8, సెప్టెంబర్ 2010, బుధవారం

సైన్స్ ఎపిసోడ్ 12

ఎ.జనార్ధన్
ఇంట్రో యాంకర్
సకల చరాచర జగత్తులో దాగిన సూక్ష్మరహస్యాలను, విశ్వాంతరాళంలో నిక్షిప్తమైన విజ్ఞాన బాండాగారాన్ని మీ ముంగిలో దించే “ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
రిపీట్ యాంకర్.
బిగ్ బ్యాంగ్ ద్వారా ఏర్పడ్డ ఈ సకల చరాచర జగత్తులో… ఒక్క భూమి పైనే జీవరాశి మనుగడ సాధ్యమనేది శాస్ర్తవేత్తల అంచనా..మరి ఈ భూమి పైనే మనుగడ సాధ్యమెందుకయింది. అసలీ భూమి పై జీవరాశి ఎలా ఉద్భవించిందో తెలుసుకునే ముందు గతవారం చూసిన విశేషాలు ఒక్కసారి చూద్దాం.
యాంకర్ 1
ఈ సౌర కుటుంబంలో గ్రహగతులను గూర్చి అధ్యయనం చేసి భూమి సూర్యడి చుట్టూ పరిభ్రమిస్తున్న నిజాన్ని కనుగొన్నారు శాస్ర్తవేత్తలు..అంతే ఉత్సాహంతో అసలీ భూమి పై జీవరాశి ఎలా ఉద్భవించింది..జీవరాశి మనుగడకు సాధ్యమయ్యే అంశాలేమున్నయి అనే దిశగా కూడా ప్రయత్నాలు ప్రారంభించిండ్రు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఈ భూమి పై జీవం ఎలా ఉద్భవించింది అనే ప్రశ్నకు ఇప్పటి వరకు శాస్త్రవేత్తల వద్ద సరైన సమాధానం లేదు.ఈ భూమి పై విస్తరించిన సకల జీవరాశి ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవాలంటే ముందు ఈ జీవరాశి మనుగడకు ఉపయోగ పడే అంశాలేంటో పరిశోధించాలి. గాలి, నీరు , నేల, నిప్పు ఇవే ప్రతి జీవి మనుగడకు జీవనాధారమైనవి. ఈ మూడింటి సంయోగం వల్లనే జీవం ఉద్భవించిందనేది శాస్ర్తవేత్తల అంచనా.. కానీ భగ భగ మండే ఈ భూగ్రహం పైకి నీరు ఎలా వచ్చి చేరింది. ఈ నీరు భూమిని చల్లబరిచి జీవ కోటి ఆవిర్భావానికి ఎలా దారితీసింది. ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో పడ్డరు శాస్ర్తవేత్తలు. ఎందరో శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడి చేసిన పరిశోధనలో నీటికి జన్మనిచ్చింది గాలే నని తేల్చారు పరిశోధకులు. మంట మండటానికి కారణం కూడా గాలేనన్న పచ్చి నిజాన్ని పరిశోధించి తేల్చారు. ( ఈ ఒక్కలైన్ స్లోగా చదవాలి).. అవును ఈ సకల చరాచర చర జగత్తుకు మూలాధారం మన కంటికి కనిపించని వాయువే..
స్పాట్
నిర్మలంగా ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ నగరాన్ని చూశారా.. ఎత్తైన గాజు భవనాలు. రంగురంగుల విద్యద్ధీపాలతో అలంకరించ బడిన ఆకాశహర్య్మాలు. విహంగ వీక్షణం చేస్తే కనిపించే ఆ ఆధునిక నాగరికత ఆనవాలు మొదలయింది వాయువేగంతోనే..అంతే కాదు వాయువు నిర్మితమైనవే.. ఈ నగరాన్నమోత్తం రకరకాల వాయువులు ఆవరించి ఉన్నయి. నగ్నంగా ఉన్న మానవుడు అగ్గిపెట్టెల్లాంటి గృహాలకు మారే వరకు ఎన్నో మార్పులు. అన్ని మార్పులకు కారణం టెక్నాలజే.. ఈ టెక్నాలజిని నడిపించేది రకరకాల ఎయిర్ పార్టికల్స్..
స్పాట్
మన చుట్టూ మనల్ని తాకి పోయే గాలిలో కొన్ని వేల రకాల ఎలిమెంట్స్ ఉన్నయి. గాలి అంటే మన కంటికి కనిపించని ఒక అదృశ్యశక్తి అని మాత్రమే మనకు తెలుసు. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే..అసలు విషయం అవగతం అవుతది. ఇక్కడ కనిపిస్తున్న మెర్క్యురి, కార్భన్ అణువులను లోతుగా అధ్యయనం చేస్తే అణునిర్మాణం యొక్క అసలు రూపం తెలిసింది. ఇక్కడ అనేక రంగులల్లో కనిపిస్తున్న అణుజాలం మనకు కొత్త పాఠాలను నేర్పుతుంది. ఇక్కడ కనిపించే పరమాణువులు ఒకదానికి ఒకటి బంధాలను ఏర్పరచుకొని కొత్త అణువులు, కొత్త పదార్ధాల తయారీకి దారి చూపుతది. పరమాణువుల మధ్య బంధం ఏర్పడాలంటే కనీసం రెండు నుంచి మూడు పరమాణువులు అవసరం. వీటి మధ్యలో ఉండే కార్భన్ పరమాణువు హైడ్రోజన్ బందాలతో కొత్త పదార్దాలను ఏర్పరుస్తుంది. ఈ హైడ్రోజన్ బంధాల సంఖ్యను బట్టి ఏర్పడే పదార్ధాల ధర్మం ఉంటుంది. ఈ కర్భన పదార్ధాల వల్లనే ఈ ప్రకృతిలో అణువణువు ఏర్పడిందనే విషయాన్ని కనిపెట్టారు. అద్దాల మేడల్లో ఉన్న గ్లాసులన్నీ కర్భన పదార్దంతో తయారయివే..అంతెందుకు జీవద్రవ్యం, ఇంధనం, పదార్ధాలు అన్నీ కార్భన్ నిర్మితాలే..
జీవ నిర్మాణ రహస్యద్వారాల తాళ చెవి దొరికింది..
స్పాట్
ఈ ప్రకృతి పునాదుల మాటున దాగిన జీవరహస్యాలు ఒక్కోక్కటే వెలుగు చూస్తున్నయి. రసాయన ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు వందలాది ప్రయోగాలు చేపడుతున్నరు. రసాయన శాస్ర్త పరిశోధనల్లో సాధించిన ప్రగతి జీవావిర్భావ సూత్రాలను తేలికగా ఛేదించే అవకాశం కల్పించింది. వేలాది సంవత్సరాలకు ముందే గ్రీకులు ఈ ప్రకృతి గాలి, నీరు, నేలల సంయోగమని తేల్చి చెప్పారు. కానీ దీనికి శాస్రీయ రుజువులు ఏమీ లేవు. ఆధునిక శాస్త్రవేత్తలు ఇంతకాలం చేసిన పరిశోధనలో తేల్చిన నిజం కూడా ఇదే… కానీ మోడ్రన్ సైంటిస్టులు జీవోద్భవ ప్రక్రియను కనుగొనే పనిలో ఎన్నో కొత్త విషయాలు వెలుగు చూసినయి. అందులో అసలు జీవ మనుగడకు కారణ వాయువేంటో కనుగొన్నరు శాస్ర్తవేత్తలు.
స్పాట్
బ్రేక్ యాంకర్
నింగి, నేల, ఆకాశం, వాయువు, అగ్ని..వీటిలో అన్నీ సహజంగా లభించేవే..ఒక్క నిప్పు తప్ప. ఈ నిప్పును పుట్టిచ్చే రసాయనాలు కూడా ఉన్నయంటే పెద్ద ఆశ్చర్య పడాల్సింది లేదేమో కానీ.. మానవ మూత్రం నుంచి మంటలు రేపొచ్చనే విషయం రహస్యం మీకు తెలుసా .. ఈ విషయం తెలియాలంటే చిన్న బ్రేక్ అయిపోయే వరకు వెయిట్ చేయాల్సిందే..
