అంతకు మించిన ఇంధనం అప్పుడు అతనికి అవసరం లేదు. కానీ మనిషి నాగరికత నేర్చుకున్నడు. కష్టపడకుండా సుఖంగా బతకడానికి అలవాటు పడ్డడు. ఈ నేల పై దొరికే రకరకాల ఇందనాలకు అలవాటు పడ్డడు. మొత్తంగా ఈ ప్రపంచాన్ని ఇప్పుడు నడిపించేది ఇంధనం..
వాయిస్
ఆదిమ మానవుడి కాలంలో కేవలం తనకు దొరికిన పచ్చి మాంసాన్ని కాల్చడానికే నిప్పును వాడే వాడు. కాల క్రమంలో చలినుంచి తనను కాపాడుకోవడానికి కూడా నిప్పు అవసరం ఏర్పడింది. ఎండు కట్టెలతో నిప్పు రాజేయడం నేర్చుకున్నడు. అప్పుడు అదే ఇంధనం.. కాల క్రమంలో సగం కాలగా మిగిలిన బొగ్గు కూడా ఇంధనంగా పని చేస్తదని తెలుసుకున్నడు.. కట్టెలు కాలగా మిగిలిన బొగ్గెకాదు.. భూగర్భంలో దొరికే రాకాసి బొగ్గుకూడా ఇంధనం గా పనికొస్తుందనే నిజాన్ని తెలుసుకునే సరికి వేల సంవత్సరాలు పట్టింది. ఇంధనం తన రూపాలు మార్చుకొని ఇంటిదీపంలోకి చేరింది.
స్పాట్
మనిషికి యాంత్రిక శక్తి జీవితంలో బాగంగా మారింది. యాంత్రిక శక్తిని నడిపించేది ఇంధనం. తొలుత గాలి వాటంతో వాహనాన్ని నడపడం నేర్చుకున్న మనిషి తరువాత క్రమేపీ బొగ్గుతో.. వాహనాలు నడపడం నేర్చుకున్నడు.. బొగ్గు తరువాత డీసిల్ , పెట్రోల్, కిరోసిన్ వంటి ఇంధనాలను తన అవసరాలకు ఉపయోగించుకున్నడు.
స్పాట్
ఈ ఇంధనాలే మనిషి చేసి కష్టమైన పనులు చిటికెలో చేయగలిగేలా చేసినయి. ఎంత కష్టమైన పనిని కూడా కాసేపట్టో చేయగల సత్తా ఉందంటే అది యాంత్రిక శక్తికే సాధ్యం.. ఒక రకంగా చెప్పాలంటే కొండను పిండి చేసే శక్తి ఇంధనాలకుంది.. ఈ ఇంధనాలన్నీ భూగర్భంలోనో.. సముద్ర గర్భంలోనో దొరికేవే.. కానీ ఎంత కాలం.. ఈ భూగర్భంలో ఉన్న ఇంధనం ఏదో ఒక రోజు అయిపోక మానదు..
స్పాట్
ఇంధనం కోసం మానవుడి అన్వేషణ సాగుతూనే ఉంది.. ఆ అన్వేషణలో ఎన్నో కొత్త రకం ఇంధనాలను, శక్తులను కనుగొన్నడు. ఇంధన వినియోగం పెరిగేకొద్దీ పొల్యూషన్ పెరుగుతూ పోతోంది. పరిశ్రమలకు, వాహనాలకు, గృహ అవసరాలకు ఇంధనమే అవసరం అవుతుంది. అందుకే ఇంధనం మనిషి జీవితంలో బాగమయింది. ఇంధనం లేనిదే మనిషి లేడు అన్న భావనకు వచ్చిండు.
స్పాట్
అయితే భూగర్భంలో ఉన్న ఇంధనమైనా .. సముద్ర గర్భంలో ఉన్న ఇంధనమైనా ఏదో ఒక రోజు తరిగిపోవలసిందే.. అలా ఇంధన వనరులన్నీ తరిగిపోతే.. ఇంధన ఆధారిత వాహనాలు పరిశ్రమలు ఏం కావాలి. ఉత్పత్తులన్నీ ఆగిపోవలసిందేనా.. కాలి నడకను, ఎడ్లబండిని ఆశ్రయించాల్సిందేనా..
స్పాట్
ఇదే భయం పట్టుకుంది మానవుడికి. అందుకే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం అన్వేషించడం మొదలు పెట్టిండు. ఆ అన్వేషణలో రకరకాల శక్తులు దొరికినయి. సాంకేతిక శాస్ర్తం అభివృద్ది చెందడంతో మనిషి సహజ వనరులను వినియోగించుకోవడం అలవాటు చేసుకుండు. గాలి వాటం, నీటి శక్తి, గురుత్వాకర్షణ శక్తి, సౌర శక్తి ని ఇంధనంగా మలుచుకుండు. అలా పుట్టిందే విండ్ మిషన్, సోలార్ మిషన్, ఎలక్ర్టిసిటీ..
స్పాట్
యాంత్రిక శక్తిని వినియోగించుకోవాలంటే కేవలం డీజిల్, పెట్రోల్‌ ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గం కాదు.. సౌరశక్తితో, విద్యుత్ శక్తితో కూడా మోటార్ ను నడపడం నేర్చుకున్నడు. వీటివల్ల కాలుష్యం తగ్గడంతో బాటు వనరులను కూడా కాపాడుకున్నట్టుంటది.
స్పాట్
యాంకర్ 11
పెట్రోల్.. డీజిల్ వంటి ఇంధనాలు దొరకడమేమో గానీ వాటి రేట్లు ఆకాశాన్ని తాకుతున్నయి. రోజు రోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్య మానవుణ్ని బెంబేలెత్తిస్తున్నయి. దీనికి ప్రత్యామ్నాయ మార్గమే లేదా.. అంటే ఉంది.. అదే సోలార్ పవర్.. ఎలక్ర్టిక్ పవర్.. సౌరశక్తితో యంత్రాలు నడపడమెట్లో ఓ సారి చూద్దాం..
స్పాట్
తరిగిపోతున్న వనరుల గురించి బెంగ పడుతున్న మానవుడికి ఓ కొత్త వనరు దొరికింది. ఇది ఎప్పటికీ తరిగిపోని వనరు. ఈ సృష్టి ఉన్నంత కాలం తరగని గని లాంటి నిధి అది. అదే సౌరశక్తి. అవును సౌరశక్తితో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని నిరూపించిన్రు శాస్ర్తవేత్తలు. కాలుష్య రహిత ప్రపంచానికి తొలి అడుగు ఇక్కడే పడింది.
స్పాట్
ఎలక్ర్టిసిటీతో మోటార్లు నడిపించి పరిశ్రమల్లో వాడుకోవడం మనకు తెలుసుకానీ.. ఆటోమోబైల్స్ కూడా ఎలక్ర్టిసీతో నడపొచ్చా.. అంటే కచ్ఛితంగా నడపొచ్చు. కానీ కరెంట్ ఎక్కణ్నుంచి వస్తది. మొబైల్ మోటర్ అంటే నిల్వ ఉన్న విద్యుత్ ని వాడుకోవలసిందే.. అంటే చార్జింగ్ బ్యాటరీలతోనే వెహికిల్స్ నడుపుకోవాలి..
యాంకర్
ఎలక్ర్ట్రిసిటీతో వెహికిల్ నడుపుకోవడమంటే ఖర్చుతో కూడుకున్నదని చాలా మంది అపోహ.. ఎందుకంటే మనింట్లో ఫ్యాన్, వాషింగ్ మెషిన్ లకే కరెంట్ బిల్లు తడిసి మోపెడవుతది. మరి ఎన్నో సౌకర్యాలున్న కార్ ను నడపడానికి ఎంత విద్యుత్ కావాలి.ముందు ఒక బైక్ ను నడపడానికి ఎంత విద్యుత్ ఖర్చు అవుతదో తెలుసుకుందాం..
స్పాట్ (Solar Bike, Fujin DigInfo, Solar Cruising Bicycle, Solar Powered Bike, Endless sphere Electric Vehicle Technology Forums HD ) ఫైల్ యూజ్ చేసుకోండి.
ఇక్కడ జపనీయన్ చేతిలో ఉన్న సోలార్ ఎలక్ర్టిసిటీ బైక్ ను చూడండి. దీనికి కావలసిన విద్యుత్ సోలార్ ప్యానెల్ ద్వారా ప్రొడ్యూస్ అవుతది. ఈ సోలార్ ప్యానెల్ ను బైక్ వెనకాలే అమర్చిన్రు. సూర్యుడు ఉన్నపుడు సోలార్ ప్యానెల్ ద్వారా విద్యుత్ సమకూర్చుకోవచ్చు. దీనికి పెద్దగా ఖర్చు అయ్చేదేమీ లేదు. కానీ మబ్బులు పట్టినపుడు, రాత్రివేళల్లో మాత్రం ఇంట్లోనే విద్యుత్ ను ఉపయోగించుకొని రీచార్చ్‌ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ అయితే బైక్ పై 220 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. ఇక విద్యుత్ బిల్లు విషయానికి వస్తే గంటకు ఒక ఎయిర్ కండీషన్ రన్నయితే ఎంత బిల్లు వస్తదో.. చార్జింగ్ సమయానికి అంతే బిల్లు వస్తది. జపాన్ యెన్ లలో చెప్పాలంటే 220కిలోమీటర్లకు రెండు యెన్ ల కరెన్సీ ఖర్చవుతది. ఇండియన్ కరెన్సీలో అయితే కేవలం ఒక్కరూపాయే అన్నమాట. ఎందుకంటే ఇందులో ఎక్కువ బాగం సోలార్ రూపంలో క్యాష్ లెస్ ఎనర్జీ సేవ్ చేసుకోవచ్చు.