యాంకర్ 2
మనం గ్యాస్ స్టౌవ్ ను వెలిగించడానికి లైటర్ ను వాడుతం. ఈ లైటర్ లకంటే ముందు అగ్గిపెట్టెలే దిక్కు.ఈ అగ్గి పెట్టె తయారీలో ఏ మూలకం వాడుతరు. ఈ రసాయనం కనుగొనడానికి దారితీసిన పరిస్థితులేంటి అన్న విషయం తెలుసుకుంటే చాలా అశ్చర్యకరంగా ఉంటది.
స్పాట్
ఎలిక్ బ్రెండ్..ప్రాచీన రసాయన పరిశోధకులు..ఈయన కనగొన్న విషయం అంత సామాన్యమైనది కాదు రసాయన శాస్త్ర పరిశోధనలో ఒక మైలు రాయి అని చెప్పొచ్చు. ఇదిగో ఇక్కడ కనిపించే పరికరాలన్నీ ఆయన ఉపయోగించినవే. ఈ శాస్ర్తవేత్తలంతా నిప్పు, నీరు, గాలి ఎలా ఆవిర్భవించాయో తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఎలిక్ బ్రెండ్ తాను చేసిన ప్రయోగంలో కూడా అచ్చం అటువంటి మూలకాన్నే కనుగొన్నడు.
స్పాట్
ఇక్కడ బర్నెస్ పై మరిగిస్తున్న ఈ రసాయన ద్రావణం ఓ కొత్త మూలకానికి చేసే పరిక్షలాంటిదే.. ఈ సైంటిస్ట్ చేతిలో ఉన్న శాంకవ కుప్పెలో ఉన్న అరలీటర్ యూరియల్ ద్రావణాన్ని బాగా మరిగించి… సుమారు 100గ్రాముల పరిమాణం వచ్చేవరకు చేస్తరు. ఈ ప్రక్రియలో యూరినల్ ద్రావణంలో ఉన్న ఇతర మలిన పదార్ధాలు, స్పటికాలు, లవణాలు కరిగిపోతయి. పూర్తిగా మరిగిన ఈ ఘాడ ద్రవణాన్ని స్టాండ్ కు బిగించిన ఒక పోడవాటి గాజుకుప్పెలో గాజు కడ్డీ సహాయంతో పోస్తరు. దీని కొసను మరొక కుప్పెలో అమరుస్తరు. ఇప్పడు మరలా యూరినల్ ఎక్స్ట్రాక్ట్ ను వేడిచేయగా..అది వేడి వాయువులను విడుదల చేస్తది. ఈ వేడి వాయువులు పొగలు కక్కుతూ ఒక గాజుకుప్పెలో భారంగా నిండిపోతది. పూర్తిగా తెల్లని వాయువుతో నిండిన ఈ గాజు కుప్పెలోకి ఒక రసాయన పదార్ధాన్ని వేయగా ఇదిగో ఇలా ఒక ఎక్స్ ప్లోజీవ్ లైట్ రిలీజ్ అవుతది. కళ్లు మిరిమిట్లు గొలిపే ఈ కాంతి ఎక్కడిది. అందునా నీటిలోంచి తీసిన ఓ కెమికల్ తెల్లని పొగలో వేయగానే ఇంత పెద్ద వెలుగు ఉద్భవించడం నిజంగా అద్భుతమే..ఈ అద్భుతానికి ఎలిక్ బ్రెండ్ పెట్టిన పేరు..కీవోవ్ డ్ లైట్ ఆఫ్ ఫాస్ఫరస్. అవును గాలిలో మండగల సామర్ధ్యం ఒక్క పాస్ఫరస్ కే ఉంది. గాలి, నీరు. నిప్పు, నేలల్లో నిప్పు పుట్టడానికి కారణమైన మూలకాన్ని కనుగొన్నరు శాస్త్రవేత్తలు. ఇప్పడు మన ఇళ్లలో మన వాడే అగ్గిపెట్టెలను తయారు చేసేది ఈ ఫాస్ఫరస్ ను ఉపయోగించే..
స్పాట్
ఈ ఆధునిక యుగంలో ప్రయోగాలు చేయడానికి మనకు కావలసిన పరికరాలు ఉన్నయి. మరింత సురక్షితంగా చేసేందుకు , గాజు పరికరాలు, స్టాండ్లు, సమకూర్చబడ్డయి. కానీ ఆ రోజుల్లో అన్ని ప్రయోగాలు మట్టి కుండలల్లో చేయడం తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే ప్రయోగాలకు కావలసిన వివిధ రూపాల పాత్రలు మట్టితో తయారు చేయడం ద్వారానే సాధ్యం. ఒక్కోసారి పరిశోధకులకు వారు ఎంచుకున్న పాత్రల సామర్ధ్యం సరిగా లేక వాంచిత ఫలితాలు రాక చాలా ఇబ్బంది పడ్డ శాస్త్రవేత్తలు ఉన్నరు. అంతేకాదు ప్రయోగాలు చేసే క్రమంలో జరిగే తప్పుల వల్ల ప్రాణాలు కోల్పోయింది కొదరయితే.. యాదృచ్ఛికంగా కొత్తవిషయాలు కనుగొన్నది మరికొందరు.
స్పాట్
యూరప్ మధ్యయుగంలో ఆయుధ సంపత్తికోసం ప్రయోగాలు చేయనారంబించిండ్రు. అందులో శత్రుసైన్యం పై ప్రయోగించే రసాయనాల తయారీకి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చిండ్రు. ఫిరంగుల్లో వాడే పేలుడు పధార్ధాలు. సలసలా కాగే లావాద్రవంలా శత్రు సైన్యం పై నిప్పుల వాన కురిపించాలనే లక్ష్యంతో ప్రయోగాలు చేపట్టిండ్రు.
బ్రేక్ యాంకర్
యస్..ఈ జీవరాశి మనుగడకు కారణమయిన వాయువేంటి. అసలీ వాయువుని కనుగొనడానికి దారితీసిన పరిస్థితులేంటి. చిన్న బ్రేక్ తరువాత..
యాంకర్ 2
ఈ భూమి పై ఉన్న జీవులన్ని బతకడానికి కారణ మైన వాయువు ఒక్కటే అదే ఆక్సీజన్. అయితే ఈ ఆక్సీజన్.. జీవులు బతకడానికి కారణమైన వాయువేనా ఇంకేమైనా అద్భుతాలు చేయగలదా..ఈ అనుమానం రావడానికి కారణం ఉంది. ఆక్సీజన్ ను కనుగొన్న శాస్త్రవేత్తకు ఎదురైన అనుభవాలేంటి..ఆసక్తికరమైన ఈ ఎక్స్పరిమెంట్ ను మీరే చూడండి.
స్పాట్
భూ అంతర్భాగంలో ఖనిజాలు వెలికితీసే సొరంగ మార్గంలో వాడే లాంతర్లు వెలగడానికి ఇంధనంతో బాటు ఎదో అదృశ్య శక్తి కారణమనే విషయాన్నిగుర్తించారు శాస్తవేత్తలు. పూర్తి ఇంధనం ఉన్నా గాలి తోడు లేకుంటే క్యాండిల్ ఆరిపోవడాన్ని శాస్తవేత్తలు గుర్తిచారు. ఇంతకీ ఈ మంటలను మండించే ఉత్ర్పేరకం ఏంటి..శాస్త్రవేత్తలకు ఇదొక చిక్కు ప్రశ్నగా మారింది. ఈ చిక్కుముడిని విడగొట్టి మనకు ఆక్సీజన్ పరిచయం చేసిన శాస్ర్తవేత్త జోసెఫ్ ప్రీస్ట్ల్ లీ. ఈ నేల పై భూ చరాలు. జలచరాలు, వాయు చరాలు మనుగడ సాగిస్తున్నయంటే దానికి కారణం ఆక్సీజనే. నింగి. నేల, సంముద్రం, ఆకాశం అనే తేడా లేకుండా ప్రతి జీవి జీవక్రియలకు అవసరమైనది ఆక్సీజన్.
స్పాట్
ఈ పచ్చని ప్రకృతిలో ఉన్న స్వేచ్ఛావాయువుల మాటున మర్మాన్ని కనిపెట్టేందుకు ప్రెట్స్ లీ తన శక్తియుక్తులను ధారబోసి మరీ ప్రయోగాలు చేసిండు…ప్రీస్టీ లీ తన ప్రయోగం కోసం రకరకాల పదార్ధాలను వేడి చేసి పరిక్షించిండు. ఇక్కడ కనిపించే పసుపు వర్ణం రసాయనం మెర్క్యురిక్ ఆక్సైడ్.. కొంత పదార్ధన్ని వాచ్ గ్లాస్ లో తీసుకొని దానిని ద్రావణలో వేసి అత్యధిక ఉష్ణోగ్రత వరకు వేడి చేసిండు. ఆ పదార్ధం క్రమేపి నల్లగా మారి ఒక మెరిసే ద్రావణంలా రూపొందింది. ఈ మెరిసే ద్రవం మెటల్ గా గుర్తిచారు. ఇది ద్రవరూప లోహం మెర్క్యురీ..
స్పాట్
పసుపు పచ్చని పదార్ధాన్ని వేడిచేయగా.. మెర్యురీతో బాటు నీటిబుడగలు ఏర్పడటం శాస్ర్తవేత్తలు గమనించిండ్రు.ఈ నీటి బుడగలను గాజుకుప్పె అడుగు బాగంలో పట్టి ఉంచిండ్రు. ఈ వాయువు దగ్గర ఒక వెలిగించిన అగ్గిపుల్లను పెట్టగా అది మరింత కాంతివంతంగా వెలగనారంభించింది. ఆ వెలిగే పుల్లను తీసి ఆర్పివేసి మళ్లీ ఆ గాలిలో ఉంచినా తిరిగి మళ్లీ కాంతిమంతంగా వెలుగుతోంది. అంటే మంట మండటానికి అవసరమైన వాయువు ఆక్సీజన్ అనే విషయం స్పష్టమైంది.
యాంకర్
1774లో ప్రిస్లీ ఆక్సీజన్ ను కనుగొన్నడు. ఎప్పటి నుంచో కొత్త విషయాన్ని ఆవిష్కరించాలన్న తపన ఆక్సీజన్ కనుగొనడంతో తీరింది.
వాయిస్
ప్రిస్లీ ఆక్సీజన్ ను కనుగొనడానికి గాజు జాడీ పాత్ర మరువలేనిది. అతను ప్రయోగం చేసిన గాజుజాడీని అతని గుర్తుగా ఇప్పటికీ పదిలంగా ఉంచిండ్రు. ఆక్సీజన్ను కనుగొన్నంక ప్రీస్లీకి తగిన గౌరవం లభించింది. ప్రెంచ్ ఎక్స్ పరిమెంటల్ లాబరేటరీ కి చెందిన గోల్డెన్ కపుల్స్ మేరియానా, లుథియన్ ల నుంచి ఆహ్వానం అందింది. అక్కడి ప్రయోగ శాలలో పూర్తి స్థాయి నిబద్దత గల ప్రయోగాలకు అనుకూలంగా ఉంది. ప్రతి ప్రయోగం నిర్ణీత కొలతలతో చేయదగిన వీలు ఉంది. మేరియానా దంపతులకు సైన్స్ ను ఆధునిక పద్దతుల్లో తీర్చిదిద్దాలనే బలమైన కోరిక ఉంది. అందుకే వారి లాబ్ లను అధునాతన పద్దతిలో తీర్చి దిద్దిండ్రు. ప్రీస్లీ ఆక్సీజన్నైతే కనుగొన్నాడు కానీ దాని ధర్మాలు పూర్తిగా వివరించలే పోయిండు. ఏదో మండే వాయువుని కనుగొన్నాననే భ్రమలో ఉన్నడు. తరువాత కాలంలో తాను కనిపెట్టిన వాయువు ఎంత గొప్పదో తెలుసుకొని ఆశ్చర్యపోయిండు. ఈ కపుల్స్ లాబరేటరీలో చేసిన ప్రామాణిక పరిశోధనలు ప్రీస్లీకి మంచి ఫలితాన్నిచ్చినయి.
స్పాట్
ప్రీస్లీ సాధించిన ఈ ఘనత ఆధునిక ప్రామాణిక రసాయన శాస్త్రానికి మార్గదర్శకంగా నిలిచింది. రసాయన శాస్త్రంలో కచ్ఛితత్వం పాటించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తయో గూడ నిరూపిత మయింది.
స్పాట్
ఆధునిక రసాయన శాస్త్రం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది.ముందుగా సమాజ అవసరాలు( ఫిరంగి షాట్) తీర్చడానికి ప్రయోగాలు చేపడుతరు. ఈ ప్రయోగాలు చేపట్టడంలో నైపుణ్యాలు తప్పనిసరి. అంతేకాదు రసాయన పదార్ధాల లక్షణాలు తెలిసి ఉండటం ఒక వంతయితే, వాటిని ఏఏ ప్రయోగాలకు వాడుకోవచ్చనే విచక్షణ మరో వంతు. అంటే ఏ పదార్ధాన్ని వేడి చేస్తే..లేదా మరోక ప్రక్రియకు గురిచేస్తే ఇతర వాయువులు వస్తయో తెలిసి ఉండాలి. వీటికి ఎంత పరిమాణంలో రసాయనాలు తీసుకోవాలో కూడా పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణ రసాయన ప్రయోగం అవుతది. ఈ కొత్త రసాయనశాస్రం కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

సైన్స్ ఎపిసోడ్ 13

ఎ.జనార్ధన్
ఇంట్రో
మనం నివసిస్తున్న ఈ భూమి మొత్తం ప్రకృతి రహస్యాల పుట్ట. ఆ రహస్యాల సమాహారాన్ని మీకందించే దిసైన్స్అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
బ్యాంగ్
యాంకర్ 1
ఈ భూమి పై కోటాను కోట్ల రకాల ప్రాణులు ఉన్నయి. ఈ ప్రాణులు ఎలా ఉద్భవించినయి. భగభగ మండే అగ్నిపర్వతం లాంటి భూమి నుంచి ఇన్ని కోట్ల రకాల జాతులు ఎలా పుట్టుకొచ్చినయి. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, ఒకటేమిటి జీవం ఇదీ అదీ అని లేకుండా ప్రకృతి నిండా తొణికిసలాడుతోంది. ఎక్కడిదీ జీవం..ఇది అనాదిగా శాస్ర్తవేత్తల మెదడును తొలుస్తున్న జీవరహస్యం...
జీవరహస్యం బ్యాంగ్.
రిపీట్ యాంకర్
భూమి పై జీవోద్భావ రహస్యాలను తెలసుకోవాలన్న తపన ఇప్పటిది కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి తత్వవేత్తలు, శాస్ర్తవేత్తలు ఈ చిక్కుముడిని విప్పేందుకు ఇప్పటి వరకు ప్రయత్నిస్తునే ఉన్నరు. ఈ చిక్కుముడులన్నీ ఒక్కొక్కటే తొలిగి పోతున్నయి. జీవోద్భవ రహస్యం తెలిసి పోతోంది. ఈ రహస్యాల మూలాలను చూసే ముందు గత వారం మనం చూసిన జీవరహస్యాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం...
రిపీట్ స్టోరీ...
మళ్లీ జీవరహస్యం బ్యాంగ్ కొద్దిగా...
యాంకర్ 2
అవును ఈ విశ్వం మొత్తం బిగ్ బ్యాంగ్ ప్రయోగం ద్వారా ఏర్పడిందనే వాదన ఉంది. అయితే ఈ విశ్వవిస్పోటనంలో మంటలు రేపే మహా ప్రళయం లోంచి జీవ కణాలు ఎలా తయారయ్యాయి. ఈ భూ గ్రహం పైకి నీరెలా వచ్చి చేరింది. ఆ విశ్లేషణలోంచి ఆవిర్భవించిందే ఆక్సీజన్. ఒక్క ఆక్సీజన్ కనుగొనడంతో విషయం పూర్తికాలేదు. ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు ఈ జీవ భాగాహరం లో శేషాలుగా మిగిలిపోయినయి. ఇంతకీ ఏంటా జీవరహస్యాలు...