స్పాట్
ఈ బైక్ ను ఉదయపు వేళలో ఆఫీస్ కు రావడానికి గానీ, లేదా కంపెనీలకు వెళ్లెటపుడు వాడుకొని మద్యాహ్న వేళలో చార్జింగ్ కోసం వదిలేయాలి. తిరిగి సాయంకాలం వేళ ఇంటికెళ్లే సమయానికి ఫుల్ గా చార్జింగ్ అయి ఉంటది. దీని వీల్స్ తక్కువ శక్తితో ఎక్కువ కాలం తిరిగే విధంగా తయారు చేస్తరు. అందువల్ల ఎక్కువ విద్యుత్ కూడా ఖర్చు కాదు. పై పెచ్చు బైక్ బాడీ మొత్తం ఫైబర్ తో తయారు చేయడం వల్ల ఇంజన్ పై బారం కూడా చాలా తక్కువ పడుతది.
స్పాట్
యాంకర్
చూశారుగా ఒక్కరూపాయి ఖర్చుతోనే చిన్న బైక్ పై ఎలా హాయిగా తిరుగుతున్నారో.. బైక్ సంగతి ఓకే.. మరి అంతే తక్కువ ఖర్చుతో నడపగలిగే కారుంటే బావుంటుంది కదూ.. అవును.. అందుకే ఇంజనీర్లు సోలార్ కారును తయారు చేసిన్రు. ఈ కారు కొనుక్కుంటే ఇక పెట్రోల్ కోసం పర్సులో చేయి పెట్టాల్సిన అవసరమే లేదు.
స్పాట్ (ఫోటోలు వాడుకో గలరు,
సౌరశక్తితో నడిచే కారు.. వింటుంటేనే కాస్త థ్రిల్లింగా ఉంది. కానీ ఇది ఎలా పనిచేస్తుందనే దాని పైనే అందరికీ అసక్తి.. ఎందుకంటే సైకిల్ షేప్ లో ఉన్న బైక్ అంటే ఓకే.. కానీ కారంటే మాటలా.. దాని ఇంజన్ను లాగాలన్నా.. అందులో కూర్చున్న వారిని లాగాలన్నా ఎంతో శక్తి అవసరం.. ఇంత శక్తిని రీచార్జి చేసుకోవాలంటే అంత ఈజీకాదు.ఇంతకీ సౌర విద్యుత్ కారు ఎలా నడుస్తుందో చూద్దాం.
స్పాట్ (GOOD Transparency Electric Vehicles) ఫైల్ వాడుకోవాలి.
ఎలక్ర్టిక్ కారు రిచార్ట్ కావాలంటే ఎంత విద్యుత్ అవసరం అనే విషయాన్ని పరిశీలించిన్రు. ఒక కారు 8 గంటల్లో ఫుల్ రీచార్జ్ అవుతది. గంటకు 2500వాట్ లు రీచార్జ్‌ అవుతది. అదే సమయంలో ఒక బల్బ్ 100 వాట్లు ఖర్చు చేస్తది. రీ చార్జి అయిన ఈ మొత్తం కరెంట్ సంవత్సరం ఉపయోగపడుతది. ఇది నాలుగు ప్లాస్మా టి.విలు సంవత్సరకాలం వాడిన విద్యుత్ తో సమానం. మరో ప్రశ్న ఇంట్లో కారు రీ చార్జి చేసుకుంటే ఎంత కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంటదనేది మరో ప్రశ్న..అయితే మైళ్లలో చూసుకుంటే. 100మైళ్లకు మూడు డాలర్లు ఖర్చు అవుతది. అంటే ఇండియన్ రూపీలలో అయితే 150 రూపాయలన్నమాట. అంటే మైలుకు రూపాయిన్నర అన్నమాట..అదే పెట్రోల్ కు అయితే 100 మైళ్లకు 10 డాలర్లు ఖర్చు అవుతది.రూపాయిల్లో అయితే 500లన్న మాట. కిలోమీటర్ కు 5 రూపాయలు ఖర్చవుతది.
స్పాట్
ఎలక్ర్టిసిటీ కార్ గురించి చెబుతుంటే బాగానే ఉంది. మరి దీన్ని రీచార్జ్ చేసుకోవడం ఎలా.. మన సెల్ ఫోన్ రీచార్జ్ చేసుకున్నట్టేనా.. ఇంకా ఏమన్నా చేయాలా అంటే.. అచ్చు మనం మన సెల్ ఫోన్ ను రీచార్జ్ చేసుకున్నట్టే రీ చార్జ్ చేసుకోవాలి. ఇప్పడు కార్ ను ఎలా రీ చార్జ్ చేసుకోవాలో చూద్దాం..
స్పాట్
ఎలక్ర్టిక్ కారును పగలు రాత్రి అనే తేడా లేకుండా 24 గంటల్లో ఎప్పుడైనా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ కార్లకు పెద్ద చెప్పుకోదగ్గ కార్భన్ పొల్యూషన్ ఉండదు కాబట్టి..నీట్ గానే ఉంటయి. కంబషన్ కూడా ఈజీ.. ఇకో ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు.
స్పాట్
ఈ వాహనాల వాడకం వల్ల బొగ్గు, సహజవాయువును ఆదా చేయొచ్చు.
స్పాట్
అంతా బాగానే ఉంది. ఇప్పుడున్న కార్లన్నీ ఎలక్ర్టిసిటీ కార్లుగా మారితే అందరికీ సరిపడా విద్యుత్ మన విద్యుత్ కేంద్రాలలో ఉందా.. వాస్తవానికి ఇండ్లలో అందరూ ఇదే పనిలో ఉంటే గృహావసరాలకు సరిపడా కరెంట్ ఉండదు. అందుకే గ్రిడ్ స్టేషన్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన్రు. ఈ స్టేషన్ లలో కార్ రీ చార్జ్ చేసి జస్ట్ క్రెడిట్ కార్డ్ తో స్క్రాట్ చేస్తే చాలు.. అచ్చు మన పెట్రలో బంకులో మాదిరి.. ప్రాబ్లెం సాల్వ్ డ్..
స్పాట్
ఒక్కోసారి ఇళ్లలో కరెంట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి అప్పుడేం చేయాలి.. సరిగ్గా ఈ డౌటే వచ్చింది ఇంజనీర్లకు అందుకే సోలార్ రీ చార్జ్ కార్ ను తయారుచేసిన్రు. కారు బాడీలో ఎండ తగిలే ప్రాంతంలో సోలార్ ప్యానెళ్లను అమర్చిన్రు. ఈ సోలర్ ప్యానెళ్లలో నుంచి కావలసినంత విద్యుత్ ను రీ చార్జి చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఖర్చు ఉండదు.
స్పాట్
ఇవే కాకుండా ఎలక్ర్టో మాగ్నటిక్ ఫోర్స్.. గ్రావిటీ ఫోర్స్ వంటి వాటితో ఇంధనానికి ప్రత్యామ్నాయ శక్తులను తయారు చేస్తున్నరు. ప్రకృతి శక్తులైతే ఇప్పట్లో తరగక పోగా ఎంతో తక్కువ ఖర్చుతో కూడిన పని. అందరికీ అందుబాటులో ఉంటది. ఈ సోలార్ వెహికిల్స్ అందుబాటు లోకి వస్తే ఇక పెట్రోల్ ధరల గురించి ధర్నా చేసే అవసరమే ఉండదు. క్యూలో ఉండి పెట్రోల్‌ కొట్టిచ్చే పనే ఉండదు.
స్పాట్

ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ 43

ఎ.జనార్ధన్
ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలను విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
యాంకర్ 1
మానవుడు ఇంత అభివృద్ది సాధించానని విర్రవీగుతున్నడు. మొత్తం విశ్వరహస్యాలనే గుప్పిట్లో పట్టేశానని సంబుర పడుతున్నడు. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానం సాధించినా ఇది కొన్ని రోజులకే పరిమితం కానుందా... ఈ విజ్ఞానంమంతా కాలగర్భంలో కలిసిపోవలసిందేనా.. ఈ భూమి ప్రమాదంలో పడనుందా.. అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇది మేము చెప్పే మాటలు కావు. లేదా భయపెట్టడానికి అనే మాటలు కావు.. ఇవి అక్షరాలా విశ్వసత్యాలు.. శాస్ర్తవేత్తలు వందల సంవత్సరాలుగా పరశోధించి నిగ్గుతేల్చిన నిజాలు..
స్పాట్
ఈ విశ్వం ఎలా ఏర్పడింది.. విశ్వం ఏర్పడక మునుపు ఏముండేది.. ఈ ప్రశ్నలు వేలాది సంవత్సరాల నుంచి మానవుణ్ని వేధిస్తున్న ప్రశ్నలు. శోధించగా.. శోధించగా.. శాస్ర్తవేత్తలకు విభ్రాంతికర వాస్తవాలు తెలిసినయి. ఇప్పుడు భూమి పై ఉన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడాలంటే 13బిలియన్ సంవత్సరాలు పైనే పట్టింది. ఇన్ని సంవత్సరాలకు ముందు భూమి ఎలా ఉండేది. ఈ విశ్వం ఎలా ఉండేది..
స్పాట్
ఈ విశ్వం ఏర్పడ ముందు. అత్యధిక సాంధ్రతగ చిమ్మ చీకటి ఉండేది. పూర్తిగా దైవకణాలని పిలవబడే సృష్టి నిర్మాణ ప్రాథమిక కణాలతో ఉందని శాస్ర్తవేత్తల ఊహ.. ఒకానొక దశలో రెండు ప్రాథమిక కణాల తాడనం వలన ఈ మహాసృష్టికి పునాదులు పడ్డయని ఇప్పటి వరకు మెజారిటీ శాస్ర్తవేత్తలు అంగీకరించిన ఉమ్మడి భావన.