స్పాట్
ఈ సృష్టిలో ఉన్న కోటాను కోట్ల గెలాక్సీలలో ఒక్క సౌరకుటుంబంలోనే జీవం ఉన్నట్టు ఇప్పటి వరకు దొరికిన ఆనవాళ్లను బట్టి తెలుస్తుంది. ఈ భూమి పై జీవం పుట్టడానికి దారి తీసిన కారణాలు ఏంటి. జీవోద్భవానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి. ఈ విశాల ప్రకృతి నిండా తొణికిసలాడే జీవద్రవ్యం ఎలా వచ్చింది. అన్న ప్రశ్నలు మన శాస్త్రవేత్తలను వేలాది సంవత్సరాలుగా వేదిస్తున్నయి.
స్పాట్
పచ్చని ప్రకృతి.. పిల్లగాలులు.. వెచ్చని వాతావరణం. ఈ భూ గ్రహానికే సొంతం. ఈ సౌరకుటుంబం మొత్తంలో ఒక్క ఈ భూమి పై మాత్రమే జీవ మనుగడ సాధ్యమనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అయితే ఏ జీవావరణాన్ని పరిశీలించినా తేలేది ఒక్కటే..ఈ జీవోద్బవానికి కారణం. నింగి, నేల, ఆకాశం, నీరు, నిప్పు. ఈ పంచభూతాల సంగమంగా నే జీవం ఉద్భవించిందనేది శాస్ర్తవేత్తల వాదన.
స్పాట్
యస్. నిజంగా ఈ పంచభూతాల సాక్షిగా జీవం ఉద్భవించిందనే అనుకుంటే అసలు ఈ పంచభూతాలలోకి నీరు ఎక్కణ్నించి వచ్చిందనే ప్రశ్న కూడా శాస్త్రవేత్తలకు చాలాకాలం చిక్కుముడిగానే మిగిలిపోయింది. అవును మహా విస్పోటనం ద్వారా విడివడి భగభగ మండే భూగోళం ఉపరితలం పైకి నీరెలా వచ్చింది. ఈ ప్రశ్నలన్నిటికి సరైన సమాధానం కనుగొందామనుకున్నా ఆరోజుల్లో నీటిని విశ్లేషించే మార్గం దొరకలేదు. ఈ నీటి గురించి చాలా మంది మేథావులు చేసిన వ్యాక్యానాలు నీటిమీది రాతల్లాగే చరిత్ర గమనంలో చెరిగిపోయాయి. కాని ఆధునిక శాస్ర్త సాంకేతిక పరిజ్ఞానం మరింత పెరిగాక మనిషి గాలిలో ఉన్న ధాతువులను కూడా తేలికగా పసిగట్టగలుగుతున్నడు.
బ్రేక్ యాంకర్
ప్రీస్లీ ఆక్సీజన్నైతే కనుగొన్నాడు గానీ..దీని ఉపయోగాలు పూర్తిగా తెలియలేదు. అసలు జీవ పదార్ధానికి ఆక్సీజన్ కు లింకుందన్న విషయం కూడా అతనికి తెలియదు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఆక్సీజన్ అంటే ఒక మండించే వాయువని మాత్రమే తెలుసు..మరి ఆక్సీజన్ అసలు స్వరూపం ఎప్పుడు బయట పడింది. ఈ సృష్టి నిర్మాణానికి పునాది వేసిన మూలకాల్లో ఆక్సీజన్ కూడా ఒకటన్న విషయం ఎప్పుడు తెలిసింది చిన్న బ్రేక్ తరువాత..
యాంకర్ 3
రసాయన శాస్ర్తం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ..ఎందుకంటే ఒక మూలకం మరొక మూలకంతో సంయోగం చెంది అప్పటి కప్పుడు కొత్త సమ్మేళనంగా రూపుదాల్చడానికి ఎంతో సమయం పట్టదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రిస్ట్లీ ఆక్సీజన్ వాయువును కనుగొన్నడు.నిజానికి మన జీవితంలో జరిగే అద్భుతాల నుంచే చాలా రహస్యాలు వెలుగు చూస్తయి. అటువంటి దే ఇప్పుడు మీరు చూడ బోయేది.
స్పాట్
జీవోధ్భవానికి పంచభూతాల్లో ఒకటైన వాయువు పాత్ర మరవలేనిది. ఇప్పటి వరకు గాలి అంటే..రంగు రుచి వాసన లేనిది. కానీ జోసెఫ్ ప్రీస్ట్లీ ఆక్సీజన్ ను కనుగొన్నంక.. వాయువుకు రంగు రుచి వాసన ఉండగలవని, వీటితో బాటు కొన్ని వాయువులకు ప్రత్యేవమైన ధర్మాలుంటయని తెలియవచ్చింది. ప్రీస్ల్టీ కనుగొన్న వాయువుకు అంత శక్తి ఉంటదని అతనికే తెలియదు. కానీ ఆక్సీజన్ను కనుగొనడం ద్వారా ప్రీస్ల్టీ రసాయన శాస్ర్తంలో ఓ గొప్ప ఆవిష్కరణకు దారి తీశాడన్న సత్యం మరువలేనిది.
స్పాట్
వేల సంవత్సరాల నుంచి మన సంస్కృతీ సంప్రదాయాలతో అనేక విషయాలు ముడివేసుకొని ఉన్నయి.. నిజానికి వాటన్నిటిని మనం కేవలం అద్బుతాలుగానే పరిగణలోకి తీసుకుంటం.కానీ ఆ అద్భుతాల మాటున దాగిన రహస్యమేంటని మాత్రం అలోచించం.. అలా ఆలోచించడం తప్పని కూడా వాదించేవారు లేకపోలేదు. ఎందుకంటే ప్రకృతిలో జరిగే ఈ అద్భుతాలన్నీ దైవ ప్రసాదితమని ఒక బలమైన నమ్మకం.
స్పాట్
ఇదిగో ఇక్కడ వీరు చేసే హడావుడి చూడండి.. వీరంతా ప్రతి సంవత్సరం జరిగే బెలూన్ వేడుకకు హాజరువుతున్నరు. సిటీలో ఉన్న పౌరులంతా ఒక్కచోట చేరి ఈ ఉత్సవాన్ని తిలకిస్తరు.ఇక్కడ నిలువుగా కనిపించే పెద్ద ప్లాస్టిక్ తొడుగుకు తాళ్లు కట్టి వేలాడ దీస్తరు. దీని అంచులకు ఒక రింగు మాదిరి నిర్మాణాన్ని తేలిక రకం దారాలతో కడతారు. బెలూన్కు మద్యలో చుట్టూ తిరుగుకుంట వీరు చేసే ఈ పనిని చుట్టూ హాజరైన ప్రజలు ఆసక్తిగా తిలకిస్తుంటరు. ఈ రింగ్ కట్టడం పూర్తయ్యాక బెలూన్ మద్యలో ఒక పాత్రలో ఎండు గడ్డిపరకలు వేసి మంట పెడతరు. ఈ మంటలో ఒక రకమైన కెమికల్ వేయడం ద్వారా వచ్చే ఆవిరులను బెలూన్ లోకి పంపిస్తరు. ఈ వేడిగాలికి బెలూన్ పైకి ఎగిరిపోకుండ చూట్టూ గట్టిగా పట్టుకుంటరు. ఈ వేడి ఆవిరులు బెలూన్ లో నిండే కొద్దీ బెలూన్ పైకి ఎగబాకుతుంది. ఈ బెలూన్ అమాంత గాలిలోకి ఎగరకుండా మనుషులు గుంజి పట్టుకోవడం తో బాటు బలమైన తాళ్లతో గుంజి కడతరు.
స్పాట్
బెలూన్ నిండా గాలి నిండాక ఒక్కసారి అంతా ఒదిలేస్తరు. అంతే పంజరాన్నివీడిన పక్షిలా బెలూన్ ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోతది. రెక్కలు లేని విహంగంటా పట్టణ ప్రజలకు గుడ్ బై చెప్పుకుంగా నింగిలోకి దూసుకు పోతది. ఈ వింత చూసేందుకు ప్రజలంతా ఇక్కడ చేరినా ఈ బెలూన్ గాలిలోకి ఎగరడం వెనకున్న రహస్యం ఏంటనే విషయం ఎవరికీ తెలియదు.ఈ వేడి బెలూన్ను మొదటిసారి 1783లో ఎగరేసిండ్రు. అప్పటి నుంచి ఈ ప్రక్రియ ప్రజలకు ఒక వింత గానే తోచింది. దశాబ్ద కాలం తరువాత గానీ దీని వెనకున్న మర్మం బయట పడలేదు.