స్పాట్
ఈ మహా విస్పోటనం తరువాత కాంతి వేగంతో సృష్టి విస్తరించింది. ఈ సృష్టి క్రియలో సాంద్రతాయుత కణాలన్నీ ఏకమై ఎన్నో తాండనాలు జరిగినయి. అప్పుడే పుట్టిన పిల్ల గ్రహాలు, బాల నక్షత్రాలు ఒక నిర్ధిష్ట కక్ష్యలో ఉండక పోవడం, ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఒక దాని కొకటి ఢీ కొని మహా అగ్ని విలయమే జరిగింది.
స్పాట్
ఇలా కొన్ని బిలియన్ల సంవత్సరాల తరువాత నేటి అనంత విశ్వం రూపుదాల్చింది. ఈ మహా విశ్వంలో ఎన్నో చోట్ల జీవం ఉంది అనేది నేటికి అర్ధం కాని పరిస్థితి. కానీ అన్ని రకాల వాతావరణ పరిస్థితులు అనుకూలించడం వల్లనో రసాయన చర్యలు సహకరించడం వల్లనో.. ఆస్టరాయిడ్ల నుంచి జీవం దిగుమతి కావడం వల్లనో ఈ భూమి పై జీవావిర్భావానికి పునాదులు పడ్డయి.. కోటాను కోట్ల రకాల జీవజాతులు వృక్ష జాతులు ఆవిర్భవించినయి.
స్పాట్
సృష్టి ఆవిర్భావం నుంచి నేటి వరకు భూమి పై మనుగడ దినదిన గండంగా మారుతోంది. ఏ రోజు ఏ గ్రహ శకలం వచ్చి భూమిని ఢీ కొంటుందో అనే భయం వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే ఈ విశాల విశ్వంలో ఆస్టరాయిడ్ ల ట్రాఫిక్ రోజు రోజుకూ పెరిగి పోతోంది. భ్రమణ వేగం తగ్గి ఆస్టరాయిడ్ లన్నీ ఏదో ఒక గ్రహా గురుత్వాకర్షణ శక్తికి లోనయి గ్రహాలను ఢీకొంటున్నయి.ఈ ఆస్టరాయిడ్ యాక్సిడెంట్ బెడద సౌర కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాలకు తప్పడం లేదు. కానీ ఇతర గ్రహాల పై జీవం లేదు కాబట్టి పెద్దగా ముప్పులేదు.
స్పాట్
భూమి పై కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఆస్టరాయడ్ లు వచ్చి పేలిపోతుంటయి. వీటినే మనం చుక్క తెగింది అని పిలుచుకుంటం. కానీ మరీ పెద్ద ఆస్టరాయడ్లు వచ్చినపుడు భూమికి, భూమి పై ఉన్న జీవజాతులకు పెనుముప్పు ఖాయం. ఇది ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఒక వేళ ఇలా జరుగకున్నా మరో రూపంలో ఈ సృష్టి వినాశనం తప్పని సరి అంటున్నరు శాస్ర్తవేత్తలు.
యాంకర్ 2
ఈ సృష్టి ఎంత వేగంగా విస్తరిస్తుందో.. అంతే వేగంగా వినాశనానికి గురి కాబోతుంది. నిజమా.. ఇలా అని నిత్యం భయపెట్టడమెందుకు.. హాయిగానే బతుకుతున్నాం కదా.. మళ్లీ ఈ ప్రళయం గోలేంటని అనుకోవచ్చు. కానీ మేం చెప్పే విలయం.. మనం కాదు కదా మన మునిమనవళ్లకు.. మునిమనవళ్లు కూడా చూడరు. ఎందకంటే ఇదంతా జరగాలంటే సూర్యుడిలో ఉన్న ఇందనం పూర్తిగా అయిపోయి తీరాలి. అలా అయిపోవడం మాత్రం తధ్యం.
స్పాట్
ఈ సృష్టిలో నక్షత్రాలన్నీ మిణుకు మిణుకు మంటూ మెరుస్తున్నయంటే కారణం అవన్నీ స్వయం ప్రకాశకాలు. ఈ స్వయం ప్రకాశం వెనుక నిత్యం కొన్ని కోటాను కోట్ల ఆటంబాంబులకు సమానమయ్యే శక్తి ఉంది. ఏదో ఒకరోజు ఈ శక్తి వనరు తరగడం ఖాయం అని శాస్ర్తవేత్తలు అంచనా వేస్తున్నరు. ఇలా శక్తి మొత్తం పూర్తిగా తరగిపోయి.. వాటిల్లో ఉన్న ఇంధనం మొత్తం అయిపోయి నక్షత్ర విస్పోటనం జరుగుతది. విస్పోటనం తరువాత ఈ నక్షత్రం బ్లాక్ హోల్ గా మారుతది. సరిగ్గా అప్పుడే సృష్టి వినాశనం మొదలవుతది. ఈ బ్లాక్ హోల్ తన చుట్టూ ఉన్న గ్రహాలను మింగేయడం మొదలేస్తది. బ్లాక్ హోల్ నుంచి కాంతి కూడా తప్పిచ్చుకోలేదు. ఈ బ్లాక్ హోల్ తన పరిధిలో ఉన్న గ్రహాలను నక్షత్రాలను తనలో కలిపేసుకుంటది.
స్పాట్
నక్షత్రాలన్నీ బ్లాక్ హోల్స్ గా మారాల్సిందేనా అంటే అవుననే సమాధానం వస్తది శాస్ర్తవేత్తల నుంచి..అవును ఒక్కమాటలో చెప్పాలంటే భూమి కూడా ఒక బ్లాక్ హోల్ గా మారబోతోందా.. స్టీఫెన్ హాకింగ్ ప్రకారం ఇదిగో భూ కేంద్రంలో మార్పుల వల్ల అత్యధిక గురుత్వాకర్షణ శక్తికి లోనయి భూమి తనలోకి తానే కుంచించుకొని పోతుంది. ఒకానొక దశలో కేంద్రానికి కుంచించుకు పోయి ఒక నల్లని బిందువు మాదిరిగా మారిపోతది.
స్పాట్
భూమి ఒక్కో ముక్కగా. ఎడారులు, మంచు పర్వతాలు అలా కుంచించుకు పోతయి. మొత్తం 8000వేల మైళ్ల వ్యాసార్ధం ఒక చిన్న బిందువుగా మారిపోతది.
స్పాట్
ఈ బ్లాక్ హోల్ నుంచి విపరీతమైన రేడియోషన్ విడుదలవుతది. క్రమేపీ ఈ బ్లాక్ హోల్ తెల్లగా ప్రకాశించ బడుతది. దీనికి అందుబాటులో ఉన్న అన్ని ఉపగ్రహాలను మింగేస్తది. 15 మైళ్ల వ్యాసార్దంలో ఉండే ఈ బ్లాక్‌ హోల్ రోజు రోజుకూ తన వ్యాసార్ధాన్ని పెంచుకొని ఒక మాసివ్ బ్లాక్ హోల్ గా రూపాంతరం చెందుది. ఎంతగా అంటే 11మిలియన్ మైళ్లవ్యాసార్ధానికి తన విస్ర్తుతిని పెంచుకొంటది. అలా పెరిగిన బ్లాక్ హోల్ ఈ పాలపుంతనే మింగగల శక్తిని సొంతం చేసుకుంటది.
స్పాట్
మన పాల పుంత తో బాటు ఈ సౌర కుంటుంబం కూడా విస్పోటనం వల్ల సంభవించినయే.. ఈ సౌరకుటుంబంలో ఉన్న నవగ్రహాలు, వాటి ఉపగ్రహాలు అన్నీ ఏదో ఒక రోజు సూర్యుడికి ఆహారం కావలసినవేనని శాస్ర్తవేత్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నరు.
స్పాట్
ఒక మహా విస్పోటనం నుంచి ఎలా ఈ సృష్టి ఆవిర్భవించిందో.. ఆఖరుకు తిరోగమన దిశలో తిరిగి అదే దశకు చేరుకో బోతుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నరు. చిన్న చిన్న కాల బిలాలు, పిల్ల విశ్వాలు ఏర్పడి వాటిలో అవే జీర్ణించుకొని ఆ బిలాల వ్యాసార్ధం పెద్దదయి.. మొత్తం ఒక సాంద్రతాయుత బిలంగా రూపాంతరం చెందబోతోందని శాస్ర్తవేత్తలు అంచనా కడుతున్నరు. అయితే ఇది సృష్టి ఏర్పడకముందు ఉన్న ఒక సాంద్రతాయుత స్థితి గా భావిస్తున్నరు.
స్పాట్
మన భూగోళం ఇప్పుడున్నట్టు ఉండేది కాదు.. ఒకప్పుడు ఈ భూమి సలసల కాగే అగ్నిపర్వతం క్రమేపీ చల్లబడి హైడ్రోజన్ ఆక్సీజన్ వాయువుల సమ్మేళనంతో ఏర్పడిన నీటి ఆవిరులు నేటి మన భూమి బ్లూ ప్లానెట్ రూపానికి కారణభూతాలు. ఈ భూమి పై నీరంతా ఒక వైపు భూమి ఉత్తర ధృవం వైపు ఉంది. ఐతే.. తర్వాత భూమి పై జరిగిన అనేక భౌతిక మార్పుల మూలంగా భూమి ఖండ, ఖండాలు గా విభజించ బడ్డది. అయితే ఈ ఖండ చలన సిద్దాంతం ప్రకారం భూమిపై జీవం ఏర్పడ్డంకనే నేల ఖండాలుగా విడిపోయిందని చెప్తరు. అందుకే ఖండాల అంచులు ఒకదానినొకటి విడదీసినట్టుండటం, వివిధ ఖండాలలో ఒకే రకమైన జీవ జాతులుండటం.. ఈ వాదానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. అయితే ఈ భూమి పై ఎన్నో జీవజాతులు అంతరించి పోయినయి. కాలగర్భంలో కలిసిపోయినయి. శాస్ర్తవేత్తలకు దొరికిన శిలాజాలను బట్టి ఎన్నో రకాల జీవులు ఈ నేల పై మనుగడ సాగించినయి. ఈ జాతులు ఎందుకు అంతరించిపోయాయనే విషయం పై భిన్న వాదనలున్నయి. గ్రహ శకలం ఒకటి భూని తాకి చాలా జీవ జాతులు అంతరించాయనే వాదన కూడా ఉంది. అయితే ఈ గ్రహ శకలం ఖండచలనం జరిగాక వచ్చిందా.. లేక భూమి ఉమ్మడిగా ఉన్నపుడే ఢీ కొందా అనే విషయాలపై కూడా అభిప్రాయ భేదాలున్నయి. ఏదేమయినప్పటికీ గతంలో ఈ భూమిని గ్రహ శకలం ఢీకొందనే మాట మాత్రం వాస్తవం. మళ్లీ అటువంటి గ్రహ శకలం రూపంలో భూమికి ముప్పు రాబోతోంది.. ఏం టా గ్రహ శకలం..
యాంకర్ 3
గ్రహశకలాలు భూమి పైకి రావడం కొత్తేమీ కాదు.. అలాగని నిత్యమూ కాదు.. కానీ ఈ సారి అంటే 2019లో భూమికి దగ్గరగా వచ్చే గ్రహ శకలం మాత్రం అతి పెద్దది. అది ఏమాత్రం కక్ష్య తప్పి భూమి పైకి వచ్చిన ఈ భూమి పై ఉండే జీవ జాతులన్నీ మాడి మసవ్వాల్సిందే..
స్పాట్
ఇక్కడ పెద్ద బండరాయిలా శూన్యంలో ప్రయాణిస్తున్న ఈ భారీ గ్రహ శకలం పేరు అపోఫిస్. ఈ గ్రహ శకలం గురించి గ్రీకుసిద్దాంత కర్తలు ముందే ఊహించిన్రు. ఈ అపోఫిస్ పై కూడా వారి గ్రంధాల్లో రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నయి. అయితే శాస్ర్తవేత్తలు వీరి ఊహాగానాలను కూడా కొట్టిపారేయలేదు. దీన్ని 2004లో కనిపెట్టిన్రు శాస్ర్తవేత్తలు. ఇది 20 మిలియన్ టన్నుల బరువుంటది. గంటకు 28వేల మైళ్ల వేగంతో శూన్యంలో దూసుకుపోతుంది. బుల్లెట్ కంటె 10 రెట్టవేగంతో ఇది ప్రయాణిస్తుంది. దీనిలో మన ప్రపంచం మొత్తం దగ్గర ఉన్న అణుబాంబులను మించిన శక్తి ఉంది.
స్పాట్
అపోఫిస్ 2029 సంవత్సరం కల్లా భూమికి ఇది 23వేల మైళ్ల దగ్గరిగా వస్తది. అంటే ఉపగ్రహాల వంటివి దీన్ని తాకే అవకాశం లేకపోలేదు. అంతే కాదు. ఒక వేళ ఇది భూమి వైపు దూసుకొచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని శాస్ర్తవేత్తల అందోళన. అయితే అపోఫిస్ నుంచి తప్పిచ్చుకున్నా.. విశ్వాంతరాళంలో దాగిన వేలాది గ్రహశకలాల ఎప్పుడూ భూమినే టార్గెట్ చేసుకొని భ్రమణం చేస్తున్నయి. 10 మైళ్ల వ్యాసార్ధం ఉన్న గ్రహ శకలాలు భూమిని ఢీ కొని విధ్వంసాన్ని సృష్టిస్తున్నయి. గతంలో ఇటువంటి గ్రహశకలం భూమిని ఢీ కొని భూమిని స్టెరిలైజ్ చేసింది.
స్పాట్
మనవ నాగరికత పెరిగినంక మనిషి భూగోళాన్ని తన చేతుల్లోకి తీసుకుండు. టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ భూమి పై ఉన్న ఎన్నో రహస్యాలను, ఖగోళ రహస్యాలను తెలుసుకుండు. అంతే కాదు. తన జ్ఞానం వినాశనం వైపు కూడా అడుగులేసింది. అందులో బాగమే అణుబాంబ్
స్పాట్
మానవుడు తను తయారు చేసుకున్న. అణుబాంబులే భూమికి మరణ శాసనాలను లిఖించనున్నయి.అణుయుద్దాల వల్ల భూమిని ముక్కలు చేసే అవకాశం ఉంది.కానీ ఇప్పటికే అణునిషేదం అమలు చేసి ఈ ముప్పును తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నరు. కానీ విశ్వాంతరాళం మరో ముప్పును సిద్దంగా ఉంచింది. ఏంటా ముప్పు.
స్పాట్
విశ్వాంతరాళంలో నక్షత్రాలలో ఇందనం అయిపోవడంతో పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతుంటయి. ఒక నక్షత్రం పేలినపుడు పెద్ద పెద్ద శకలాలు విస్పోటనంలోంచి భారీగా బాహ్య వాతావరణంలోకి విసిరివేయబడుతయి. ఈ శకలాలు ఒక్కోక్కటి చంద్రుడి పరిమాణం నుంచి భూమి పరిమాణమంత ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ నక్షత్ర విస్పోటనాలను సూపర్ నోవా అని పిలుస్తరు.
స్పాట్
ఈ సూపర్ నోవా జరిగినంకనే బ్లాక్ హోల్స్ ఏర్పడుతయి. కానీఈ సూపర్నోవా నక్షత్రం విస్తరించే సమయంలో భారీ శబ్ధంతో కూడిన పేలుడు సంభ విస్తుంది. ఆకాశం ప్రకాశవంతమై, దాని నుంచివెలువడిన అతిచిన్న కణాలైన న్యూట్రినోలు, అంతరిక్షంలో భారీ స్థాయిలో వర్షిస్తాయని శాస్ర్తవేత్తలు చెబుతున్నరు. సూపర్నోవాలోని 99 శాతం శక్తి , న్యూట్రినోల రూపంలో వెలువడుతుంది. ఈ న్యూట్రినోలు భూమిలోకే కాక మానవుల శరీరంలోకి కూడా చొచ్చుకుపోతయి.
యాంకర్ 4
సూపర్ నోవాలంటే ఏంటి.. వీటి వల్ల మనిషికి వచ్చే ముప్పేంటి.. ఎక్కడో కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో నక్షత్రాలు పేలిపోతే.. మనకు వచ్చే నష్టమేంటి.. అవును.. వేయి సంవత్సరాలకు ముందు పేలిన నక్షత్రాల వల్ల కూడా భూమికి భారీ నష్టమే పొంచి ఉంది..ఏంటా నష్టం..
స్పాట్
ఈ సూపర్ నోవాలు ప్రతి పది సంవత్సరాల కొకసారి వస్తుంటయి. అంటే ఈ విశ్వంలో అర్ధ శతాబ్దానికో నక్షత్రం పేలిపోతోందన్నమాట. అయితే ఇవి భూమి వరకు వస్తయా రావా అనేది వాటి దూరాన్ని, శక్తిని బట్టి ఉంటది.
స్పాట్
19వ దశకంలో బ్రిటీష్ సాటిలైట్ గామా రేడియేషన్ ను గుర్తించింది. ఈ రేడియేషన్ అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి అణుబాంబులు పేలినపుడు మాత్రమే మస్తయి. ఈ గామా కిరణాలను పరిశీలిస్తే ఇవి అంతరిక్షం నుంచి వచ్చినవిగా తెలిసింది. అయితే ఇవి అంతరిక్షం నుంచి ఎలా సడన్ గా వచ్చినవని సూక్ష్మవిశ్లేషణ చేస్తే మన దగ్గరి నుంచి 8వేల కాంతి సంవత్సరాల దూరంలో పేలిపోయిన ఒక నక్షత్రం తాలూకు గామా కిరణాలని తేలింది. అంటే కాంతి వేగంతో ప్రయాణించినా నక్షత్రం పేలిపోయిన 8వేల సంవత్సరాలకు ముందు జరిగిన పరిణామాలు భూమి పై ప్రభావం చూపుతున్నయి. అవి భూమిని చేరడానికి ఇన్ని వేల సంవత్సరాలు పట్టింది. అయితే ఎప్పుడో జరిగిన అంతరిక్ష ఉత్పాతాలకు ఇప్పుడు భూమి పై ప్రభావం పడుతోంది.
స్పాట్
ఈ రేడియేషన్ భూమి పై ఉన్న వృక్ష జీవ జాతుల పై ప్రభావం చూపుతోంది. డబ్లూ 104 అనే నక్షత్రం పేలిన 8వేల సంవత్సరాల తరువాత భూమి దాని రేడియేషన్ ను ఎదుర్కొంది. అయితే దీని బలహీన ప్రాంతాలు మాత్రమే భూమి పరిధిలోకి వచ్చి వెళ్లినయి. పూర్తి స్థాయిరేడియేషన్ భూమిని చేరితే మాడి మసవ్వాల్సిందే.
స్పాట్
450 మిలియన్ సంవత్సరాలకు పూర్వం వాతావరణం మొత్తం గామా కిరణాలతో నిండి ఉందని శాస్ర్తవేత్తలు చెబుతున్నరు.