స్పాట్
ఇదిగో ఇక్కడ యువ పరిశోధకులు ఉత్సాహంతో చేసే ప్రయోగం చూడండి. గతంలో ఎండు గడ్డిపరకలతో పంపించే వేడిగాలుల స్థానంలో ఇప్పడు తాజాగా హీట్ వెపర్ మిషన్లు వచ్చేశాయి. ఈ మిషన్ల సాయంతో బెలూన్ లోకి వేడి గాలులను పంపిస్తరు. ఎంతో ఎత్తుకు ఎగిరే బెలూన్ తో బాటూ మనిషి కూడా ఎగిరితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందే ఆలస్యం ..ఈ బెలూన్ కు ఒక తొట్టి కట్టిండ్రు..అంతే ఈ బెలూన్ కు చివర బాగంలో ఒక వెదురు తొట్టి కట్టి అందులో ఇద్దరు నుంచి ముగ్గురు మనుషులు ఎక్కి పైకి వెళ్లడం నేర్చుకున్నరు.
స్పాట్
ఏ యంత్రాలు అవసరం లేని సహజ శక్తిని ఉపయోగించుకొని, మానవుడు భూ ఉపరితలం పై విహంగవీక్షణ చేయడం అలవాటు చేసుకున్నడు. పచ్చని ప్రకృతిని భూమి ఎత్తుల్లోంచి ఆస్వాదించడం అలవాటు చేసుకున్నడు. ఆకాశంలో నుంచి చూస్తే భూమి ఎలా కనిపిస్తదో గమనించిండు.
స్పాట్
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో బెలూన్ లు ఆకాశంలో పక్షుల గుంపుల వలె ఎగరడం మొదలయింది. ఆకాశంలో విహరించడానికి ఇదొక మార్గంగా ఎంచుకున్నడు ఆధునిక మానవుడు. కారణం ఈ బెలూన్ ఎక్కువ బరువును మొయగలగడానికి గల కారణమేంటో కనుగొన్నరు. ఆ సూత్రంతోనే ఈ బెలూన్ ను మరింత ఎక్కువ వాడకంలోకి తెచ్చిండ్రు.
స్పాట్
ఇంతకీ ఈ బెలూన్ ను ఆకాశ వీధుల్లో తిప్పే వాయువు ఏంటి..ఈ బెలూన్ ను గగన విహారం చేయించే అదృశ్య శక్తి ఏంటి..వీటన్నిటికి వెనకున్న రసాయన రహస్యాలేంటి...తేల్చేశారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
బ్రేక్ యాంకర్
గాలిని నింపుకొన్న గాలి బెలూన్‌ అంత ఎత్తుకు ఎగరడానికి కారణం ఏంటి. ఇంతకీ ఆ బెలూన్ ఎగరడం వెనుక ఉన్న రహస్యం ఏంటి. చిన్న బ్రేక్ తరువాత..
యాంకర్ 4
శాస్ర్తవేత్తలకు ఎన్నోరోజులనుంచి ఎదురు చూస్తున్నరోజు రానే వచ్చింది. ఎగిరే బెలూన్ రూపంలొ పరిశోధకులకు ఓ మంచి మార్గం దొరికింది. ఈ ఎగిరే బెలూన్ ను ఆకాశంలో తిప్పే అదృశ్యశక్తి ఏంటి. కనిపెట్టేశారు సైన్టిస్టులు.
స్పాట్
ఇక్కడ ఒక రసాయన శాస్ర్తవేత్త చేస్తున్న ప్రయోగం ఒక్కసారి చూద్దాం. ఈ పటంలో చూపినట్టు ఒక వైపు ఫన్నెట్ ట్యబ్..దానికి కనెక్ట్ చేస్తూ ఒక గ్లాస్ ట్యూబ్ ఉంటది. ఈ గ్యాస్ ట్యూబ్ ఒక ఓవెన్ గుండా వెళ్తది. ఈ ఓవెన్ లోంచి వచ్చే హీట్ ను రెగ్యులరైజ్ చేయడానికి ఐరన్ను వాడుతరు. ఈ ట్యూబ్ ను కాపర్ కాయిల్స్కు కనెక్ట్ చేస్తరు. ట్యూబ్లో రిలీజ్ అయిన వెపర్ను కూల్ చేసి వాటర్ వెపర్ మొత్తం కిందికి సెటిల్ అయి కేవలం గ్యాస్ మాత్రం బయటకు రిలీజ్ అవుతది. ఈ గ్యాస్లో ఆక్సీజన్ తో బాటు మరో మండే వాయువు విడుదల అవుతది. ఈ ఆక్సీజన్ వాయువు కాపర్ తో చర్య చెంది క్యూప్రిక్ ఆక్సైడ్ గా మారుతది. ఇక మిగిలిన వాయువును గాజు జాడీలో బందిస్తరు.
స్పాట్
ఈ వాయువును ఒక గాలి తగలని ప్రదేశానికి తీసుకెళ్లి..జాడీలో మండుతున్న పుల్లను ఉంచగా అది ఇంధనం అంటుకున్నట్టు మరింత కాంతి వంతంగా మండటం గమనించిండ్రు. ఈ వాయువు పేరే హైడ్రోజన్. దీన్ని కనిపెట్టిన శాస్ర్తవేత్త కావెండిష్. అయితే ఈ వాయువుకు హైడ్రోజన్ అని పేరు పెట్టినది మాత్రం లీవోయిజర్.
స్పాట్
హైడ్రోజన్ కనుగొన్నంక దీనిని శాస్ర్తవేత్తలు అనేక ప్రజా ప్రయోజనాలకు వాడుకున్నరు. హైడ్రోజన్ అత్యంత తేలికైన వాయువు. అందుకే హైడ్రోజన్ నింపిన బెలూన్ అత్యంత ఎత్తుకు ఎగరగలదు. అంతే కాదు ఈ వాయువుకు కాస్త మంట తగిలితే చాలు భగ్గున మండుతది. అందకే ఈ హైడ్రోజన్ నింపిన చిన్నచిన్న బెలూన్లను శత్రు సైన్యం మీదికి పంపి వాటిని సూర్యరశ్మితో పేల్చేసే వారు. అంతగా టెక్నాలజి అభివృద్ది చెందని కాలంలో కూడా హైడ్రోజన్ బాంబ్ ను ఉపయోగించి శత్రు సైన్యాన్ని దెబ్బతీసేవారు.
స్పాట్
ఆధునిక శాస్ర్త పరిజ్ఞానం పెరిగాక హైడ్రోజన్ ను రకరకాలుగా వాడుకోవడం మొదలు పెట్టిండ్రు. ఇప్పడు వాహనాలకు ఇందనంగా హైడ్రోజన్ వాయువును వాడుకుంటున్నరు.
స్పాట్
అవును ఇదో పెద్ద విచిత్రం. నీటిని విశ్లేషిస్తే రెండు మండే వాయువులు వెలువడ్డయన్నమాట. అంటే అగ్నికి ఆజ్యం పోసే రెండు వాయువులు అగ్నిని చల్లార్చే నీరుగా మారుతాయన్నమాట. ఇదో ప్రకృతి వింత..మరో జీవరహస్యం.
స్పాట్
అంటే గాలిలో ఉన్న రెండు వాయువులు కలిసి నీటిని ఏర్పరచాయనడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరోటి లేదు. అంటే భగభగ మండుతున్న భూగోళంలో వేడి ఆవిర్లలో విడుదలయిన ఆక్సీజన్, హైడ్రోజన్ వాయువులు కలిసి H2O గా మారినయి. అంటే నీటి ఆవిరిగా మారి తిరిగి ఇదే భూమి పై పడి క్రమేపి భూమి తాపాన్ని చల్లార్చినయన్న విషయాన్ని నిర్ధారించిండ్రు శాస్త్రవేత్తలు.
ఎండ్ యాంకర్
ఇవి ఈ వారం సైన్స్ విశేషాలు మరిన్ని సైన్స్ విశేషాలతో వచ్చే వారం కలుసుకుందా..అంటిల్ దెన్ బైబై..