స్పాట్
మానవుడు ఖగోళరహస్యాలు తెలుసుకునే క్రమంలో అద్భుతమైన రహస్యాలు వెలుగు చూసినయి. ముందుగా చంద్రుని పై కాలు మొపిండు..
స్పాట్
చంద్రుని తరువాత 50 విలియన్ మైళ్లదూరంలో ఉన్న మార్స్ గ్రహం పైకి మానవుడి దృష్టి మళ్లింది. ఈ రెడ్ ప్లానెట్ పై ఏముందో తెలుసుకోవాలన్న ఆకాంక్ష మనిషికి పెరిగింది. ఇక్కడ తక్కువ గురుత్వాకర్షణ శక్తి, తక్కువ పీడనం, అత్యధికంగా కార్భన్ డై ఆక్సైడ్ గ్యాస్ ఉండటం గమనించిండు. మార్స్ పై ప్రత్యేకించిన అయస్కాంత క్షేత్రంగానీ, ఓజోన్ పొరగానీ లేకపోవడాన్ని శాస్ర్తవేత్తలు గుర్తించిన్రు. అయితే మార్స్ నేల పై అప్పికే సరస్సులు ఉండి ఎండినట్టు ఆనవాళ్లు ఉన్నయి. అయితే ఇవి నీటివా కాదా అన్న ప్రశ్న మాత్రం అలాగే మిగిలి ఉంది.
స్పాట్
మార్స్ గ్రహం పై ఉన్న వివిధ రకాల ఆనవాళ్లు గతంలో జీవ సంచారం ఉన్నట్టనిపిస్తున్నా,.. భౌతిక పరిస్థితులు మాత్రం దీనికి విరుద్దంగా ఉన్నయి. సూర్యుడి వయసు రోజు రోజుకూ తరిగిపోతుంది. ప్రతి బిలియన్ సంవత్సరానికి ఒక సారి 6శాతం తగ్గుతోంది. 5 బిలియన్ సంవత్సారాలనుంచి 200బిలియన్ డిగ్రీలు తగ్గింది. దీనికి భవిష్యత్తులో భూమి ఒక గుర్తింపులేని గ్రహంగా మారొచ్చు. 7 బిలియన్ సంవత్సరాల తరువాత సూర్యుడు క్రమేపీ విస్తరించడం మొదలు పెడతడు. సూర్యునిలో ఇందనం తరుగుతున్న కొద్దీ దాని విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతుంటది.
స్పాట్
7 బిలియన్ సంవత్సరాల తరువాత సూర్యుడు ప్రస్తుత పరిమాణం కంటే 200 రెట్టు పెద్దగా ఉంటడు. భూమికి 200 మిలియన్ల మైళ్ల వ్యాసార్దంలో ఉంటడు.అప్పటికే బుదుడు, శుక్రుడు గ్రహాలు సూర్యుడిలో కలిసిపోతయి. ఆ తరువాత వంతు భూమిదే. భూమి కూడా ఒకానొక దశలో సూర్యుడిలో విలీనం కాక తప్పదు.
స్పాట
ఇన్ని వేల సంవత్సరాలుగా అభివృద్ది చెందిన జీవజాతి భౌగోళిక మార్పులకు మసి కావల్సిందేనా.. ఈ జీవద్రవ్యాన్ని కాపాడుకునే మార్గమే లేదా.. టెలీస్కోప్ చూపు మేరలో మరో జీవానుకూల గ్రహం ఏదీలేదా. అంటే ఉంది.. అదే గ్లీసర్..
స్పాట్
యాంకర్ 5
గ్లీసర్ గ్రహం మానవుడు జీవించడానికి అనుకూలమైన గ్రహమే అని శాస్ర్తవేత్తల ఆశ.. కానీ వచ్చిన చిక్కల్లా అంతదూరం వెళ్లడమే.. ఒక మనిషి కాంతి వేగంతో జీవిత కాలం పయనిస్తే గాని ఈ నక్షత్రాన్ని చేరుకోలేడు. మరి ఎలా.. ఈ సమస్యను అధిగమించేదెలా.. పరిష్కారం కనుగొన్నరు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఇది గ్లీసర్..అచ్చం భూమిని పోలిన మరో జీవానుకూల గ్రహమని భావిస్తున్నరు. 2007లో శాస్ర్తవేత్తలు దీన్ని కనుగొన్నరు. దీని ఉపరితలం పై నీరుందనే బలమైన నమ్మకం శాస్ర్తవేత్తలను దీనిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు పురికొల్పింది. కానీ గ్లీసర్ చాలా చాలా దూరంలో ఉన్న గ్రహం. ఇది ఎంత దూరంలో ఉందందటే.. 20 కాంతి సంవత్సరాలకు మించిన దూరంలో ఉంది. అంటే 120ట్రిలియన్ మైళ్ల దూరంలో ఉంది. అయితే వచ్చిన చిక్కల్లా ఇక్కడికి ఎలా వెళ్లాలన్నదే.
స్పాట్
ఈ గ్రహాన్ని చేరాలంటే కాంతి వేగంతో ప్రయాణించే వాహనం కావాలి. మనిషి మొట్టమొదట1997 లో ఒక వాహనాన్ని తయారు చేసిన్రు. ఈ వాహనం అత్యతం వేగంతో ప్రయాణిస్తది.39వేల మైళ్లను గంటలో చేరగలదు. కన్నుమూసి తెరిచేలోపే భూమిని చుట్టే శక్తి కలదు.
స్పాట్
గ్లీసర్ గ్రహాన్ని చేరాలంటే 350 సంవత్సరాలు పడుతది. ప్రస్తుతం ఉన్న సాంకేతి పరిజ్ఞానాన్ని మరింత పెంచితే ఇది సాధ్యం కావచ్చు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఒక భారీ అంతరిక్ష వాహనం అటువంటిదే. ఇందులో అణుధార్మిక శక్తి నింపి కేవలం రేడియోధార్మిక శక్తితోనే వేగంగా ప్రయాణించే వాహనాన్ని తయారు చేయవచ్చని శాస్ర్తవేత్తల ఊహా.
ఇంత ఖర్చు పెట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని మొత్తం ఉపయోగించి అంతరిక్ష వాహనాన్ని తయారు చేసినా మరో సమస్య ఉంది. సెకన్ కు వేయి కిలో మీటర్ల వేగంతో ప్రయాణించినా గ్రహాన్ని చేరాలంటే కనీసం 75 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక మనిషి పూర్తి జీవిత కాల మన్నమాట. అంటే మనం పంపించే మిషన్ లో అప్పుడే పుట్టిన ఒక బిడ్డను వేసి.. వాడు బతకడానికి అన్ని రకాల వాతావరనాలు కల్పిస్తే వాడు వృద్దుడయ్యే సరికి ఆ గ్రహాన్ని చేరుతడు. లేదా ఇది సాధ్యం కాని పని. దీనికి కూడా ఓ మార్గం ఉంది. రానున్న జనరేషన్ లో జెనెటిక్ ఇంజనీరింగ్ను ఉపయోగించి మానవ జీవితకాలాన్ని పెంచనున్నారు. జెనెటిక్ ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో మనిషి జీవితకాలాన్ని రెండురెట్టు పెంచి కొంత విజ్ఞానం నేర్పినంక వాడిని వ్యోమగామిగా తీర్చిదిద్ది అంతరిక్ష వాహనంలో గ్లీసర్ గ్రహానికి పంపాలి. అయితే ఇది ఏ ఒక్కరినో ఇద్దరినో కాకుండా ఒక బంచ్‌ గా పంపితే ఏదో ఒక క్షణంలో.. ఎక్కడో ఒక ప్రాంతంలో ఈ ప్రయోగం సక్సెస్ అయి జీవం మరో గ్రహం పై మనుగడ సాగించే అవకాశం ఉంది. 13.5 బిలియన్ సంవత్సరాల వయసున్న ఈ విశ్వం త్వరలో తన రూపు మార్చుకోబోతోంది. త్వరలో అంటే బిలియన్ ల సంవత్సరాల తరువాతే..
స్పాట్
కాల క్రమంలో అంటే బిలియన్ ల సంవత్సరాల తరువాత మన పాల పుంత ఉన్న గెలాక్సీ తన దగ్గర్లో ఉన్న మరో గెలక్సీ తో ఢీకొంటది. అలా గ్రహాలు, నక్షత్రాల పరిధి దాటి ఏకంగా గెలాక్సీలకు గెలాక్సీలే ఒకదానికొకటి ఢీకొంటయి. .. తరువాత ఈ అనంత విశ్వం మొత్తం గ్రావిటీ శక్తితో నిండిపోతది. కొన్ని కోట్ల నక్షత్రాలు, సంలీనం విలీనం అవుతుంటయి. కిరణాలు, పదార్దం అవిరళంగా సంచరిస్తయి. ఈ క్రమంలో విశ్వం పుట్టుక దశలే తిరిగి ఏర్పడుతయి. అంటే మళ్లీ మరో బిగ్ బ్యాంగ్ తప్పదన్నమాట.
స్పాట్
ఈ అనంత విశ్వం నిండా శక్తి కేంద్రాలు నిండి ఉంటయి. దీన్నే డార్క్‌ ఎనర్జీ అంటరు. శూన్యంలో సమాంతర ప్రాంతం మొత్తం ఈ శక్తి నిండి ఉంటది. 13.5 మిలియన్ సంవత్సరాల వరకు జరిగిన పరిణామం బిగ్ బ్యాంగ్ తో మొదలయి. బిగ్ బ్యాంగ్ తో మళ్లీ పునరావృతం అవుతది.
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు.. మరిన్ని సైంటిఫిక్ అప్‌డేట్స్ తో మళ్లీ మీ ముందుంటాం దిసీజ్ యువర్స్ శోభన్ సైనింగ్ ఆఫ్.
బ్రేక్ లు

ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ 42

ఎ.జనార్ధన్
ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలు విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
యాంకర్ 1
ఈ విశాల విశ్వం కథేంటి.. ఈ భూమి ఎప్పటిది.. ఎవరు సృష్టించిన్రు.. ఈ భూమి పై జీవం ఎలా పుట్టింది.. ఇవన్నీ ఇప్పటికీ ఎడతెగని ప్రశ్నలు.. ఎప్పటికైనా ఈ చిక్కుముళ్లు విడిపోతాయనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే విశ్వాన్ని సర్వస్వం ఒడగడుతున్న శాస్ర్తవేత్తలకు రోజు రోజు కూ ప్రశ్నల సంఖ్య పెరుగుతుందే తప్ప తరగడం లేదు. అంతేకాదు ఇప్పటి వరకు తాము కనుగొన్న చాలా సిద్దాంతాలు శుద్ద తప్పనే విషయం తెలిసి నిరాశ పడే వారు కూడా లేక పోలేదు. వాస్తవానికి ఈ విశ్వం ఎలా ఏర్పడింది. దీని వైశాల్యం ఎంత.. ఈ అఖండ విశ్వంలో మనమెంత.. ఈ ప్రశ్నలకు ఖగోళ మేథావి స్టీఫెన్ హాకింగ్ ఎంత ఆసక్తి కర సమాధానాలిచ్చిన్రు. ఒక్కసారి హాకింగ్ ఏమంటున్నడో చూద్దాం..
స్పాట్
వాయిస్
స్టీఫెన్ హాకింగ్ చెప్పిన విశ్వరహస్యం ఇది. నిజంగా ఎవరూ ఊహించరు.
నేను స్టీఫెన్ హాకింగ్.. కుర్చీలోంచి కదలలేకున్నా విశ్వరహస్యాలన్నీ ఛేదించే ప్రయత్నం చేశాను. మన భూమి, మన సౌర కుటుంబమే కాదు.. విశ్వం మొత్తం ఎలా పుట్టిందో తెలిపే ప్రయత్నం చేస్తాను..ఈ స్టోరీలో విశ్వానికి ముగింపు ఎలా ఉండబోతోందో కూడా చెబు తాను..
స్పాట్
ఇది స్టీఫెన్ హాకింగ్ కాలం కథ.. విశ్వం కథ..భవిష్యత్ కథ.. ఒక్కసారి కాలాన్ని వెనక్కు తిప్పుతూ వెనక్కు వెళదాం.. ఈ సృష్టి ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితులను చూద్దాం.
స్పాట్
స్టీఫెన్ హాకింగ్ ఈ విశ్వం గురించి చాలా ఏండ్లు పరిశోధించిండు.. ఎన్ని సంవత్సరాలైనా ఈ అంశం బోరనిపించలేదు.. రోజు రోజు కూ ఉత్సాహం పెరుగుతోంది.. ఇప్పుడు మనం చూస్తున్నది హాకింగ్ ఊహించిన అనంత విశ్వం.. ఇక్కడ మనకు చిన్న చిన్న బిందువుల్లా, తుంపరల్లా కనిపించే వన్నీ పెద్ద పెద్ద పెద్ద పాలపుంతలు. ఒక్కో పాల పుంతలో నాలుగు వందల బిలియన్ ల ఒంటరి నక్షత్రాలుంటయి. ఈ అనంత విశ్వాన్ని అంచనా వేయగలగడం కేవలం సూపర్ కంప్యూటర్ ద్వారానే సాధ్యం. ఇప్పుడు మనం చూస్తున్న అనంత విశ్వం నుంచి భూమికి వెళ్లాలంటే కోటాను కోట్ల కాంతి సంత్సరాలు ప్రయాణించాలి. ఈ గెలాక్సీ కాంపౌండ్ నుంచి ఎన్నో పాలపుంతలు దాటాలి.. పాల పుంతలు దాటి సౌరకుటుంబం ఉన్న పాల పుంతను చేరాలి. సౌరకుటుంబంలో ఒక్కో గ్రహాన్ని, గ్రహ శకలాలను దాటుతూ భూమిని చేరాలి.
స్పాట్
యాంకర్ 2
విశ్వదర్శనం కావాలంటే అంత సులువు కాదు.. ఎందుకంటే ఇప్పుడు మనం టి.వి లలో కంప్యూటర్ లలో చూసే గెలాక్సీ నమూనాలు చూడ్డానికి చిన్న బొమ్మల్లా ఉన్నయిగని.. ఇలా కనిపించే ఏ రెండు నక్షత్రాల మధ్య ప్రయాణించాలన్నా ఒక జీవిత కాలం సరిపోదు.
స్పాట్
ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా కనిపిస్తున్న ఈ ప్రకృతి ఒకప్పుడు నిత్యం ప్రళయాగ్ని కక్కుతూ ఉండేది.
స్పాట్
సరిగ్గా..14 బిలియన్ సంవత్సరాలకు ముందు.. ఇప్పుడు మనం చూస్తున్న.. ఈ గ్రహాలు కానీ.. ఆస్టరాయిడ్ లు కానీ..నక్షత్రాలు కానీ.. పాలపుంతలు కానీ… గెలక్సీలు కానీ..ఇప్పుడు మనం చూస్తున్న ఈ అనంత విశ్వం ఏవీ లేవు. కేవలం సాంద్రతా యుతమైన చిమ్మ చీకటి ఉంది..
హాకింగ్ వాయిస్
మనం ఈ చిన్న గ్రహం పై హాయిగా బతకడానికి.. మనిషి ప్రత్యేక మైన మనిషిగా బతకడానికి ఎన్నో లక్షల సంవత్సరాల మార్పులు జరిగినయి.
వాయిస్
ఈ గెలాక్సీలో ఉన్న చిన్న చిన్న రేణువుల్లాంటి వన్నీ కోటాను కోట్ల నక్షత్రాల సమూహాలు. ఇటువంటి కోటాను కోట్ల పాల పుంతలు కలిస్తే అనంత విశ్వం ఉంటది. ఈ అనంత విశ్వానికి ఆది అంతం ఇంకా కనుక్కోలేదు.
స్పాట్
యాంకర్ 3
కెప్లర్ టెలీస్కోప్ లో ఈ విశ్వాన్ని పరిశీలిస్తే.. ఈ అనంత విశ్వం కొంత నీలి రంగులో మరికొంత ఎర్ర రంగులో కనిపిస్తది. కారణం చాలా రోజులు తెలుసుకోలేక పోయిన్రు శాస్ర్తవేత్తలు. కానీ ఓ చిన్న కిటుకుతో అసలు విషయం తెలుసుకోగలిగిన్రు. ఇంతకీ ఏంటా కిటుకు..
స్పాట్
వాయిస్ ఇదిగో ఇక్కడ వేగంగా.. రయ్యి మని శబ్దం చేస్తూ వెళుతున్న కారును చూడండి.
ఒక్కసారి కారు మనకు దూరం గా వెళిపోతుంటే వచ్చే శబ్దాన్ని పరిశీలిద్దాం.. (స్పాట్) ఇప్పుడు మన దగ్గరగా వచ్చి దూరంగా వెళ్లిపోయే శబ్దాన్ని వినండి.. మళ్లీ ఇంజన్ స్పీడ్ మరింత పెంచినపుడు శబ్దం ఎలా ఉన్నది.
స్పాట్
ఇదే కారు మనకు దగ్గరగా వస్తున్నపుడు లేత నీలి రంగులో కనిపిస్తది. తిరిగి అంతే వేగంతో మన నుంచి దూరంగా వెళ్తుంటే లేత ఎరుపులో కనిపిస్తది. ఈ ప్రభావాన్ని డాప్లర్ ప్రభావం అంటరు. సో .. డాప్లర్ ప్రభావం మూలంగానే గెలాక్సీ లో నీలి రంగు, ఎరుపు రంగు కనిపిస్తది. ఇందులో కొన్న గ్రమాలు వేగంగా వస్తుంటయి. మరికొన్ని వేగంగా వెళుతుంటయి. అందుకే గెలాక్సీ నీలి, ఎరుపుల దొంతలా కనిపిస్తది.
స్పాట్
ఇంతకీ ఈ గెలాక్సీ జననం ఎప్పుడు .. ఈ అనంత విశ్వం వయసెంత.. ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు దొరికిన జవాబు ఒకటే.. 13 మిలియన్ల సంవత్సరాలకు ముందు చిమ్మ చీకటిలో అత్యధిక సాంత్రతతో ఉన్న ఈ శూన్యంలో రెండు దైవాణువులు ఢీ కొనడం వల్ల ఒక మహా విస్పోటనం జరిగింది. ఆ విస్పోటనమే చీకట్లో వెలుగులు నింపింది.
స్పాట్
చీకట్లో జరిగిన ఆ మహా విస్పోటనం క్రమ క్రమంగా కోటాను కోట్ల కాంతి సంవత్సరాల వేగంతో దూరంగా విస్తరించ సాగింది.
స్పాట్
యాంకర్ 4
ఈ విశ్వ విస్తరణ ఎంత కాలం జరిగింది. ఎలా జరిగింది.. ఒక చెంచాడు ద్రవ్యరాశి ఒక గ్రహంగా రూపాంతరం చెందడం ఎలా సాద్యమయింది. రేణువులన్నీ పిల్ల గెలాక్సీలుగా మరడం ఎలా సాధ్యమయింది. తరచి చూస్తే శాస్ర్తవేత్తలకు లోతైన అంశాలు చాలా వెలుగులోకి వచ్చినయి.