సైన్స్ ఎపిసోడ్ 14

ఎ.జనార్ధన్‌
ఈ ప్రకృతి పరిణామ క్రమానికి దోహదం చేసింది వాయువేనని శాస్ర్తవేత్తలు కనిపెట్టేశారు. అయితే వాయువు మీద ఎప్పటి నుంచో ఉన్న అభిప్రాయాలు ఒక్కోక్కటే మారిపోసాగినయి. అప్పటి వరకు మంచి వాయువు చెడు వాయువు రెండే రకాలన్న అభిప్రాయం ఉండేది. కానీ వాయువుల్లోనూ అనేక రకాలుంటయన్న నిజం తెలిసింది. ప్రిస్లీ ఆక్సీజన్ ను, లీవోయిజర్, కావెండిష్ లు హైడ్రోజన్ ను కనుగొన్నాక రసాయన శాస్ర్తంలో వాయువుల ప్రాధాన్యత పై మరింత ఆసక్తి పెరిగింది శాస్ర్తవేత్తలకు..
స్పాట్
వాయు రసాయన పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చని వాడు హంఫ్రీ డేవి.
స్పాట్
హంఫ్రీ డేవి...బ్రిటీష్ రసాయన శాస్ర్తవేత్త..ఎన్నో అరుదైన అద్భుతవిషయాలను ఆవిష్కరించిండు. ఆల్కలీ, ఆల్కలీన్ మూలకాలను కనుగొని రసాయన శాస్త్రంలో కొత్త దారులు చూపిడు. నవ్వు తెప్పించే నైట్రస్ ఆక్సైడ్ కనుగొన్నడు. అంతేకాదు. రసాయన పరిశోధనల్లో అత్యంత పాముఖ్యత కలిగిన పొటాషియ, సోడియం, క్లోరిన్ ల ఉపయోగాలను ధర్మాలను కనుగొన్నది కూడా ఇతనే. గనుల్లో కార్మికులకు వెలుతురు పంచే హంఫ్రీ లాంప్ కూడా ఈయన చలువే.. డేవి..ఇంత గొప్ప మేథావి కనుకనే రాయల్ ఇన్స్టిట్యూషన్ కు సెక్రటరీగా కొనసాగిండు.
స్పాట్
హంఫ్రీ డేవి కనుగొన్న రసాయని అద్భుతాలలో నైట్రస్ వాయువు ఒకటి. ఇది వైద్యరంగంలో సర్జరీలు చేయడానికి ఎంతో ఉపకరిస్తున్నది. ఈ వాయువు నొప్పి తెలియకుండా చేయగల సెడేటివ్.ఇది క్లోరోఫాం కంటే ముందే కనుగొన్నరు. దాని కంటే తక్కువ శక్తి కలిగి ఉంటుంది. దీన్ని సాధారణంగా డెంటిస్ట్లు ఉపయోగిస్తారు. అయితే ఆ వాయువు పీల్చినవారు కొద్దిసేపు గాల్లో తేలినట్టు ఒకరకమైన ఆనందంలో ఉంటరు. కొంతమంది చిరునవ్వులు నవ్వితే, కొద్దిమంది గట్టిగానే నవ్వుతారు. అందుకే నైట్రస్ ఆక్సైడ్ని లాఫింగ్ గ్యాస్ అంటారు. ఈ వాయువును మొదట డేవి తన మిత్రులతో విలాసంగా వాడుకునే వాడు. పార్టీలలో తన మిత్రులను ఆట పట్టించడానికి నైట్రస్ ఆక్సైడ్ ను వాడుకొనే వాడు. ఈ వాయువును ఎక్కువగా వాడితే దీనికి బానిస అయ్యే ప్రమాదం లేకపోలేదు. అప్పట్లో డబ్బున్న వారంతా ఈ గ్యాస్ కోసం బారులు తీరేవారు.
స్పాట్
డేవీ.. సహజంగా ప్రకృతి ప్రేమికుడు..చిన్నపాటి కవి కూడా..అందుకే ఆయనకు పచ్చని ప్రకృతి అన్నా, దోరగా కనిపించే పూల గుత్తులన్నా ఎంతో ఇష్టం..ఆ పరిమళాలలో ఉన్న ఆనందం వర్ణ నాతీతమైనదని అతని కవిత్వంలో పేజీలకు పేజీలు రాసుకునే వాడు. ప్రకృతి పచ్చదనంలో, గడ్డిపరకల కదలికలల్లో, పూల ఎదలోతుల్లోంచి వచ్చే పరిమళాలకున్న శక్తి తెలుసుకొని వాటిల్లో ఉన్న ఆనందం ఎంత విలువైనదో తెలుసుకున్నడు. ఈ ప్రకృతిలోని ప్రతి కదలికలో ఏదో తెలియని శక్తిఉన్నదని బలంగా నమ్మేవాడు. ఆ ఆనందం తను కూడా ప్రజలకు అందివ్వాలనే లక్ష్యంతో అనుభూతినిచ్చే ఈ నైట్రస్ ఆక్సైడ్ వాయువును కనుగొన్నానని తన డైరీలో రాసుకొండు డేవి.
స్పాట్
డేవి తన పరిశోధనలన్నీ లండన్లోని ది రాయల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ లోనే చేసిండు. సరిగ్గా రెండొందల సంవత్సారలకు పూర్వమే డేవీ రసాయన శాస్ర్తంలో అద్భుతాలు సృష్టించిండు. ఇప్పడు ఇక్కడ శాస్ర్తవేత్తలు పరిశీలించే ప్రయోగ ఫలితాలు డేవీ ఆరోజుల్లో కనుగొన్నవే..చూడటానికి ఆశ్చర్యాన్ని, భయాన్ని ఒకేసారి కలిగించే ఈ ప్రయోగాలలో ఉన్న మర్మం చూడండి..
స్పాట్
ఇప్పడు మీరు చూసిన ఈ మెరుపులన్నీ సోడియం, పొటాషియం మూలకాలు చేసే చిత్రాలు. వాటిలో ఉన్న ఎక్స్ ప్లోజివ్ పవర్ ఎంత హై రేంజ్ లో ఉంటదో ఇక్కడ కనిపించింది. చిటికెడు కెమికల్ తో మంటలు మండించవచ్చు, ప్రేలుళ్లను సృష్టించవచ్చన్న సూత్రాన్ని ప్రపంచానికి తెలపిన మహాశయుడు డేవి.
స్పాట్
డేవి ప్రయోగాల తరువాత రసాయన శాస్ర్తం ప్రజల్లోకి వెళ్లింది. రసాయన శాస్ర్తంలో తాను కనుగొన్న మూలకాలకు ఎంతో ప్రాముఖ్యం లభించింది. ఇదిగో ఇక్కడ శాస్ర్తవేత్తలు చేసే ప్రయోగం చూడండి. ఈ ప్రయోగాన్ని డేవీ రెండొందల ఏండ్లకు ముందే చేసిండు. తెల్లటి పొడిని ఒక చిన్న ఇనుప తొట్టిలో పోసి, దాన్ని ముందు మంటతో వేడి చేస్తరు. ఆ తరువాత వేడి అందలోకి ఎలక్ట్రిసిటీ పంపిస్తరు..అంతే..చిటపట మనుకుంటూ వేడివేడి పొగలు కక్కుకుంటూ తారా జువ్వల్లా పేలిపోతుంటది. అవును ఇది పెద్దపెద్దబ్లాస్టింగ్ లల్లో ఉపయోగించే పొటాషియం..పొటాషియం ఎంత పెద్దపెద్ద పనులు చేయగలదో తన ప్రయోగాల ద్వారా నిరూపించిండు డేవి.
స్పాట్
ప్యూర్ పొటాషియం ను చిన్న చిన్న బిళ్లలుగా కోసి..ఒక చిన్న ముక్కను తీసుకొని దానిని ప్రయోగ ద్రావణంలో వేయగానే ఒక్కసారి పెద్దగా పొగలు కక్కుతూ పేలిపోవడం గమనించిండ్రు. అదే తరువాత కాలంలో పేలుడు పదార్ధాల తయారీకి పునాదిగా మారింది.