స్పాట్
బారయుత వాయువులతో.. మిరిమిట్లు గొలిపే అత్యుష్ణ వెలుగులతో కనిపించే ఈ మహా సృష్టి వృత్తాకారంలో విస్తరిస్తూ వెళుతుంది.ఈ మహావిస్పోటనం చీకట్లో కాంతి కిరణాలను విస్తరిస్తూ కాంతి వేగంతో విస్తరించింది. బయటనుంచి ఇదో అగ్నిగోళంలా ఉంది. లోపలి బాగంలో రేణు పరిణామంలో టైనీ గెలాక్సీలు వేగంగా వ్యాకోచించడం మొదలు పెడతయి. ఇక్కడ కిరణాల మాదిరిగా కనపడేవన్నీ కోటాను కోట్ల గెలాక్సీల సముదాయం. ఈ గెలాక్సీలన్నీ ధూళి కణాల్లా వేగంగా.. ప్రొజెక్టర్ లో ఫోకస్ లా కాంతి వేగంతో శూన్యం నిండా విస్తరించింది.
స్పాట్
ప్రళయ గర్జనతో విస్తరించే ఈ ద్రవ్యరాశి వాయుధూళి రూపంలో ఉంటది. ఒక్క అణువే ఒక పాల పుంత తో సమానం అంటే దాని ద్రవ్యరాశి ఎంత ఉంటదో అర్ధం చేసుకోవచ్చు. ఇంత ద్రవ్యరాశి మొత్తం కేవలం వాయురూపంలో ఉండటం వల్ల వేగంగా విస్తరించగలిగింది. సూక్ష్మరూపంలో ఉన్న ఈ అనంత విశ్యం 13 మిలియన్ ల సంవత్సరాల నుంచి నేటికీ విస్తరిస్తనే ఉంది. భార సాంద్రత గల ఈ అనంత విశ్వ పయనం ఓ మహత్తర కార్యానికి తొలిఅడుగు.
స్పాట్
వాయుధూళిగా ఉన్న ఈ విశ్వ పదార్ధం క్రమేపీ ద్రవరూపంలో.. ఆ తరువాత మెల్లగా చల్లబడి ఘనరూపంలోకి రూపాంతరం చెందింది. ఈ విశ్వావిర్భావ దశలోనే కాస్మిక్‌ ఎనర్జీ జెనరేట్ అయింది. ఇందులో కొంత సాలిడ్ మేటర్ గా రూపుదాలిస్తే.. మిగతాది యాంటి మేటర్ గా రూపాంతరం చెందింది. సవ్య అపసవ్య దిశలో భ్రమణం చెందే బాలగ్రహాలు, పురిటి నక్షత్రాలు ఒకదానినొకటి ఢీకొని గ్రహాలు ఉపగ్రహాలుగా పిల్ల విశ్వాలుగా విచ్చిత్తి చెందినయి. ఈ మహా తాడనంలో వెలువడిన రేడియేషన్ కోటాను కోట్ల ఆటంబాంబ్‌ లతో సమానం.
స్పాట్
యాంకర్ 5
బిగ్ బ్యాంగ్ మహా విస్పోటనం లో ఏర్పడిన ప్రతి గ్రహం ఇప్పటికీ ఉందా..నక్షత్రాలన్నీ అలాగే ఉన్నయా.. ఒకవేళ అలాగే ఉంటే అవి ఎందుకు దూరంగా విస్తరించ బడ్డయి. కారణం అన్వేషించిన్రు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఈ మహాతాడనంలో కొన్ని నక్షత్రాలు అప్పటికప్పుడు అదృశ్యమైపోయినయి. బిలియన్ రేణువులు గ్రహాలుగా వ్యాకోచించినయి. ఈ తాడనంలో మిగిలిన శేష పదార్ధాలే నేటి విశ్వం. ఈ అనంత విశ్వం కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం విస్తరించింది. ఇంత విస్తీర్ణంలో ధూళి మేఘం తో పాటు పొగ ఆవరించింది. ఆ పొగలోనే వివిధ రకాల మూలకాలు పుట్టుకొచ్చినయి.
స్పాట్
పది నిముషాల్లో కొటాను కోట్ల కాంతి సంవత్సరాల దూరం ప్రయాణించిన ఈ విశ్వం లోపొగ అంతర్ధానమయింది. ఇలా 330 సంవత్సరాలు ఇంతే వేగంతో శూన్యంలో నక్షత్రాలు గ్రహాలు విస్తరించినయి. ఆ తరువాత వేగం క్రమంగా తగ్గుతూ పోయింది. కానీ అప్పుడు మొదలైన భ్రమణమే నేటి గ్రహాల భ్రమణం, పరిభ్రమణం.
స్పాట్
విశ్వావిర్భావం కొన్ని విలియన్ ల సంవత్సరాలు పట్టింది. ఇందులో వందల బిలియన్ ల గెలాక్సీలు తయారయినయి. మొదట్లో గెలాక్సీల మధ్య తాడనం జరిగేది. తరువాత అది గ్రహాలకు పరిమిత మయింది. ఈ గ్రహాలు కూడా ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటయి. కారణం గురుత్వాకర్షణ శక్తి.
స్పాట్
న్యూటన్ అనే ఖగోళ శాస్ర్తవేత్త ఒక యాపిల్ చెట్టు కింద కూర్చుని ఆకాశం వైపు చూస్తూ సుదీర్ఘంగా ఆలోచిస్తున్నడు. సరిగ్గా అప్పుడే చెట్టు పై నుంచి ఆపిల్ కాయ తెగి నేల పై పడింది. రాలిన ఆ యాపిల్ పండు నేల పైనే ఎందుకు పడాలి. ఆకాశంలోకి ఎందుకు వెళ్లకూడదు అనే ప్రశ్న ఉద్భవించింది న్యూటన్ మనస్సులో.. ఆ ప్రశ్నే గురత్వాకర్షణ శక్తి సూత్రానికి పురుడు పోసింది.
స్పాట్
విశ్వావిర్భావంలో గ్రావిటీ పవర్ చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. బిగ్ బ్యాంగ్ తరువాత రెండు మిలియన్ ల సంవత్సరాల వరకు విశ్వం ఒక రూపంలోకి రాలేదు. 1982లో హాకిన్స్ తో బాటు మూడొందల మంది శాస్ర్తవేత్తలు చేసిన ప్రయోగంలో విశ్వం అమరిక ఎలా జరిగిందో తెలుసుకున్నరు. దీనికి వీరు ఎంపిక చేసుకున్నది..పల్లపు స్థలం, బాల్ బేరింగ్ లు
స్పాట్
ఈ ఐరన్ బాల్స్ పై ఏ ప్రభావం లేనపుడు ఇవి ఒక పద్దతి ప్రకారం సమాన దూరంలో అమరి ఉన్నయి. సమ దూరంలో ఉన్న గ్రహాల నుంచి కొన్ని జీవిత కాలం పూర్తయి అదృశ్యమయినయి. దీంతో వాటి ప్రభావం ఇతర గ్రహాల పై పడింది. ఒక వైపు గురుత్వాకర్షణ శక్తి తగ్గడంతో ఆ గ్రహాలు మరో గ్రహ ప్రభావానికి లోనయినయి. ఇలా గ్రహాలన్నీ ఎక్కువ విశ్వ గురుత్వాకర్షణ శక్తి వైపుకు మళ్లడం మొదలు పెట్టినయి. అప్పుడు మొదలయిన ఆ విశ్వవిస్తరణ నేటికీ కొనసాగుతనేఉంది.
స్పాట్
ఈ విశ్వావిర్భావానికి ముందు.. అంటే 13.5 మిలియన్ సంవత్సరాలకు ముందు ఈ విశాల విశ్వం నిండా హైడ్రోజన్ గ్యాస్ నిండి ఉంది. అంటే ఒక రకంగా ప్రోటాన్, ఎలక్రాన్ ల మేఘాలతో నిండి ఉందని చెప్పొచ్చు. హైడ్రోజన్ చాలా తేలికైన వాయువు.. పవర్‌ జెనరేట్ చేయగల వాయువు.. 10మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయగల వాయువు. ఈ ఉష్ణోగ్రతే నక్షత్రాలను కాంతి వంతగా చేయగలుగుతుంది. హైడ్రోజన్ పరమాణువుల సంలీనం ఉష్ణాన్ని వెలువరుస్తది. ఈ హైడ్రోజన్ సంలీనం హీలియం వాయువుగా రూపాంతరం చెందుతది. నక్షత్రాల కోర్ పార్ట్లో మొత్తం హీలియం అణువులతో నిండి ఉంది. ఈ శక్తి కొన్ని కోట్ల అణుబాంబుల శక్తి తో సమానం. విశ్వావిర్భావ సమయంలో ఇటువంటి సంలీనాలు మిలియన్ ల కొద్దీ జరిగినయి.
స్పాట్
విశ్వంలో నిండిఉన్న హైడ్రోజన్ అణువుల తాడనం వల్ల ఎన్నో నక్షత్రాలు కొత్తగా ఏర్పడ్డయి. హైడ్రోజన్ ఇందనంతోనే ఇవన్నీ నేటికీ బతికి ఉన్నయి. ఈ హైడ్రోజన్ వాయువు అయాన్ లుగారూపాంతరం చెంది.. వివిధ రకాల మూలకాలుగా ఏర్పడ్డయి. ఈ మూలకాలే కార్బన్, నైట్రోజన్, సిలికాన్ వంటి 108 మూలకాలు మరియు వాటి సమ్మిళిత అయాన్లు గా ఏర్పడ్డయి. ఇవే నేటి మన భూమి పై జీవరాశి వుట్టుకకు కారణం అయినయి.