స్పాట్
18వ శతాబ్దం దాటి 19వ శతాబ్దం మద్యకాలంలో రసాయన శాస్త్రంతో ప్రజలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకుంది. రసాయనాలంటే కేవలం పదార్ధాలే కాదు..వాతావరణం, చెట్టూ చేమ అన్నీ అని తెలిసింది.. ఇది జమైకాలోని ఒక పర్యాటక ప్రాంతం.. ఆ రోజుల్లో మలేరియా జ్వరం ప్రజలను పీడించే మహమ్మారి. దానికి సరైన మందు లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నరు. ఎన్ని రకాల మందులు కనిపెట్టినా మలేరియా బారి నుంచి ప్రజలను కాపాడలేని పరిస్థితి. అప్పుడు ప్రకృతి రసాయనాల వైపు చూశారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఇక్కడ పచ్చగా కనిపిస్తున్న ఈ చెట్టు పేరు సింకోనా మొక్క. ఇది ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిన మలేరియాకు కళ్లేం వేసిన చెట్టు. దీని బెరడు మలేరియాకు చక్కని దివ్యౌషదం. ఈ బెరడు కొంచె ముక్క కోసుకొని నోట్లో వేసుకుంటే వగరు, చేదు కలిపిన రుచుల్లో ఉంటది. ఈ విషయం తెలుసుకున్నాక సింకోన మొక్కలను విరివిగా పెంచడాన్ని ప్రోత్సహించినయి ప్రభుత్వాలు.
స్పాట్
ఈ మొక్క చేసిన మేలు అంతా ఇంతా కాదు. వాస్తవానికి 1820లో ఈ సింకోనా మొక్క బెరడులో ఇంత సంక్లిష్ట రసాయనం ఉంటుందని ఒక ఫ్రెంచ్ శాస్ర్తవేత్త కనుగొనే వరకు ఎవరికీ తెలియదు. దానికే క్వినైన్ అని పేరు పెట్టిండు.
స్పాట్
సింకోనా మొక్క నుంచి క్వినైన్ తయారు చేయాలంటే ఎంతో ప్రయాసతో కూడిన పని. మొక్క పెరిగి దాని బెరడు ముదిరి పక్వానికి వచ్చే వరకు నిరీక్షించాలి. అంతేకాదు లక్షలాది మంది ప్రజలకు కావలసిన మందును సమకూర్చడానికి వేలాది ఎకరాల్లో సింకోనా పండించాలి. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా క్పినైన్ కెమికల్ ను తయారు చేయడం ఛాలెంజ్ గా తీసుకున్నరు శాస్ర్రవేత్తలు. ఈ క్వినైన్ ను ఇతర అవసరాలకు కూడా వాడుతరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచాలన్నిరంగులమయం చేయడంలో క్వినైన్ పాత్ర మరువలేనిది.
స్పాట్
19వ శతాబ్దంలో విలియం హెన్రీ పెర్కిన్ చేసిన అద్భుత ప్రయోగం ఈ ప్రపంచాన్నిరంగుల వలయంలో ముంచింది. ఇక్కడ మనకు కనిపిస్తున్న పురాతన భవనం పెర్కిన్ ప్రయోగాలు నిర్వహించిన భవనం. ఇక్కడ ఒక శాస్ర్తవేత్త పెర్కిన్ ప్రయోగాలను పునరావృతం చేయడం చూడవచ్చు.
విద్యుత్ లైట్లు అంతగా ఉపయోగంలోకి రాని ఆ కాలంలో ఎక్కువగా గ్యాస్ లైట్లు వినియోగించే వారు. ఈ గ్యాస్ లైట్లను వెలిగించడానికి బొగ్గును కూడా వాడే వారు. వీటి ఉప ఉత్పత్తి ఈ కోల్తార్. ఈ కోల్ తార్ తో బాటు హైలీ టాక్సిక్ సబ్స్టెన్సెస్ క్వినైన్ ను, పొటాషియం డై క్రోమేట్, సల్ఫ్యూరిక్ ఆసిడ్, ఎనలీన్ ల నుపయోగించి మొట్టమొదటి రంగును తయారు చేసిండ్రు. ఈ ఎనలీన్ లో కార్భన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సీజన్లు కూడా ఉంటయి. ఈ మిశ్రమాలన్నీ కలిపితే ఇదిగో ఈ గాజు జాడీలో లాగా నల్లని ప్రెస్పిటేషన్ తయారవుతది. ఈ కొంచెం పౌడర్ కు డైల్యూటెడ్ సల్ఫూరిక్ ఆమ్లాన్ని కలిపి క్లాత్ కు అప్లై చేసిండు. అంతే మొట్ట మొదటి సింథటిక్ కలర్ ను సృష్టించిన ఘనత హెన్రీ పెర్కిన్స్ ఖాతాలో చేరిపోయింది.
స్పాట్.
ఇది విక్టోరియన్ డ్రెస్. ఎప్పుడైతే క్వినైన్ కలర్ కనిపెట్టబడ్డదో అప్పటి నుంచే ఫాషన్ ప్రపంచానికి పునాదులు పడ్డయి. అంతే రసాయన శాస్ర్తంలో ఇండస్ర్టీయల్ కెమిస్ర్టీ కళ్లుతెరుచుకుంది. పారిశ్రామిక రసాయన శాస్ర్తంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది పెర్కిన్స్ కలర్ డై థియరీ. 1870 వ దశకంలో పెర్కిన్స్ అండ్ హిస్ సన్స్ సంస్థలు రంగుల తయారీ పరిశ్రమలను విరివిగా స్థాపించినయి. పెర్కిన్స్ బ్లూ తో మొదలయి వివిధ వర్ణాల వస్త్రాలు అందుబాటులోకి వచ్చినయి. అందుకే పెర్కిన్ పాథర్ ఆఫ్ ఇండస్ర్టీయల్ కెమిస్ట్రీ అయిండు.
స్పాట్
ఇండస్ర్టీయల్ కెమిస్టీ కాస్త అమ్మోనియా తయారికి దారితీసింది. ఇది మన పంట పొలాలలో వాడే ఎరువు. పెరుగుతున్న జనాభాకు తగిన దిగుబడి రావాలంటే పంటలకు తగిన పోషకాలు అందాలి. నేలలో సరియైన పోషకాలు లేకుంటే పంట దిగుబడి పడిపోయేది. కానీ అమ్మోనియా కనుగొనడం ద్వారా నత్రజని రహిత నేలల్లో కూడా బంగారు పంటలు పండించే అవకాశం కలిగింది.
స్పాట్
రసాయనశాస్ర్తంలో వచ్చిన మార్పులు ఆఖరుకు యుద్దంలో కూడా శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడానికి తొడ్పడ్డయి. ఖాకీ సైన్యానికి రసాయన ఆయుధాలు మరింత బలాన్నిచ్చినయి. అంతేకాదు కొత్తగా కనిపెట్టిన క్లోరిన్ ఈ యుద్దంలో వేలాది మందిని శవాలుగా మార్చింది. లక్షలాది మందిని పాక్షికంగా వికలాంగులను చేసింది.
స్పాట్
ఒక పదార్ధం ఒక రూపం నుంచి మరో రూపంలోకి ఎలా మారగలుగుతుంది. ఒక పదార్ధం మరో పదార్ధంతో కలిసి కొత్త పదార్ధంగా ఎలా మారుతుంది. ఆ ఏర్పడిన కొత్త పదార్ధం రెండు పాత పదార్దాల లక్షణాలను మించి మరో కొత్తపదార్దంగా ఏర్పడంటంలో ఉన్న మర్మమేంటి..ఇంతకీ అసలు పదార్థపు అణువుల్లో ఏముంది..ఆలోచన వచ్చింది మానవుడికి..అన్వేషణ మొదలయింది.
స్పాట్
నింగి, నేల, ఆకాశాన్ని ఆవరించి పదార్ధాలన్నీ అణువుల నిర్మితాలని కనిపెట్టేశారు శాస్ర్తవేత్తలు. అయితే ఈ పదార్ధాలన్నీ అనేక అణువుల మద్య బలమైన బంధాలతో నిర్మితమవుతయి. ఈ అణువులో ఏముంటుంది. ఈ ప్రశ్నకు అంత తేలికగా సమాధానం దొరకలేదు.ఎంత వెదికినా అణువు అనేది విచ్ఛేదన రహితమైనదనే భావించిండ్రు. తరువాత పరమాణువు ఉంటదని కనిపెట్టారు. అంతకుమించి సూక్ష్మపదార్ధం లేదని బలంగా భావించిండ్రు. అప్పడే క్రూక్స్ తన ఆవిష్కరణతో పరమాణువులో ఉన్న రహస్యాన్ని పటాపంచలు చేసిండు.
స్పాట్
విలియం క్రూక్స్ కు భూత ప్రేతాల వంటి అదృశ్యశక్తులు చేసే అద్భుతశక్తుల కథలంటే ఇష్టం. వాటిని చూడాలని తహతహలాడేవాడు. వాటిలాగే తానూ అదృశ్య అద్భుతాలు చేయాలని ఉబలాట పడేవాడు.
స్పాట్
ఇది క్రూక్స్ తయారు చేసిన గాజు నాళం..ఇందులో పూర్తిగా శూన్యప్రదేశం ఉంటుంది. రెండు వైపులా రెండు ఎలక్ర్టోడ్లు అమర్చబడి ఉంటయి. ఈ రెండు ఎదురెదురుగా ఉండే ఎలక్ట్రోడ్ల మధ్య హై ఓల్టేజ్ విద్యుత్ సరఫరా చేసి చూశాడు క్రూక్స్. అంతే విచిత్రం తానే ఊహించని ఒక అద్బుత శక్తి కనిపించింది. రెండు ఎలక్ర్టోడ్ ల మధ్య ఒక కాంతి పుంజం కనిపించింది.ఈ కాంతిపుంజం ఒక కొస నుంచి మరో కొసకు కదులుతున్నట్టు కనిపించింది. ఈ ఉత్సాహం తగ్గకముందే క్రూక్స్ మరో ప్రయోగం చేసిండు. ఈ క్రూక్స్ నాళం పై దండాయస్కాంతాన్నుంచి ప్రయోగం చేసిండు. ఎప్పుడైతే అయస్కాంత కాంత పుంజం పైకి వచ్చిందో అప్పుడు కాంతి పుంజం దానికి వ్యతిరేకంగా వంగడం గమనించిండు క్రూక్స్. అంటే కాంతి పుంజాన్ని ప్రభావితం చేసే శక్తి ఏదో ఉన్నట్టు గమనించిండు.
స్పాట్
అయస్కాంత శక్తికి ఒక వైపు వంగిన కాంతి పుజాన్ని గమనించిన క్రూక్స్ వెంటనే మరో రకమైన గ్లాస్ నాళాన్ని తయారు చేసి, అందులో ఒక పారలాల్ వీల్ తిరిగే విధంగా ఏర్పాటు చేసిండు. ఇప్పుడు రెండు ఎలక్ర్టోడ్ ల మధ్య హై ఓల్టోజ్ ఎలక్ట్రిసిటీని పంపిండు. ఆశ్చర్యం రెండు ఎలక్ర్టోడ్ లమధ్య అమర్చిన చక్రం వేగంగా తిరగనారంభించింది. చక్రం గుండ్రంగా తిరుగుతూ ఒక వైపు నుంచి మరోవైపుకు కదలడం క్రూక్స్ గమనించిండు. ఏదో అదృశ్య పదార్ధం చక్రాన్ని తిప్పుతందనే సత్యాన్ని తెలుసుకున్నడు. ఇంతకీ ఆ అదృశ్యపదార్ధం ఏంటి..ఈ విషయాన్నికనుగొనడానికి భౌతిక రసాయన శాస్త్రాలు రెండు ఏకమయ్యాయని చెప్పాలి.
స్పాట్
ఈ ప్రయోగాల ఫలితం అణుసిద్దాంత ఆవిష్కరణకు దారి తీసింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అణురహస్యం గురించి పూర్తి ప్రయోగాలు జరిగినయి.
ఇక్కడ కావెండిష్ లాబరేటరీలో జె.జె థామ్సన్ చేసిన ప్రయోగాలు అణు రహస్యాన్ని ఛేదించడంలో ప్రముఖ పాత్రపోషించాయనే కంటే అసలు అణురహస్యాన్ని ఛేదించాయని చెప్పటమే కరెక్ట్. క్రూక్స్ నాళంలో చక్రాన్ని తిప్పే పదార్థపు రేణువులు పరమాణువుకంటే చాలా చాలా చిన్నవనే విషయాన్ని గుర్తించిండు థాంప్సన్.అంతేకాదు ఈ రేణువులు పరమాణువు కంటే వేయిరెట్లు చిన్నవన్న విషయాన్ని కూడా నిర్ధారించుకున్నడు. ఈ ఆవిష్కరణకు ఆయనకు 1906లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది.
స్పాట్
పదార్ధం మొత్తం విభిన్న రకాల అణువుల సమ్మేళంనం. అందులో కర్భన, నత్రజని, పాస్ఫరస్, ఇంకా రకరకాల పరమాణువులు ఉండవచ్చు. ఇవన్నీ ఒకే పదార్ధంగా కనిపిస్తయి. సూక్ష్మంగా పరిశీలిస్తేనే వీటి అసలు స్వరూపం తెలుస్తది. ఈ పరమాణువును లోతుగా అధ్యయనం చేస్తే పదార్ధం మూడు రకాల పార్టికిల్స్ తో తయారవుతదని కనిపెట్టిండ్రు. అవి ప్రోటాన్, ఎలక్ర్టాన్, న్యూట్రాన్ లు. ప్రోటాన్, న్యూట్రాన్లు పరమాణు కేంద్రకంలో ఉంటే ఎలక్ర్టాన్ లు కేంద్రకం చుట్టూ తిరుగుతుంటయి. ఇవి తమ తమ కక్ష్యల్లో తిరుగుతుంటయి. పరమాణు రహస్యం మానవుని గుప్పిట్లోచిక్కింది. అప్పడు తెలిసింది. మనకు శూన్యంగా కనిపించేదేది శూన్యంగా లేదని, నింగి నేల, గాలి జీవం నిర్జీవం అన్నీ అదృశ్యం పదార్ధాలతోనే నిర్మితమయ్యామనే సత్యం బోధపడింది శాస్ర్తవేత్తలకు. ఈ సృష్టి మొత్తం ఎలక్ర్టాన్ ,ప్రోటాన్, న్యూట్రాన్ లు తప్పమరో పదార్ధం లేదని అయితే ఇవి అమరి ఉండే విధానాన్ని బట్టి పదార్ధ స్వరూపం మారుతుందనే విషయాన్ని తెలుసుకున్నరు. పరమాణువులో ఎలక్ర్టాన్ లు కేంద్రకం చుట్టూ తిరుగుతుంటయి. పరమాణువు చిన్నపాటి సౌరకుటుంబాన్ని పోలి ఉంటది. సూర్యుని చుట్టూ గ్రహాలు తమ కక్ష్యల్లో తిరుగుతున్నట్టు, ఎలక్ర్టాన్లు, కేంద్రకం చుట్టూ మినీ ప్లానెట్ల మాదిరి తిరుగుతూ ఉంటయి. అవి కూడా తమ కక్ష్యల్లో..
స్పాట్
పదార్దం విచ్ఛేదనంలో పురోగతి సాధించాం..పరమాణువులో ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ఉంటయనే సత్యంతో బాటు విశ్వం మొత్తం ఈ పదార్దాలతో నిర్మితమైనదే అనే విషయం స్పష్టమయింది. ఈ సిద్దాంతంలో నుంచే నీల్స్ బోర్, ఐన్ స్టీన్ ల సిద్దాంతాలు పుట్టుకొచ్చినయి. నీల్స్ బోర్ పరమాణువులో ఎలక్ర్టాన్ స్వరూప స్వబావాన్ని వివరిస్తే, ఐన్ స్టీన్ పదార్ధం మొత్తం ఒకే రకాలైన కణాలతో నిర్మితమైనవి కావున పదార్ధం కొత్తగా సృష్టించ బడదు, నాశనం కాబడదు. అనే విశ్వసూత్రాన్ని ఆవిష్కరించిండు.
స్పాట్
1945లో ప్రపంచం మొత్తం విశ్వ శాంతి ఉత్సవాలు జరుపుకుంటోంది. ప్రజలంతా ఆనందోత్సాహాల్లో నిమగ్నమైన తరుణంలో ఈ ఆధునిక శాస్ర్త పరిజ్ఞాన ఫలాలు కొత్త కొత్త ఆవిష్కరణలకు చేసేందుకు మరింత ఉత్సాహాన్నిచ్చింది.