స్పాట్
యాంకర్ 6
విశ్వావిర్భావంలో నక్షత్రాలే పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటి ఈ పరిశోధనలకు మూలం నక్షత్రాలే.. 13మిలియన్ సంవత్సరాల క్రితం మొదలయిన విశ్వాగ్ని నేటికీ రగుల్తనే ఉంది. దాన్ని బట్టే నక్షత్రం వయసు.. విశ్వావిర్భావ కాలాన్ని అంచనా వేయగలుగుతున్నరు. ఈ లెక్కలు ఎలా సాధ్యమయినయి.
స్పాట్
విశ్వావిర్భావంలో నక్షత్రం పాత్ర ఏమిటి..అసలు నక్షత్రంలో ఏముంది. ఒక్కసారి నక్షత్రాన్ని వర్టికల్ గా విచ్చేదన చేసి చూస్తే దీని మర్మమేంటో తెలుస్తది. ఈ నక్షత్ర మధ్యబాగంలో హైడ్రోజన్ అణువులు సంలీనమై శక్తి విడుదలవుతది. ఈ చర్య శృంకల చర్యగా జరిగి అయాన్లు, శక్తి కేంద్రాలు ఏర్పడుతయి. ఈ శక్తి కేంద్రాలు అయస్కాంత క్షేత్రాలుగా రూపాంతరం చెందుతయి. నక్షత్ర కేంద్రకం నుంచి ఉపరితలం వరకు ఇదే చర్య జరుగుతది. ఈ చర్యలలో హైడ్రోజన్ పూర్తిగా అయిపోయినపుడు నక్షత్ర జీవిత కాలం పూర్తయినట్టు. నక్షత్రంలో హైడ్రోజన్ ఇందనం పూర్తిగా అయిపోగానే పెద్ద శబ్దంతో పేలిపోతది. ఆ శకలాలు శూన్యంలోకి విస్తరించబడుతయి. ఈ పరికల్పననే సూపర్నోవా అంటరు. ఈ పరిస్థితిలో నక్షత్రాన్ని మృత నక్షత్రం అంటరు.
స్పాట్
ఈ మైక్రో సెకన్ లో కొన్ని కోట్ల ఉద్ఘారాలు విడుదలవుతయి. దీంతో పాటు ఒక బలమైన షాక్ శూన్యంలోకి విడుదలవుతది. అంతే కాదు పేలుళ్లలో విడుదలయిన పదార్ధమంతా శూన్యంలోకి విస్తరించ బడుతయి.
స్పాట్
ఈ మృతనక్షత్రంలో నుంచి మెటల్ ఎర్రగా శూన్యం నిండా విస్తరిస్తది. బిగ్ బ్యాంగ్ జరిగిన 300మిలియన్ సంవత్సరాల తరువాత ఇప్పుడు చూస్తున్న మన సౌరకుటుంబం ఉండే పాలపుంత ఖచ్ఛితమైన రూపు సంతరించుకుంది.ఈ పాలపుంత సుమారు 6వేల బిలియన్ మైళ్ల వ్యాసాన్ని కలిగి ఉంటది. ఇందులో 2వందల బిలియన్ ల నక్షత్రాలుంటయని అంచనా. ఈ నక్షత్ర సమూహాలన్నీ కేవలం గురుత్వాకర్షణ శక్తితో ఏర్పడ్డయి. గురుత్వాకర్షణది శక్తి సృష్టి నిర్మాణంలో కీలక పాత్ర .
స్పాట్
ఈ తెల్లని పొగల చారల మధ్య నల్లని ఆకారాన్ని బ్లాక్ హోల్ అని పిలుస్తరు. ఈ బ్లాక్ హోల్ సిద్దాంతాన్ని ఆవిష్కరించడానికి హాకింగ్ కు చాలా కాలం పట్టింది.
స్పాట్
ఒక మృత నక్షత్రం బ్లాక్ హోల్‌ గా మారినంక జరిగే మార్పులు గెలాక్సీలో పెను భీభత్సాన్ని సృష్టిస్తయి. నక్షత్రం మధ్యలో ఉండే గ్రావిటేషన్ ఫోర్స్ ఓ మెగా అట్రాక్టర్. దీనికి ఎంత బలమైన ఆకర్షణ శక్తి ఉందంటే మృత నక్షత్రం తనకున్న గురుత్వాకర్షణ శక్తితో తన చుట్టూ ఉన్న గ్రహాలన్నిటినీ మింగేయగలదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల నక్షత్రాలను మింగేసినా దాని ఆకలి తీరదు. ఎంత వేగంగా అయితే విస్పోటనం చెందిందో అంతకంగే వేగంగా నక్షత్రాలను, గ్రహాలను దాని పరిధి క్రమేపీ విస్తరించుకుంటూ వెళ్తది. మృత నక్షత్రాలు సాధారణ సమన్వయంలో, కాల రంధ్రం యొక్క విస్తారము మొత్తము ఒక్క చోట, అంటే ఒక బిందువు కాని,ఒక వలయము కాని, ఒక కాంతిరేఖ కాని లేక ఒక గోళమునందు కాని కేంద్రీకృతమై ఉండవచ్చు. దాని యొక్క ఖచ్చితమైన వివరాలు ప్రస్తుత పరిస్థితులలో అర్ధమైతలేవు. ఈ ఒక చోటునుండి గుండ్రముగా ఉండే సరిహద్దుని ఇవెంట్ హారిజాన్ అంటరు. ఈ ఇవెంట్ హారిజాన్ అనునది మరి తిరిగి రానటువంటి బిందువునుసూచిస్తుంది.ఈ సరిహద్దు దాటితే స్థూల ద్రవ్యము మరియు అణుధార్మికతకూడా తప్పనిసరిగా ఈ మొదలు లోపలికే పడిపోతయి. మధ్యభాగామునందుండే మూలము నుండి ఇవెంట్ హారిజాన్ వరకు ఉండే దూరము కాల రంధ్రం యొక్క పరిమాణము.
స్పాట్
సూర్యుని పరిమాణానికి సమానమైన కొలత కలిగిన కాల రంధ్రం యొక్క వ్యాసార్ధము షుమారు మూడు కిలోమీటర్లుంటుంది. దీనికి మించిన దూరంలో ఉన్నప్పుడు,మిగిలిన అదే పరిమాణంగల పదార్ధాలలాగానే,కాల రంధ్రం కూడా సూర్యుని మాదిరి అంతే ఆకర్షణ కలిగి ఉంటుంది. అంటే సూర్యుని కనక అదే పరిమాణము కలిగిన కాల రంధ్రంతో మార్పిడి చేస్తే,గ్రహాల గ్రహమార్గాములో మార్పు లేకుండా ఉంటుంది.
స్పాట్
కాల రంధ్రాల కొలతల బట్టి వాటిని పలురకాలుగా విభజించటమైనది. నక్షత్రముగురుత్వాకర్షణ ముడుగువలన కనక కాల రంధ్రం సృష్టించబడి ఉన్నట్లయితే అప్పుడు వాటినిస్టేల్లార్ కాల రంధ్రాలు అంటారు. నక్షత్ర వీధుల మధ్య ఉండేటువంటి కాల రంధ్రాల యొక్క పరిమాణము కొన్ని బిల్లియేన్ల సూర్య పరిమాణములకు సమానముగా ఉంటుంది.వీటిని సూపర్ మాసివ్ కాల రంధ్రాలు అంటారు. ఈ రెండు శ్రేణుల మధ్య, అందరూ ప్రాక్కల్పితముగా నమ్మేది ఇంటర్మీడియేట్ కాల రంధ్రాలు కొన్నివేల సూర్య పరిమాణములకు సమానమైనటువంటివి ఉంటాయని. జగత్తు సృష్టించబడినప్పటి చరిత్ర ప్రాక్కల్పన ప్రకారము బిగ్ బ్యాంగ్ సమయములో తయారయిన అతి తక్కువ పరిమాణంకల కాల రంధ్రాల ఉనికి కూడా ఉండవచ్చు.వీటిని ప్రైమార్డియేల్ కాల రంధ్రంలుగా అన్వయించవచ్చు. వాటియొక్క ఉనికి ప్రస్తుతము ఖచ్చితముగా నిర్దారించలేము.
స్పాట్
ఈ బ్లాక్‌ హోల్‌ వల్ల భూమి వచ్చే ముప్పేంటి.. సూర్యుడు కూడా మామూలు నక్షత్రాల్లా బ్లాక్‌ హోల్‌ గా మారబోతున్నాడా . ఒక వేళ అలా మారితే ఏం జరగబోతోంది. ఈ సౌర మండలం మొత్తాన్ని సూర్యుడే మింగేయబోతున్నాడా.. ఈ ప్రశ్నలన్నిటికీ వచ్చే ఎపిసోడ్ లో సమాధానం వెతుకుదాం.
యాంకర్ 7
ఇంత పెద్ద గెలక్సీలో.. ఇప్పుడు మనం ఊహిస్తున్న మార్పులన్నీ నిజంగా జరిగినయేనా.. వీటిని మనం నమ్మొచ్చా.. ఇది కేవలం ఊహా కల్సిత సిద్దాంతమేనా..ఈ అనుమానం మనకే కాదు.. శాస్ర్తవేత్తలకూ వచ్చింది. ఒక్కోసారి తామూహించిన విషయాలు నిజం కాదేమోనన్న అనుమానం కూడా వాళ్ల మెదళ్లను తొలిచేస్తది. కారణం.. ఇదిగో ఈ చిన్న విషయం.
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు.. మరిన్ని లేటెస్ట్ సైంటిఫిక్ అప్ డేట్స్ వచ్చేవారం తెలుసుకుందా.. అంటిల్ దెన్ బైబై దిసీజ్ శోభన్ సైనింగ్ ఆఫ్.
బ్రేక్ లు.